Sai Dharam Tej: ఇండస్ట్రీకి దూరంగా సాయి ధరమ్ తేజ్… షాకింగ్ న్యూస్ బయటపెట్టిన సుప్రీం హీరో!

Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం బ్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ ముఖ్యపాత్రలలో నటించిన ఈ సినిమా ఈ నెల 28వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ విధంగా ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సాయిధరమ్ తేజ్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తాను ఇండస్ట్రీకి దూరం కాబోతున్నానని తెలుపుతూ అందరికి షాక్ ఇచ్చారు.

ఈ విధంగా సాయిధరమ్ తేజ్ ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే రోడ్డు ప్రమాదం తర్వాత అవసరమైనటువంటి సర్జరీలు చేసిన అనంతరం ఈయనకు ప్రస్తుతం ఒక సర్జరీ చేయాల్సి ఉందట అందుకోసమే ఆరు నెలలపాటు ఇండస్ట్రీకి దూరం అవ్వబోతున్నారని, ఈ ఆరు నెలలు పూర్తిగా కోలుకొని అనంతరం ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలియజేశారు.

Sai Dharam Tej: సర్జరీ కోసం ఆరు నెలలు బ్రేక్….

ఈ విధంగా సాయి ధరమ్ తేజ్ సర్జరీ కోసమే ఇండస్ట్రీకి దూరం కాబోతున్నారన్న విషయం తెలియడంతో ఈయన ఆరోగ్యంగా తిరిగి రావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.రోడ్డు ప్రమాదం తర్వాత కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైనటువంటి సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే బ్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.