Malli Pelli: మళ్లీ పెళ్లి సినిమా విడుదల వాయిదా వేయాలి… కోర్టు మెట్లు ఎక్కిన రమ్య రఘుపతి!

Malli Pelli: మళ్లీ పెళ్లి ప్రస్తుతం సంచలనంగా మారిన ఈ సినిమా కోసం ఎంతో మంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు.స్టార్ సెలబ్రిటీలు కాకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్టులు అయినటువంటి నరేష్ పవిత్ర లోకేష్ జంటగా నటించిన ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని నరేష్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారని తెలుస్తోంది.

ఈ సినిమా మే 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నరేష్ పవిత్ర లోకేష్ సైతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.ఇక ఈ సినిమా విడుదలకు ఒక రోజు ముందు ఈ సినిమాకు నరేష్ భార్య రమ్య రఘుపతి ఊహించని విధంగా షాక్ ఇచ్చింది.

ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చాలా అభ్యంతరంగా చిత్రీకరించారని ఈమె ఆరోపణలు చేస్తూ కూకట్పల్లిలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తన పాత్రను కించపరిచే విధంగా సన్నివేశాలు తీయడంతో ఈ సినిమా విడుదలకు తాను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నానని ఈ సినిమా విడుదలను ఆపివేయాలి అంటూ రమ్య రఘుపతి కోర్టులో ఫిర్యాదు చేశారు.

Malli Pelli: కించపరిచేలా ఉన్నాయి…


ఈ విధంగా రమ్య రఘుపతి మళ్లీ పెళ్లి సినిమాని విడుదల చేయకూడదంటూ కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. మరి ఈ విషయంపై నరేష్ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాలో రమ్య రఘుపతి పాత్రలో నటి వనిత విజయ్ కుమార్ నటించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరించారు.