Connect with us

Featured

“దాంపత్యం” చిత్ర ప్రారంభోత్సవంలో విగ్గు తీసి నేల కేసి కొట్టి షూటింగ్ స్పాట్ నుండి కోపంగా వెళ్ళిపోయిన ANR !!

Published

on

అక్కినేని తొమ్మది దశాబ్దాల జీవితం అందరికీ తెరిచిన పుస్తకం. జీవితంలో ఎలా ముందుకు రావాలి.. ఓ మనిషికి పట్టుదల ఎంత అవసరం అనేవి అక్కినేని జీవితం పరిశీలిస్తే అర్థమవుతుంది. కృషీవలుడిగా పుట్టి కృషిలో ఉన్న ఖుషీని గుర్తించి.. నిషాను ఆస్వాదించిన ఒక మధురమూర్తిగా తయారవయ్యారు అక్కినేని. ఇండస్ట్రీ అంటే అవలక్షణాలకు నిలయమని ఎప్పట్నుంచో ఓ పేరుంది. అలాంటి చోటు నుంచి వచ్చిన అక్కినేని ఏనాడూ దేనికి బానిస కాలేదు. అన్నింటికీ దూరంగా ఉన్నారు. ఓ యోగిలా జీవనం గడిపారు. అలాగే తెలుగు సినీ రంగంలోని అగ్ర కథానాయకులకి 1980, 90 దశకాల్లో ఘన విజయాల్ని అందించిన దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి. మాస్‌ అనే మాటకి అసలు సిసలు అర్థం చెప్పిన కోదండరామిరెడ్డి… వరుస విజయాలతో తెలుగు సినిమా వాణిజ్యాన్ని కొత్త పుంతలు తొక్కించారు. వీళ్లిద్దరి ప్రతిభా పాటవాలకు నిదర్శనంగా నిలుస్తుందని చెప్పడానికి వీరిద్దరి మధ్య యదార్ధంగా జరిగిన ఒక సంఘటనను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ANR గారు చెన్నై నుండి హైదరాబాద్ వచ్చి స్థిరపడిన రోజుల్లో ANRతో సినిమా తియ్యాలంటే హైదరాబాద్ లో మాత్రమే షూటింగ్ జరుపుకోవాలి. కేవలం పాటల చిత్రీకరణ కోసం మాత్రమే ANR చెన్నై వెళ్లేవారు. అప్పట్లో కోదండరామిరెడ్డి డైరెక్టర్ గా, అక్కినేని హీరోగా “దాంపత్యం” అనే సినిమాను ప్లాన్ చేశారు నిర్మాతలు. కోదండరామిబి రెడ్డి డైరెక్టర్ గా బిజీగా ఉన్న రోజులవి. సినిమా ముహూర్తం డేట్ ఫిక్స్ చేశారు నిర్మాతలు. అయితే చెన్నైలో డే & నైట్ షూటింగ్ లతో గంట కూడా తీరిక లేని కోదండరామి రెడ్డి, ముహూర్తం షాట్ కు హైదరాబాద్ కు రావడం కుదరని పరిస్థితులలో, ఆయన ANR గారికి ఫోన్ చేసి.. ముహూర్తం షాట్ చెన్నైలో అంటే ANRకు అసలు నచ్చదని తెలిసీ కూడా “సార్ ముహూర్తం షాట్ చెన్నైలో పెట్టుకుందామా.?” అని ధైర్యం చేసి రిక్వెస్ట్ చేస్తూ అడిగేసారు. అందుకు బదులుగా ANR “సరే ఆలోచించి చెబుతా” అని ఫోన్ పెట్టేశారు. ఆ మర్నాడు ANR, డైరెక్టర్ కోదండరామిరెడ్డికి ఫోన్ చేసి “చెన్నై స్టూడియోలలో వద్దు, ఔట్ డోర్ షూటింగ్ అయితే చూద్దాం” అని అన్నారు. ఆ జవాబు కోసమే ఎదురుచూస్తున్న కోదండరామిరెడ్డి వెంటనే “పాటతో షూటింగ్ ప్రారంభిద్దాం, విజిపి గార్డెన్స్ గానీ లేక విజయ గార్డెన్స్ లో ముహూర్తం షాట్ పెట్టుకుందాం” అనేశారు.

అప్పుడు ANR.. “సరే మళ్ళీ ఆలోచించి చెబుతా” అని ఫోన్ పెట్టేశారు. ఆ తర్వాత ANR నిర్మాతలకు ఓ కే చెప్పినట్టున్నారు. చెన్నైలో ముహూర్తం షాట్ కు ఏర్పాట్లు పూర్తి అయాయి. ANR షూటింగ్ స్పాట్ కు మేకప్ తో రెడీ అయి వచ్చారు. పూజా కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత ANR.. “ఏదీ ఒకసారి పాట విందాం ప్లే చేయమన్నారు” పాట వింటున్నప్పుడు సడెన్ గా ఒకచోట ANR గారి మొహంలో రంగులు మారిపోయాయి. అక్కడ దొర్లిన ద్వందార్థం అంత ఇబ్బందికరమైనది కాకపోయినా.. చెన్నైలో ముహూర్తం షాట్ విషయంలో అసలే చిరాగ్గా ఉన్న ANRకు కోపం తారాస్థాయికి చేరుకుంది. ఒక్కసారిగా కుర్చీలోంచి దిగ్గున పైకి లేచి, కోపంగా.. “ANR నటిస్తున్న సినిమా ఇది. నా మీద షూట్ చేస్తున్న ఈ పాటలో ఆ డబుల్ మీనింగ్ పదాలు వాడతారా.. ఏమనుకుంటున్నారు నన్ను.? జూనియర్ ఆర్టిస్ట్ లా కనబడుతున్నానా.? ఈ సినిమాలో నేను నటించాను. ఈ డైరెక్టర్ తో కలిసి పని చెయ్యను” అని అరుస్తూ.. అంతే కోపంతో విగ్గు తీసి నేల కేసి కొట్టి షూటింగ్ స్పాట్ ను వదిలి వెళ్ళిపోయారు. సినీ ప్రారంభోత్సవానికి వచ్చిన పాత్రికేయులు, సినీ ప్రముఖులు ANR కోపాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

ఇక ఈ సినిమా షూటింగ్ అటకెక్కినట్లే అని అనుకుంటూ అక్కడనుంచి నిష్క్రమించారు. హడలిపోయిన నిర్మాతలు ఎలాగోలా ధైర్యం చేసుకుని ANR రూం కు వెళ్ళి బతిమాలినా ఆయన కోపం చల్లారలేదు. “డైరెక్టర్ ను మార్చితీరాల్సిందే” అని తేల్చి చెప్పేశారు. ఆ తర్వాత నిర్మాతలు ఆ చిత్ర డైరెక్టర్ కోదండరామిరెడ్డి వద్దకు రాగా.. కోదండరామిరెడ్డి కూడా వాళ్లతో.. “ఆ పదం నచ్చకపోతే మార్చమని చెబితే మారుస్తాము కదా.. ఆ మాత్రం దానికి విగ్గు తీసి నేల కేసి కొట్టి ANR గారు వెళ్ళిపోయారా.? నేను కూడా ఈ సినిమా చెయ్యను” అని నిర్మాతలకు చెప్పేసి వేరే సినిమా నిర్మాణంలో నిమగ్నమైపోయారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత తాను చేసిన తప్పును గ్రహించిన ANR హుందాగా దర్శకుడు కోదండరామిరెడ్డి వద్దకు వెళ్ళి సారీ చెప్పారు. వెంటనే కోదండరామిరెడ్డి “మీరు నాకు సారీ చెప్పడమేమిటి సార్.? సినిమా మళ్ళీ మొదలుపెడదామా.? అనడిగితే.. వెంటనే ANR “చేద్దామయ్యా” అని అనేయడం.. వెంటనే “దాంపత్యం” సినిమా షూటింగ్ మొదలై శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని ఆ సినిమా విడుదల కావడం.. 100 రోజులు ఆడడం చకా చకా జరిగిపోయాయి. ANR గారి గొప్పతనం ఏమిటంటే.. చాలా సందర్భాలలో ఈ వివాదం గురించి ఏమీ దాయకుండా.. ఇలా జరిగింది అంటూ జరిగింది జరిగినట్టు ఉన్న విషయాన్ని అందరికీ ఆయనే వివరంగా చెప్పేవారు. ఎంతైనా నాటితరం నటుల జీవన విధానమే వేరు.. ఆ దర్జాయే వేరు..

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!