Connect with us

Featured

Director Bobby: చిరంజీవి రాజకీయాలకు పనికిరారు… అందుకు పవన్ మాత్రమే సరైనోడు… డైరెక్టర్ బాబీ కామెంట్స్ వైరల్!

Published

on

Director Bobby: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా మంచు గుర్తింపు పొందిన డైరెక్టర్ బాబి తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వైజాగ్ లో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ బాబి చిరంజీవి గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ చిరంజీవి అన్నయ్యకు రాజకీయాలు ఏమాత్రం పనికిరావని తెలిపారు. ఆయనకు దేవుడు ఒక తమ్ముడినీచ్చాడు. రాజకీయాలకు పవన్ సరైనోడనీ బాబి తెలిపారు.

చిరంజీవి గారు రాజకీయాలలో ఉండి ఎవరిని కూడా ఎదిరించి మాట్లాడలేరు కానీ చిరంజీవి గారిలో ఉన్న మంచితనం ఆవేశం కలిస్తే పవన్ కళ్యాణ్ ఆయన ఎవరికైనా ఎలాంటి సమాధానమైనా చెప్పగలరు. మాటకు మాట కత్తికి కత్తి అన్నట్లుగా ఉంటారని బాబి తెలిపారు.అయితే ఒకరోజు తాను మీరెందుకు రాజకీయాలలో ఇతరులను ఎదిరించలేరు అని అడిగినప్పుడు వాళ్లకు కూడా అమ్మ నాన్నలు అక్కచెల్లెళ్ళు ఉంటారు కదా వాళ్లు బాధపడతారని ఎంతో సౌమ్యంగా అన్నయ్య ఒకరోజు నాతో చెప్పారని బాబి గుర్తు చేసుకున్నారు.

Advertisement

Director Bobby: రవితేజ అవకాశం ఇవ్వడం వల్లే ఈ స్థాయిలో ఉన్నా….

ఇక చిరంజీవి అభిమానిగా ఇండస్ట్రీలో తన ప్రస్థానం మొదలైంది. ఇండస్ట్రీలోకి వచ్చిన 20 సంవత్సరాలకు ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టమని తెలిపారు. ఇక నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు గల కారణం రవితేజ.ఆయన నన్ను నమ్మి సినిమా ఇవ్వడం వల్లే డైరెక్టర్ గా నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నానని ఈ సందర్భంగా బాబీ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Featured

Nag Aswin: నాగ్ అశ్విన్ కి ఆ హీరోయిన్ అంటే అంత సెంటిమెంట్ నా.. ఆమె ఉంటే హిట్ గ్యారెంటీ?

Published

on

Nag Aswin: సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా కొనసాగుతున్న నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన దర్శకుడిగా కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వరుస అప్డేట్స్ విడుదల చేయడమే కాకుండా వరుస ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటున్నారు.

ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు హిట్ సెంటిమెంట్ రిపీట్ కాబోతుందని తద్వారా ఈ సినిమా కూడా హిట్ అవుతుందని తెలుస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ నాగార్జునకు ఒక హీరోయిన్ అలాగే ఒక హీరో హిట్ సెంటిమెంట్ గా మారారని అందుకే తన సినిమాలలో వీరిద్దరిని కచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నారని తెలుస్తోంది.

నాగ్ అశ్విన్ సినిమా చేస్తున్నారంటే తప్పనిసరిగా విజయ్ దేవరకొండ మాళవిక నాయర్ వీరిద్దరూ ఉండేలా ఈయన జాగ్రత్త పడుతున్నారట. నాగ్ అశ్విన్ చేసిన ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి కల్కి ఈ మూడు సినిమాలలో వీరిద్దరూ నటించారు నటించిన ఇదివరకు సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి అందుకే ఈ కల్కి సినిమాలో కూడా విజయ్ దేవరకొండతో పాటు మాళవిక నాయర్ ఉండేలా అశ్విన్ జాగ్రత్త పడ్డారు.

Advertisement

విజయ్ దేవరకొండ.. మాళవిక నాయర్..
ఈ హిట్ సెంటిమెంట్ ప్రకారం ఈయన కల్కి సినిమా ద్వారా మరో సక్సెస్ అందుకోబోతున్నారంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటివరకు ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో అనుకున్న స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేదు కానీ ఈ సినిమాకు మాత్రం ఫ్రీ బుకింగ్స్ భారీగా జరగడంతో సినిమాపై కూడా అంచనాలు అలాగే ఉన్నాయి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: వారాహి అమ్మవారి దీక్షలో పవన్ … అందుకే దీక్ష వేశారా?

Published

on

Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల పరంగా ఎన్నో బాధ్యతలను తీసుకొని పెద్ద ఎత్తున అధికారులతో సమావేశాలు సమీక్షలను నిర్వహిస్తూ అన్ని శాఖలపై ఆరా తీయడమే కాకుండా అధికారులకు సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక పవన్ కళ్యాణ్ తరచూ ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా ప్రజా సమస్యలను క్షణాలలోని పరిష్కరిస్తూ ఉన్నారు. ఇలా రాజకీయాల పరంగా ఎంతో బిజీగా అయిన పవన్ కళ్యాణ్ తాజాగా వారాహి అమ్మవారి దీక్ష వేశారు. 11 రోజులపాటు పవన్ కళ్యాణ్ ఈ దీక్షలోనే ఉండబోతున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష వేయడంతో ఈ దీక్ష గురించి పెద్ద ఎత్తున అందరూ తెలుసుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధిస్తారనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తన వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టుకోవడమే కాకుండా గతంలో కూడా ఎన్నోసార్లు వారాహి అమ్మవారి పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇక ఈ ఏడాది కూడా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను 11 రోజులపాటు వేయబోతున్నారు.

Advertisement

11 రోజుల దీక్ష..
ఈ 11 రోజులు పవన్ కళ్యాణ్ ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకాకుండా కేవలం పండ్లు, ద్రవాలను మాత్రమే తీసుకోబోతున్నారు. అయితే ఈ విధంగా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష వేయడానికి గల కారణం ఏంటనే విషయాన్ని వస్తే ఎన్నికలలో తన విజయం కోసమే ఈయన అమ్మవారికి మొక్కుకున్నారని అయితే ఎన్నికలలో విజయం సాధించడంతో అమ్మవారి మొక్కు తీర్చడం కోసం ఇలా దీక్ష వేశారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Puri Jagannadh: పూరి జగన్నాథ్ కు పోకిరి కంటే ఆ సినిమా డైలాగ్స్ అంటే అంత ఇష్టమా?

Published

on

Puri Jagannadh: పూరి జగన్నాథ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరూ కూడా ఈయన డైరెక్షన్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వాళ్ళే.

ఇక పూరి జగన్నాథ్ సినిమాలు చాలా భిన్నంగా ఉంటాయి ఈయన సినిమాలలో హీరోలకు ఇచ్చే ఎలివేషన్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఈయన సినిమాలలో హీరోలు అందరూ కూడా కాస్త పొగరుగా ఉండేలాగే చూపిస్తూ ఉంటారు. ఇక ఈయన సినిమాలలో డైలాగ్స్ కూడా భారీ స్థాయిలో పేలుతూ ఉంటాయి. ఇక ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈయన డైరెక్షన్ చేసిన సినిమాలలో పోకిరి సినిమా మరో లెవల్ అని చెప్పాలి.

ఈ సినిమాలో మహేష్ బాబు నటన ఆయన చెప్పిన డైలాగ్స్ భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇలా ఇంత మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమాలోని డైలాగ్స్ అంటే తనకు పెద్దగా ఇష్టం లేదని పూరి ఓ సందర్భంలో వెల్లడించారు. తనకు పోకిరి సినిమా కంటే బిజినెస్ మాన్ సినిమాలో డైలాగ్స్ అంటే చాలా ఇష్టమని ఈయన తెలిపారు.

Advertisement

బిజినెస్ మాన్..
ఈ సినిమాలో నన్ను కన్ఫ్యూజ్ చేయకండి కన్ఫ్యూజన్లో ఎక్కువగా కొట్టేస్తా అని చెప్పే డైలాగ్స్, ముంబైకి ఉచ్చ పోయించడానికి వచ్చా అంటూ డైలాగ్స్ బారి స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అయితే ఈ సినిమాలో డైలాగ్స్ అంటేనే తనకు ఇష్టం అంటూ పూరి జగన్నాథ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక పూరి విషయానికొస్తే ప్రస్తుతం ఈయన డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!