Connect with us

Featured

AP: సంతలోకి వచ్చిన మద్యం విక్రయాలు… ఇదెక్కడి చోద్యం ?

Published

on

AP: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీని అమలులోకి తీసుకువచ్చారు. ఈ పాలసీ ప్రకారం టెండర్లు వేసి లక్కీ డ్రా నిర్వహించి షాపులను కేటాయించి మద్యం విక్రయాలను ప్రారంభించారు. అయితే ఎన్నికల హామీలలో భాగంగా చంద్రబాబునాయుడు చెప్పిన విధంగానే 99 రూపాయలకే క్వార్టర్ మద్యం ధరను అమలులోకి తీసుకువచ్చారు.

Advertisement

ఇలా నూతన మద్యం పాలసీలో భాగంగా ప్రతి ఊరిలో కూడా బెల్టు షాపులు ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాలలో బెల్ట్ షాప్ లేకపోవడంతో ఏకంగా మద్యం సంతలో కూడా విక్రయిస్తూ కనిపించడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. పాతవూరు, సంతమార్కెట్, సజ్జాపురం, కోనాల, దువ్వ తదితర ప్రాంతాల్లో బెల్టు దుకాణాలు ఎక్కువగా ఏర్పాటయ్యాయి.

ఈ నేపథ్యంలో సంత మార్కెట్ వద్ద మద్యం అమ్మకాలు చేస్తున్న వైనాన్ని ఆదివారం ఓ వ్యక్తి ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. ఓ వ్యక్తి మద్యం ఇలా సంతలో పెట్టుకుని కూర్చుని ఉన్నారు. ఈ ఫోటోలను కాస్త సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఎక్సైజ్ శాఖ సంఘటన స్థలానికి చేరుకున్నారు అయితే అప్పటికే ఆ వ్యక్తి అక్కడి నుంచి పోయారు.

మార్కెట్లో మద్యం..
ఇకపై ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఇలా మార్కెట్లో కూడా మద్యం లభించడంతో ఎంతోమంది ఈ విషయంపై విభిన్న రకాలుగా చర్చించుకుంటున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Pushpa 2: పుష్ప2 పై హైప్ పెంచేసిన అనసూయ.. ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్ అంటూ?

Published

on

Pushpa 2: పుష్ప 2 కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా రాబోతున్న పుష్ప 2 సినిమా కోసం అంతే ఆత్రుత కనబరుస్తున్నారు.

Advertisement

ఈ సినిమా డిసెంబర్ ఆరో తేదీ విడుదలకు సిద్ధమైంది అయితే అనుకున్న సమయాని కంటే ముందుగానే ఒక రోజు విడుదల కాబోతుందని ఇటీవల నేషనల్ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా మేకర్స్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను కూడా తెలిపారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాలో దాక్షాయిని పాత్రలో నటిస్తున్న అనసూయ కూడా బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు.

ఈ వేదికపై నాగార్జున అనసూయని ప్రశ్నిస్తూ..పుష్ప సినిమాలో మంగళం శ్రీనును లేపేస్తాను అంటూ బెదిరిస్తున్నావు. ఈ సినిమాలో నీ క్యారెక్టర్ తో దడిపిస్తున్నావు అంటూ కాసేపు నాగార్జున ఆట పట్టించారు. అనంతరం సినిమా గురించి అ నాగార్జున ప్రశ్నించడంతో మీరు నా వెనుకుంటానంటేనే సినిమా గురించి చెబుతానని అనసూయ చెబుతారు. దాంతో నాగర్జున నేనెక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటానని చెప్పారు.

కథ మొత్తం సీక్వెల్లోనే..
ఇక ఈ సినిమా ప్రతి సీన్ చాలా ఆసక్తిగా ఉంటుంది ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్ ఉంటుంది. ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లాగే ఉంటుందని తర్వాత మరొక ట్విస్ట్ వస్తుందని తెలిపారు. పుష్ప వన్ కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే అసలు సినిమా మొత్తం ఇక్కడే ఉంది అంటూ ఈ సందర్భంగా అనసూయ పుష్ప సీక్వెల్స్ సినిమా గురించి మాట్లాడుతూ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Suriya: నేను ఆరువేల మందిని చదివించడానికి ఆయనే కారణం.. సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published

on

Suriya: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు సూర్య తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. తెలుగులో కూడా ఈయన భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకోవడంతో సూర్య నటించిన సినిమాలన్నీ తెలుగులో కూడా విడుదలవుతున్నాయి.

Advertisement

సూర్య త్వరలోనే కంగువ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా నవంబర్ 14వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. డైరెక్టర్ శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే గత రాత్రి వైజాగ్ లో ఈ సినిమా వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సూర్య చిరంజీవి గురించి మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. నాకు నేషనల్ అవార్డు వచ్చిన సమయంలో చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా నాకు విషెస్ తెలిపారు. కాని చిరంజీవి గారు మాత్రం డైరెక్ట్ గా కాల్ చేసి నాకు విష్ చేయడమే కాకుండా నాతో ఎన్నో విషయాలు మాట్లాడారని తెలిపారు.

చిరంజీవి స్ఫూర్తి…
ఇక నన్ను చిరంజీవి గారు ఇంటికి పిలిచి మరి ఆయనే స్వయంగా ఫిష్ కర్రీ దోశ చేసి పెట్టారు. ఇక నేను చెన్నైలో ఇల్లు కట్టుకొని ఎన్జీవో సంస్థలు నడపడానికి ఇప్పటివరకు 6000 మందికి పైగా స్టూడెంట్స్ చదువు విషయంలో హెల్ప్ చేయడానికి కారణం చిరంజీవి అని తెలిపారు. ఆయనని స్ఫూర్తిగా తీసుకుని నేను ఈ పనులన్నీ చేయగలుగుతున్నాను. ఇటీవల చిరంజీవి గారిని పర్సనల్ గా కలిసినప్పుడు కంగువ సినిమా గురించి ఎన్నో విషయాలు మాట్లాడమని సూర్య వెల్లడించారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Venu Swamy: నాగచైతన్య శోభిత విషయంలో వేణు స్వామికి షాక్ ఇచ్చిన కోర్టు?

Published

on

Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సినిమా సెలబ్రిటీల జాతకాలను చెబుతూ సంచలనం అయ్యారు. అయితే ఈయన సమంత నాగచైతన్య విషయంలో చెప్పిన జాతకం నిజం కావడంతో ఈయనని నమ్మే వారి సంఖ్య కూడా క్రమక్రమంగా పెరిగిపోయింది. ఇలా వేణు స్వామి జాతకాలు నిజం కావడంతో ఈయన తరచూ సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలని చెబుతూ వార్తల్లో నిలిచారు.

Advertisement

ఇక సమంతకు విడాకులు ఇచ్చిన నాగచైతన్య తిరిగి శోభితను వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు వీరిద్దరిని నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే వీరి నిచ్చితార్థం పై వేణు స్వామి సంచలన అయినటువంటి జ్యోతిష్యం చెప్పారు. సమంత నాగచైతన్య విడిపోయినట్టే శోభిత నాగచైతన్య కూడా విడిపోతారని ఈయన బాంబు పేల్చారు. ఇలా సెలబ్రిటీల గురించి పోయిన స్వామి చెప్పే ఇలాంటి వ్యాఖ్యల పట్ల ఫిలిం జర్నలిస్టులు పూర్తిస్థాయిలో వ్యతిరేకించారు.

ఈ క్రమంలోనే వేణు స్వామి పై మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేయడంతో మహిళా కమిషన్ కూడా వేణు స్వామికి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుకావాలని తెలిపారు. అయితే వేణు స్వామి మాత్రం మహిళా కమిషన్ కి ఆ అధికారం లేదని హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు.

స్టే ఎత్తివేత..
తాజాగా నేడు ఆ స్టే ఎత్తివేస్తూ కమిషన్ కు పూర్తి అధికారాలున్నాయని హై కోర్ట్ తెలిపింది. అలాగే వారంలోగా వేణుస్వామి కేసులో చర్యలు తీసుకోవచ్చని మహిళా కమిషన్ కు న్యాయస్థానం స్పష్టం చేసింది. మరి వేణుస్వామి ఇప్పుడైనా మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరవుతారా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!