Drugs: విశాఖ డ్రగ్స్ లో చంద్రబాబు హస్తం ఉంది.. నిజానిజాలు తేల్చాలి: సజ్జల

Drugs: విశాఖ సి పోర్టులో ఓ కంటైనర్ లో సుమారు 25 వేల కేజీల డ్రగ్స్ సిబిఐ అధికారులు సీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఒక్కసారిగా భారీ మొత్తంలో డ్రగ్స్ అది ఎన్నికల సమయం ముందు అధికారులు సీజ్ చేయడంతో ఒక్కసారిగా ఈ విషయం సంచలనంగా మారింది. అయితే ఈ డ్రగ్స్ బ్రెజిల్ నుంచి వచ్చాయని తెలుస్తుంది ఈ క్రమంలోనే ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎవరి నుంచి ఎవరికి పంపిస్తున్నారనే విషయం గురించి సిబిఐ ఆరా తీస్తున్నారు.

ఇలా విశాఖ సీ పోర్టులో డ్రగ్స్ కలకలం సృష్టించడంతో చంద్రబాబు నాయుడు ఇదంతా వైకాపా పనే అంటూ ప్రచారాలు మొదలుపెట్టారు. దీంతో శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు పై ఆరోపణలు చేశారు.

డ్రగ్స్ విషయంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న తీరు ఎలా ఉంది అంటే దొంగనే దొంగ దొంగ అని అర్చినట్టూ ఉంది అంటూ ఈయన కామెంట్లు చేశారు. ఇలా విశాఖలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడటం వెనుక తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు బిజెపి హస్తము ఉందని ఈయన ఆరోపణలు చేశారు. తప్పు నుంచి బయటపడటం కోసం ఆ తప్పును మేము చేయలేదని నిరూపించుకోవడం కోసమే చంద్రబాబునాయుడు మా పై బురద చల్లుతున్నానని సజ్జల వెల్లడించారు.

25 వేల కిలోల డ్రగ్స్..
విశాఖ పోర్టులో సీబీఐ డ్రగ్స్‌ను సీజ్‌ చేసింది. పురంధేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలు ఉన్నాయి. టీడీపీ నేతలు కావాలనే మాపై ఆరోపణలు చేస్తున్నారు. వ్యవస్థలపై చంద్రబాబు నాయుడుకి గౌరవం లేదని ఆయనది వీధి స్థాయిలో మనస్తత్వం చెలరేగిపోయారు. ఇక ఈ డ్రగ్స్ విషయంలో నిజానిజాలు తెలియాల్సి ఉందని అందుకోసం తాము సిబిఐతో పాటు ఈసీ కి కూడా లేఖలు రాస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించడం కోసమే డ్రగ్ సరఫరా జరిగిందని అయితే పట్టుబడటంతో తప్పించుకోవడానికి ప్రజలందరినీ కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారంటూ సజ్జల చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.