YS Sharmila : జగనన్న విడిచిన బాణంగా తెలుగు రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ షర్మిల రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా వైఎస్ జగన్ చెల్లిగా రాజకీయాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా అన్నకు అండగా నిలబడిన షర్మిల ప్రస్తుతం తెలంగాణలో కెసిఆర్ నియంత్రత్వ పాలనపై మరోసారి పోరాటం చేస్తానంటూ తెలంగాణ లో పార్టీ పెట్టింది. ఇక రాజకీయంగా మరోసారి తానేంటో చూపించడానికి సిద్ధమైన షర్మిల అపుడు అన్న కోసం పోరాడితే ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం కెసిఆర్ తో పోరాడుతా అంటోంది.
రెండు పెళ్లిళ్లు… ప్రభాస్ తో ఎఫైర్..
షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ముద్దుల కూతురు. చిన్నతనం నుండే రాజకీయాలంటే పెద్దగా షర్మిల కు ఇష్టం లేదు. దీనికి కారణం తండ్రి కుటుంబంతో తక్కువగా గడపడమే. తనకు ఐదేళ్లు వచ్చేసరికి తండ్రి ఎమ్మెల్యే అవడం, బిజీగా రాజకీయాల్లో ఉండటంతో నాన్నతో సమయం గడపాలేకపొవడానికి కారణం ఈ రాజకీయాలే అనే భావన షర్మిల లో ఉంది. ఇక పులివెందులలో చదువుకున్న షర్మిల అన్న జగన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుతున్నాడని తాను అక్కడే చదువుకుంది. ఇక చెన్నై లో ఏంబిఏ చదువు పూర్తి చేసుకున్న వెంటనే రాజశేఖర్ రెడ్డి గారు కూతురుకి మేనమామ చంద్ర ప్రతాప్ రెడ్డిని ఇచ్చి వివాహం చేశారు. అయితే ఆ పెళ్లి షర్మిలకు ఇష్టం లేకపోయినా తండ్రి మాట కాదనలేక చేసుకున్నారు. పెళ్లి అయిన 6 నెలలకే వారి మధ్య మనస్పర్తల కారణంగా విడిపోవాలని భావించి షర్మిల పుట్టింటికి వచ్చింది. ఇక ఆపైన విడాకులు తీసుకుంది.
Advertisement
ఆ పైన హైదరాబాద్ లో కుటుంబంతో గడిపిన షర్మిల, స్నేహితులతో కలిసి పార్టీస్ కి వెళ్ళినపుడు కామన్ ఫ్రెండ్ ద్వారా అనిల్ పరిచయం అవగా తనతో ప్రేమలో పడింది. ఇక ఇంట్లో చెప్పగా మొదట రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచించినా చివరకు 1995 లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అనిల్ కుమార్ మొదట బ్రాహ్మిన్ కాగా పెళ్లయ్యాక క్రిస్టియన్ గా మారారు. వారికి ఇద్దరు పిల్లలు రాజారెడ్డి, అంజలి. అయితే షర్మిల తన అన్న కోసం చేసిన పాదయాత్ర ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అదే సమయంలో నటుడు ప్రభాస్ తో తనకు ఎఫైర్ ఉంది అనే ప్రచారం జరగడంతో దానిమీద హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసారు. అలాగే మీడియా ముందు ఆ విషయంలో క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక హీరో ప్రభాస్ కూడా నేనింతవరకు వైఎస్ షర్మిల గారిని నేరుగా కలిసింది లేదు కానీ ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అంటూ అవన్నీ ఒట్టి పుకార్లే అంటూ క్లారిటీ ఇచ్చారు.
Rajamouli: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు డైరెక్టర్ రాజమౌళి. ఈయన దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇక తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత రాజమౌళికి దక్కుతుందని చెప్పాలి. ఇలా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
రాజమౌళి కెరియర్ లో వచ్చిన మగధీర సినిమా ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాలి. మొదటిసారి ఇలాంటి సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు అయితే ఈ సినిమా సమయంలో తాను ఎంతో కంగారు పడ్డానని అప్పటికే ఇది చాలా భారీ బడ్జెట్ కావడంతో ఒక రకమైన భయం ఉండేదని తెలిపారు.
ఇక తన సినిమాలలో అందరిలాగే స్టార్ హీరోయిన్లనే పెట్టుకోవాలని నేను అనుకుంటాను. కానీ నేను రాసుకున్న కథకు అనుగుణంగా ఏ హీరోయిన్ అయితే సెట్ అవుతుందో వారినే తీసుకుంటాను. ఆ హీరోయిన్ కు వరుసగా ప్లాపులు వచ్చిన ఆమె ఐరన్ లెగ్ అంటూ ట్రోల్స్ ఎదుర్కొన్న తాను వాటిని లెక్క చేయను. మగధీర..
Advertisement
ఇలా ఆ హీరోయిన్ హిస్టరీ గురించి నేను ఏమాత్రం ఆలోచించనని నా పాత్రకు సూట్ అయితే తప్పనిసరిగా వారికి అవకాశాలు ఇస్తాను అంటూ ఈ సందర్భంగా హీరోయిన్ల గురించి రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈయన మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది.
Venu Swamy: బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ 8 కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా వేణు స్వామి సందడి చేయబోతున్నారనే సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమం ఆగస్టులోనే ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన లిస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో వేణు స్వామి కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు స్వామి బిగ్ బాస్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
ఇలా ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలోకి రాబోతున్నారని తెలియగానే ఈ కార్యక్రమం పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈయన కారణంగా రేటింగ్స్ కూడా భారీగా వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే వేణు స్వామి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటూ అందుకోబోయే రెమ్యూనరేషన్ గురించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
లక్షల్లో రెమ్యునరేషన్..
Advertisement
దేశ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ తీసుకొని రెమ్యూనరేషన్ ఈయన అందుకోబోతున్నారని తెలుస్తోంది. వేణు స్వామి వారానికి లక్షల్లోనే రెమ్యూనరేషన్ అందుకునే విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు సమాచారం. మరి వేణు స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని ఆయన రెమ్యూనరేషన్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు. ఈమె హైదరాబాదులో రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ బిజినెస్ చేసుకుంటూ జీవనం గడిపేది అయితే ఈమె చాలా తక్కువ ధరకే కడుపునిండా భోజనం పెట్టడంతో ఈమె గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్లి తనతో ఇంటర్వ్యూ తీసుకోవడంతో ఒక్కసారిగా ఈమె పాపులర్ అయ్యారు.
ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె ప్రస్తుతం సెలబ్రిటీగా మారిపోయారని చెప్పాలి. ఎన్నో కార్యక్రమాలలో కూడా కుమారి ఆంటీ సందడి చేశారు. ఇక త్వరలోనే కుమారి ఆంటీ బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.
ఈ విధంగా కుమారి ఆంటీ రోజురోజుకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకోవడంతో ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఆమె వద్దకు వచ్చి ఆమె ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్దకు సినీ నటుడు సోను సూద్ వచ్చి ఒక్కసారిగా సర్ప్రైజ్ ఇచ్చారు. కుమారి ఆంటీని కలిసిన ఈయన ఆమెతో సరదాగా మాట్లాడి తన కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Advertisement
మహిళా సాధికారత.. మహిళా సాధికారత కష్టపడే తత్వానికి కుమారి ఆంటీ నిదర్శనమని సోను సూద్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా తనకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానని వెంటనే నాకు తెలియజేయాలి అంటూ ఆమెకు ధైర్యం చెప్పారు. ఇక సోను సూద్ గురించి కుమారి ఆంటీ మాట్లాడుతూ.. ఎంతోమందికి సహాయం చేసిన సోను సూద్ కి ఏమిచ్చినా తక్కువే అంటూ కుమారి ఆంటీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.