Connect with us

Featured

అప్పట్లో అవుట్ డోర్ షూటింగ్స్‌కి వెళితే చెట్ల చాటునే హీరోయిన్స్ అవన్నీ చేసేవారట..!

Published

on

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎనలేని మార్పు వచ్చాయి. కథ, బడ్జెట్, హీరో హీరోయిన్స్ రెమ్యునరేషన్, సినిమా మేకింగ్, టెక్నాలజీ ఇలా ఇప్పుడు కొత్తగా చేరిన రెండు విభాగాలు సహా 24 విభాగాలలో జనరేషన్ తో పాటు సాఫ్ట్ వేర్ డెవలప్‌మెంట్ వల్ల ఊహించని మార్పులు వచ్చాయి. ఇప్పుడు సినిమాకి సంబంధించి ఏది మాట్లాడినా కోట్లలోనే అంటున్నారు. రచయిత కథ రాయాలంటే ఏ ఊటికో వెళ్ళి సిట్టింగ్ వేయాలి. గతంలో మాదిరిగా నాలుగు గోడల మధ్యనో లేక స్టూడియోలోనో కూర్చుంటేనో కథ పుట్టడం లేదు. మన పూరి జనగన్నాథ్ అయితే కొత్త ఐడియా రావడం ఆలస్యం బ్యాంకాక్ వెళ్ళిపోతారు.

Advertisement

ఒక్క పూరి జగన్నాథ్ మాత్రమే కాదు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శక, రచయితలు కథ రాయాలని వేరే ప్రదేశాలకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడి నుంచి నిర్మాతకి మొదలైన ఖర్చు ఫస్ట్ కాపీ వచ్చి థియోటర్స్‌లో బొమ్మ పడేవరకు మంచి నీళ్ళలా డబ్బు ఖర్చు చేస్తూనే ఉంటాడు. మ్యూజిక్ డైరెక్టర్స్ సిట్టింగ్ అని ఎక్కడికో వెళ్ళడం మామూలైపోయింది. పబ్లిసిటీ కూడా డిజిటల్ ఫార్మాట్ అంటూ ఎన్ని రకాలుగా చేయాలో అన్నీ రకాలుగా చేస్తున్నారు.  ఆ రోజుల్లో సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడగానే ఓ రిక్షాలో త్వరలో విడుదల, మీ అభిమాన థియోటర్స్‌లో నేడే విడుదల అంటూ మైక్ పట్టుకొని చెప్తూ తిరిగేవారు.

ఇప్పుడు సోషల్ మీడియాలోనే సినిమా ప్రమోషన్స్ జరిగిపోతున్నాయి. ఓ స్మార్ట్ ఫోన్ ఉంటే చేతిలో ప్రపంచాన్ని చూడొచ్చు. అలాగే కావాల్సిన సినిమాను ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు. అందుకే హీరో, హీరోయిన్స్ రెమ్యునరేషన్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. మెగాస్టార్ చిరంజీవి పెళ్ళి చేసుకునే సమయానికి ఆమె అందుకునే రెమ్యునరేషన్ 50 వేలట. ఆ 50 వేలు ఇప్పుడు దేనికీ సరిపోతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా బడ్జెట్ సగం అయితే హీరో, హీరోయిన్స్ అందుకునే రెమ్యునరేషన్..వాళ్ళ మెయింటైనెన్స్ సగం బడ్జెట్ అవుతోంది.

ఓ స్టార్ హీరోయిన్ కి కథలో పెద్దగా స్కోప్ లేకపోయినా ఆమె ఉంటే క్రేజ్ వస్తుందని హీరో పాటల కోసం కోటి నుంచి రెండు మూడు కోట్లు ఇచ్చి మరీ తీసుకు వస్తున్నారు. వీరికి మేకప్, కాస్ట్యూం చేంజ్, హెయిర్ స్టైల్ కోసం అలాగే పర్సనల్‌గా కూర్చొని రిలాక్స్ అవడానికి ఓ క్యారవ్యాన్ పెట్టాలి. దాదాపు ఇప్పుడున్న స్టార్ హీరోలందరికి సొంతగా ఖరీదైన క్యారవ్యాన్ ఉంది. కానీ హీరోయిన్స్ సౌకర్యం కోసం అద్దెకి ఇలాంటి క్యారవ్యాన్స్ తీసుకు రావాల్సిందే. లేదంటే హీరోయిన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు.

అదే ఆ రోజుల్లో అయితే అవుట్ డోర్ షూటింగ్స్ వెళ్ళినప్పుడు మేకప్ వేసుకునే దగ్గర్నుంచి భోజనాల వరకు అన్నీ చెట్ల కిందనే జరిగిపోయేవి. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారి అనుమతులు తీసుకొని అల్లూరి సీతారామరాజు, అడవి దొంగ, కొండవీటి దొంగ, అడవి రాముడు లాంటి ఎన్నో సినిమాలు అడవుల్లో చేశారు. అక్కడ కనీసం టెలిఫోన్ సదుపాయం కూడా ఉండేది కాదు. అంతెందుకు సిటీకి చాలా దూరం ఫారెస్ట్ లొకేషన్ ఉంటే రాత్రిళ్లు అక్కడే ప్రొడక్షన్స్ వ్యానుల్లో, సొంత కారూలోనూ గడిపేవారు.

అంతేకాదు సీన్స్ కోసం హీరోయిన్స్ గానీ, హీరోలు గానీ ఇతర ఏ ఆర్టిస్టులైనా డ్రెస్ ఛేంజ్ చేసుకోవాలంటే చెట్ల చాటుకు వెళ్ళి ఛేంజ్ చేసుకునేవారు. అన్నీ ఇబ్బందులు పడి కూడా హీరోయిన్స్ దర్శక నిర్మాతలకి సపోర్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు చిన్న విషయానికే అలిగెళ్ళిపోతున్న హీరోయిన్స్ ఉన్నారంటే ఎన్ని మార్పులు, యాటిట్యూడ్ వచ్చాయో అర్థం చేసుకోవచ్చు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Jani Master: జానీ మాస్టర్ కి బిగ్ షాక్… అవార్డు వెనక్కి తీసుకోవాలటూ ఆదేశాలు?

Published

on

Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల అత్యాచార కేసులో భాగంగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన ఈయన మద్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈయన తన అసిస్టెంట్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తనని అరెస్టు చేశారు.

Advertisement

ఇలా రిమాండ్ లో ఉన్నటువంటి ఈయన పోలీసు విచారణలో పలు విషయాలను తెలిపారు. ఇకపోతే ఇటీవల జానీ మాస్టర్ కి కోర్టు మద్యంతర బెయిల్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ ఆరో తేదీ నుంచి పదవ తేదీ వరకు ఈయనకు బెయిల్ ఇస్తున్నట్టు కోర్ట్ వెల్లడించారు.

ఈ విధంగా జానీ మాస్టర్ బయటకు వస్తున్నారని సంబరపడేలోపు ఈయనకి ఊహించని షాక్ తగిలింది. జానీ మాస్టర్ పై ఆరోపణలు రావడానికి కంటే ముందుగా ఈయన 70వ జాతీయ అవార్డు ప్రకటనలో భాగంగా ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఇలా జానీ మాస్టర్ నేషనల్ అవార్డు అందుకోవడం ఇది రెండోసారి.

అవార్డు వెనక్కి…
ఇలా నేషనల్ అవార్డుకు ఎంపికైన తరువాత ఈయన పట్ల లైంగిక ఆరోపణల కేసు నమోదు కావడంతో జాతీయ అవార్డు సమితి ఈ అవార్డును వెనక్కి తీసుకోబోతున్నారు.మాస్టర్ పై ఫోక్సో కేసు నమోదు కావడంతో కమిటీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇలా జానీ మాస్టర్ కు జాతీయ అవార్డు వచ్చిందని సంతోష పడిన అభిమానులకు ఈ విషయం తెలియగానే ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈ విషయంపై జానీ మాస్టర్ స్పందన ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Balakrishna: కొండా సురేఖ కామెంట్స్ పై స్పందించని బాలయ్య బాబు.. కారణం అదేనా!

Published

on

Balakrishna: తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై టాలీవుడ్ ఒక్కసారిగా భగ్గుమంది. ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అవి కాస్త టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అక్కినేని కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ విషయం తెలిసిందే. దాంతో ఇప్పటి వరకు ఆమె చేసిన వ్యాఖ్యలపై చాలామంది సెలబ్రిటీలు స్పందించారు. అంతేకాదు తమ సోషల్ మీడియా వేదికగా కొండా సురేఖపై విమర్శలు చేస్తూ ట్వీట్లు, పోస్టులు పెట్టారు. ఒకరకంగా చెప్పాలంటే అక్కినేని నాగార్జునకు తమ నైతిక మద్దతు ప్రకటించి తాము ఉన్నామని భరోసాను ఇచ్చారు.

Advertisement

అయితే ఒక స్టార్ హీరో మాత్రం అసలు స్పందించలేదు. ఇప్పుడా స్టార్ హీరో ఎందుకు రియాక్ట్ కాలేదన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆ హీరో మరెవరో కాదు బాలయ్య బాబు. నాగార్జున కుటుంబం మీద కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై బాలకృష్ణ రియాక్ట్ కాలేదు. అయితే ఆయన పాత విషయాలను మరచిపోలేదా, అందుకే స్పందించలేదన్న చర్చ జరుగుతోంది. అయితే అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా బాలకృష్ణ పెద్ద ప్రెస్ నోటే ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు బాలయ్య సైలెంట్‌ గా ఉన్నారంటూ టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది.

కారణాలు అవే అంటూ..

అయితే బాలయ్య బాబు రియాక్ట్‌ కాకపోవడానికి రెండు కారణాలు ఉండవచ్చనీ టాక్ వినిపిస్తోంది. ఒకటి తన అక్క నారా భువనేశ్వరిపై వైసీపీ వాళ్ళు కామెంట్స్ చేస్తే నాగార్జున కనీసం స్పందించలేదని బాలకృష్ణ మనసులో పెట్టుకుని ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు నాగార్జున వైసీపీకి మద్దతు దారుడని, బాలయ్య టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం బిజీలో ఉండి మర్చిపోయి ఉంటారన్న వాదన వినిపిస్తున్నారు. కారణం ఏదైనా అందరి మద్దతు దొరికిన నాగార్జునకు,బాలయ్య మద్దతు లభించకపోవడం మాత్రం చర్చనీయాంశం అవుతోంది. మరి నిదానంగా అయినా బాలయ్య బాబు ఈ విషయంపై స్పందిస్తారేమో చూడాలి మరి.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Devara 2: దేవర2 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన తారక్.. షూటింగ్ అయ్యిందంటూ!

Published

on

Devara 2: కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ మంచి సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఇప్పుడు వరకు ఈ సినిమా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు మరిన్ని కలెక్షన్లను సాధిస్తోంది దేవర సినిమా. ప్రస్తుతం దేవర సినిమా లాభాల బాట పట్టింది. దసరా హాలిడేస్ కూడా ఉండటంతో 500 కోట్ల టార్గెట్ పెట్టుకుంది దేవర.

Advertisement

తాజాగా దేవర మూవీ యూనిట్ సక్సెస్ మీట్ కూడా చేసుకున్నారు. ఈ సినిమా విడుదల అవ్వడంతో అభిమానులు దేవర 2 గురించి చర్చించుకుంటున్నారు. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఏమో అని మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే దేవర రిలీజ్ సమయంలో ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లి అక్కడ ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే. బియాండ్ ఫెస్ట్ లో పాల్గొనడం, అక్కడి మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇవ్వడం చేసారు. హాలీవుడ్ లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ దేవర పార్ట్ 2 గురించి, కొరటాల శివ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈ మేరకు ఎన్టీఆర్ మాట్లాడుతూ.. దేవర రిజల్ట్ బాగుంది. పార్ట్ 2 కూడా ఉంటుంది.

మేజర్ సీన్స్ అయిపోయాయి..

ఆల్రెడీ కథ సిద్దమైపోయింది. దాన్ని ఇంకా బాగా రాసుకోవాలి. దేవర పార్ట్ 2లో ఒక రెండు మేజర్ సీన్స్ కూడా షూటింగ్ అయిపోయింది. డైరెక్టర్ కొరటాల శివకు మొత్తం అన్ని వదిలేసి ఒక నెల రోజులు రెస్ట్ తీసుకో, హాలిడేకు వెళ్ళు అని చెప్పాను. ఆ తర్వాత వచ్చి మళ్ళీ దేవర 2 మీద వర్క్ చేయమని చెప్పాను. దేవర 2 పార్ట్ 1 కంటే ఇంకా పెద్దగా గొప్పగా అంటుంది అని తెలిపారు తారక్. ఇక ఈ సందర్భంగా తారక్ చేసిన వ్యాఖ్యలను మరోసారి వైరల్ చేస్తున్నారు అభిమానులు. ఇక తారక్ మాటలను బట్టి చూస్తే కొరడాల శివ నెక్స్ట్ సినిమా దేవర2 అని తెలుస్తోంది. పార్ట్2 పూర్తి అయిన తర్వాతనే తదుపరి సినిమాకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా పూర్తవ్వగానే దేవర 2 షూట్ మొదలుపెడతాడని సమాచారం.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!