Connect with us

Featured

Koratala Siva : ఆచార్య ప్లాప్ లో కొరటాలను మాత్రమే బలి చేసారంటూ అభిమానుల ఆరోపణ… సపోర్ట్ ఇస్తున్న మహేష్, ఎన్టీఆర్ ఫ్యాన్స్..!

Published

on

Koratala Siva : ఆచార్య సినిమా ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాల్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. ఇద్దరు పెద్ద హీరోలు, అందునా మెగాస్టార్ తన తనయుడితో మొదటి సారి కలిసి నటించడం, దీంతో సినిమా మీద అంచనాల నడుమ సినిమా ప్లాప్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతవరకూ ఓటమి చూడని దర్శకుడు కొరటాలకు మొదటి పరాజయం. అదీకాక సినిమా మొదటి రోజు వసూళ్లు రాకపోవడం విడ్డూరం. సినిమా ఎలా ఉన్నా మొదటి రోజు పెద్ద హీరో సినిమాలకు కలెక్షన్స్ కచ్చితంగా ఉంటాయి. అభిమానులు మొదటి రోజు సినిమాకు వెళ్లడమే కారణం. కానీ ఆచార్య విషయంలో మరి మొదటి రోజు కూడా వసూళ్లు రాకపోవడం విశ్లేషకులను, సీనియర్ నిర్మాతలు, డైరెక్టర్స్ ను కూడా ఆశ్చర్య పరిచింది.

Advertisement

సినిమా ప్లాప్ అయి నింద కొరటాల మీద…

సినిమా డిజాస్టర్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. కర్ణుడి చావుకు వంద కారణాలను అన్న చందంగా ఆచార్య ప్లాప్ అవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ సినిమా ప్లాప్ అవ్వగానే మెగా అభిమానులు నింద మాత్రం కేవలం కొరటాల మీదకు నెట్టేసారు. సినిమా సరిగా స్క్రీన్ ప్లే లేదని కథ సరిగా క్యారీ చేయలేదంటూ విమర్శించారు. కానీ ఒక్క దర్శకుడినే అలా నిందించడం ఎంత వరకూ సరైంది. అంతవరకూ హిట్లు ఉన్న కొరటాల కు డైరెక్షన్ తెలియక సినిమా ప్లాప్ అయ్యిందా అన్నట్లు గా ఆయనను ట్రోల్ చేసారు. ఇక నష్టపోయిన డిస్టిబ్యూటర్లు చిరంజీవిని, కొరటాలను నష్టపరిహారం అందించాలని కోరుకున్నారు.

ఇక కొరటాల వారికి హామీ కూడా ఇచ్చారు రికవరీ చేయిస్తానని. ఇక తాజాగా మరోసారి డిస్ట్రిబ్యూటర్లు ఆయనను కలిసి నష్టం పుడ్చాలని అడిగారు. దీనికి ఆయన త్వరలోనే ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఇక ఇపుడు ఈ విషయం బయటకు రావడంతో కొరటాల అభిమానులు కొరటాల ను మాత్రమే నిందించడం కరెక్ట్ కాదని ట్విట్టర్ లో # justice for koratalasiva ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక దీనికి ఎన్టీఆర్, మహేష్ అభిమానులు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. కొరటాలను మాత్రమే నిందించకూడదని అంటున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ కు మిగిలిన హీరోల ఫ్యాన్స్ కు ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతోంది. మెగా ఫ్యాన్స్ కొరటాల డైరెక్షన్ చేసుకోకుండా బిజినెస్ లో వేలు పెట్టకుండా ఉండి ఉంటే బాగుండేది అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Rashmika: ఆ నొప్పిని భరిస్తేనే హీరోయిన్స్ అవుతాం.. రష్మిక సెన్సేషనల్ కామెంట్స్!

Published

on

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈమె చివరిగా యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అప్పటి నుంచి ఎలాంటి సినిమాలు విడుదల కాలేదు కానీ ప్రస్తుతం ఈమె నటిస్తున్న సినిమాలన్నీ కూడా షూటింగ్ దశలో ఉన్నాయి.

Advertisement

ఇక త్వరలోనే ఈమె నటించిన పుష్ప 2 సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఇక పుష్ప సినిమాలో రష్మిక డీ గ్లామర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే గతంలో ఈమె తన పాత్ర గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

డీ గ్లామర్ పాత్రలో నటించాలి అంటే మామూలు విషయం కాదు. మేకప్ వేయటం కోసమే ఎన్నో గంటల సమయం పడుతుంది. అయితే ఇలాంటి పాత్రలో నటించడం కోసం రష్మిక చాలా ఇబ్బందులు పడినట్లు ఈమె తెలిపారు.. మేకప్ కోసం గంటలు కూర్చుని వేయించుకోవాలని మేకప్ ఎక్కడ చెరిగిపోతుందోనని కొన్నిసార్లు మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా కేవలం లిప్స్ ఒక్కటే క్లియర్ చేసుకొని జ్యూస్ మాత్రమే తాగేదానినని తెలిపారు.

మేకప్ రిమూవ్..
ఇక ఇలాంటి మేకప్ వేసుకున్న తర్వాత దానిని రిమూవ్ చేయాలంటే ఎంతో నొప్పిగా ఉండేది అలాంటి నొప్పిని మనం భరించినప్పుడే హీరోయిన్స్ గా సక్సెస్ అవుతాము అంటూ రష్మిక పుష్ప సినిమాలోని డీ గ్లామర్ పాత్ర గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Nagachaitanya: ఆ కారణంతోనే రేస్ కార్ల జోలికి వెళ్ళలేదు…చైతన్య కామెంట్స్ వైరల్!

Published

on

Nagachaitanya: సినీ నటుడు నాగచైతన్య ప్రస్తుతం కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈయన డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా దాదాపు 80% షూటింగ్ పూర్తి చేసుకుంది. సుమారు 80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement

ప్రస్తుతం నాగచైతన్య ఈ సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా నాగచైతన్య తాజాగా తనకు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. చిన్నప్పటినుంచి కూడా నాగచైతన్యకు రేసింగ్ అంటే చాలా ఇష్టం అనే సంగతి పలు సందర్భాలలో వెల్లడించారు. తనకు ఏదైనా కొత్త రకం బైక్ లేదా కారు కనిపిస్తే అసలు ఆగలేనని వెంటనే డ్రైవ్ చేస్తానని నాగచైతన్య తెలిపారు.

ఇటీవల కాలంలో తాను కార్ రేసింగ్ జోలికి వెళ్లలేదని ఈయన తెలిపారు. ప్రస్తుతం ఒకవైపు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండటం వల్ల కుదరలేదని అదేవిధంగా నా స్నేహితులు తాను ఈ అలవాటు మానుకుంటే మంచిదని చెప్పడంతో ఈ అలవాటును కాస్త తగ్గించుకుంటున్నానని తెలిపారు. తాను రేస్ వెళ్లేటప్పుడు చాలా వేగంగా వెళ్తాను అందుకే ఈ అలవాటు మానుకోమని తన స్నేహితులు చెప్పారని చైతన్య వెల్లడించారు.

జాలరి నేపథ్యంలో..
ఇక తండేల్ సినిమా విషయానికి వస్తే నిజ జీవిత కథ ఆధారంగా ఓ జాలరి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత నాగచైతన్య పలు సినిమాలలో నటించిన సక్సెస్ అందుకోలేకపోయారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Allu Aravind: చరణ్ ను టార్గెట్ చేసిన అల్లు అరవింద్… అల్లుడికి పోటీగా రానున్న తండేల్!

Published

on

Allu Aravind: సినీ ఇండస్ట్రీలో స్టార్ ఫ్యామిలీలుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన మెగా ,అల్లు ఫ్యామిలీ మధ్య గత కొంతకాలంగా బేదాభిప్రాయాలు ఉన్నాయనే మాట వాస్తవమే అని తెలుస్తోంది. ఎప్పుడైతే అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వచ్చారో అప్పటినుంచి ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిపోయింది. ఈ ఘటన తర్వాత ఎన్నో వేడుకలు జరిగినప్పటికీ ఈ రెండు కుటుంబాలు కలిసి కనిపించలేదు.

Advertisement

ఈ క్రమంలోనే ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో కూడా ఎన్నో వార్తలు వినిపించిన వాటిని ఖండిస్తూ ఇటు మెగా ఫ్యామిలీ గాని అటు అల్లు ఫ్యామిలీ గాని క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు నిజమేనని అందరికీ స్పష్టత వచ్చింది. అయితే తాజాగా మరో ఘటన కూడా వీరి మధ్య భేదాభిప్రాయాలు నిజమైనని రుజువు చేస్తోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ డైరెక్షన్లో నటించిన గేమ్ ఛేంజర్ సినిమా డిసెంబర్లోనే విడుదల కావలసి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ విడుదల చేయాలని దిల్ రాజు భావించారు. అదే రోజు చిరంజీవి విశ్వంభర కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో చిరంజీవిని బ్రతిమలాడి అదే రోజుకు రాంచరణ్ సినిమాని విడుదల చేస్తున్నారు.

రామ్ చరణ్ కు పోటీగా చైతన్య..
ఇలా రామ్ చరణ్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకు పోటీగా ఉండకుండా సంక్రాంతి బరిలో దిగగా అల్లు అరవింద్ మాత్రం తన అల్లుడు రామ్ చరణ్ ను టార్గెట్ చేశారని తెలుస్తుంది. అల్లు అరవింద్ నిర్మాతగా చందు మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి నాగచైతన్య జంటగా నటిస్తున్న తండేల్ సినిమాని చరణ్ సినిమాకు పోటీగా విడుదల చేయటానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాని జనవరి 14వ తేదీ విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలబడునుంది. ఇలా అల్లుడు పోటీగా మామ బరిలోకి దిగడంతో ఈ రెండు కుటుంబాల మధ్య భేదాభిప్రాయాలు నిజమేనని అభిమానులు భావిస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!