Nagababu: రోజా నోరు మున్సిపాలిటీ కుప్పతొట్టె…. రోజాపై నాగబాబు కామెంట్స్ వైరల్!

Nagababu: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అధికారపక్షం ప్రతిపక్షాల మధ్య నిత్యం గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అధికారపక్షంలోని మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నాయకుల మీద చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజా తరచూ జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ మీద మాటలతో విరుచుకుపడుతూ ఉంటుంది.

ఇక ఇటీవల కూడా పవన్ కళ్యాణ్ కేవలం ప్యాకేజీ కోసమే చంద్రబాబుతో కలిసి పొత్తు కుదుర్చుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేయటమే కాకుండా మెగా కుటుంబ సభ్యులైన చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈ క్రమంలో సినిమా సెలబ్రిటీలు పదిమందికి సాయం చేయాలని ఆలోచిస్తారు కానీ మెగా బ్రదర్స్ మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. అందుకే ఈ ముగ్గురిని సొంత జిల్లాలోనే ప్రజలు ఓడించారంటే వారికి రాజకీయ భవిష్యత్తు లేదనే విషయం అర్థమవుతోందని రోజా ఆరోపించారు.

ఇక తాజాగా రోజా చేసిన వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తూ రోజా కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తాజగా నాగబాబు స్పందిస్తూ.. ఏపీ పర్యటక శాఖ మంత్రిగా రోజా తన బాధ్యతలు మరిచిపోయి నోటికొచ్చినట్లు పిచ్చపిచ్చగా మాట్లాడితే ..ఇప్పుడు 18 వ స్థానంలో ఉన్న ఆంధ్రపదేశ్ ఆమె పదవి దిగిపోయే లోగా రాష్ట్రాన్ని 20వ స్థానానికి తీసుకెళ్లే ఛాన్స్ ఉందని నాగబాబు విమర్శించాడు. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖపై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారని.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వీరి జీవితాలు దయనీయంగా మారాయని నాగబాబు విమర్శించాడు.

Nagababu: పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదు….

పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదని, పర్యాటక శాఖను ఎలా అభివవృద్ధి చేయాలో తెలుసుకోవాలని నాగబాబు హితవు పలికారు. ఇన్ని రోజులు చిరు, పవన్‌ కళ్యాణ్ గురించి రోజా నోటికి వచ్చినట్లు మాట్లాడినా తాను రియాక్ట్ అవ్వలేదంటే ఒకటే ఒక కారణమని నాగబాబు వెల్లడించాడు . ఎందుకంటే రోజా నోటికి మున్సిపాల్టీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదని… చూస్తూ చూస్తూ ఎవరూ మున్సిపాల్టీ కుప్పతొట్టిని గెలకరని నాగబాబు ఫైర్ అయ్యాడు . రోజా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఇతరులపై నోరు పారేసుకోకుండా, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకోవాలంటూ నాగబాబు హితవు పలికాడు.