Connect with us

Featured

Senior Journalist Imandhi Ramarao : ఎన్టీఆర్ ఉదయాన్నే 2:30 కి లేచి ఏం చేసేవాడు?? సిగరెట్ లేకుండా షూటింగ్ కి వచ్చేవాడు కాదా..?? ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవంటే : సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Published

on

Senior journalist Imandhi Ramarao : ఎన్టీఆర్ అనగానే గొప్ప పౌరణికాలు, అలాగే జానపద చిత్రాలు గుర్తుకువస్తాయి. ఆయన ఆ జోనర్స్ లో మరెవరూ సాహసించినటువంటి చిత్రాలను తన నటనతో రక్తి కట్టించారు. అప్పట్లో జానపదాలు, పౌరణికలు అంటే ఎన్టీఆర్, సాంఘిక చిత్రాలంటే ఏఎన్ఆర్ అనేలా వారి సినిమాలు సాగేవి. కానీ సాంఘిక సినిమాల్లో కూడా నేను మిన్న అని నిరూపించుకున్నారు ఎన్టీఆర్. వయసుమల్లిన పాత్రలో కనిపించి రిస్క్ చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఆయన రాజకీయాల్లో కూడా ఎలాంటి ట్రెండ్ సెట్ చేశారో అందరికీ తెలిసిందే. అయితే ఆయన గురించి తెలిసిన ఎవరైనా ఆయన క్రమశిక్షణ ఆయనను అత్యున్నత స్థాయికి తీసుకువచ్చిందని భావిస్తారు. ఇక ఆయన జీవన సరళి గురించి ఆహారపు అలవాట్ల గురించి ఆయనను దగ్గర నుండి చూసిన సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు ఆయన జ్ఞాపకాలను పంచుకున్నారు.

Advertisement

బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి… మాంసాహార ప్రియుడు…

ఎన్టీఆర్ గారు మొదటి నుండి క్రమశిక్షణ తో జీవించారు. షూటింగ్ ఎన్నింటికైనా కరెక్ట్ టైంకి అక్కడ ఉండేవారు. ఇతరులు లేట్ వచ్చినా దండించేవారు. ఇక ఆయన జీవన సరళి గురించి ఇమంది గారు మాట్లాడుతూ ఆయన ఉదయం బ్రహ్మ ముహూర్తంలో అనగా రెండున్నర, మూడు గంటల ప్రాంతంలో లేచి మొదట్లో వ్యాయామలు చేసేవారు. అయితే కొన్నేళలకు వయసు కొంచెం పెరిగాక వాహిని స్టూడియో నుండి వచ్చే పహిల్వాన్ తో మసాజ్ చేయించుకుని ఆ తరువాత స్నానము చేసి నిర్మాతలతో దర్శకులతో కొత్త కథల గురించి చర్చించేవారట. ఒక లంక చుట్ట కాల్చడం బాగా అలవాటు ఉండేదట రామారావు గారికి. ఇక వారితో చర్చల్లో ఉన్నపుడే బ్రేక్ ఫాస్ట్ కి ఇడ్లీలు, ఇడియాప్పం లాంటివి తినేవారు అంటూ చెప్పారు. ఇడియాప్పం అంటే చాలా ఇష్టం అంటూ ఇమంది గారు చెప్పారు.

పక్షి మాంసం అంటే చాలా ఇష్టం, ఉదయం అల్పాహారంలో పక్షి మాంసం ఖచ్చితంగా తినేవారు. ఇక డ్రై ఫ్రూట్స్ పాలతో కూడిన జ్యూస్ ఒక లీటర్ తాగి ఇక ఆపై షూటింగ్ కి ఆరోజు కావాల్సిన పాత్రకు తగ్గ మేకప్ అలాగే డ్రెస్సింగ్ చూసుకుని బయలుదేరాక ఇక ఆయనను చూడటానికి వచ్చిన వారిని కలిసి మాట్లాడిన తరువాత బసవతారకం గారు పసుపు నీళ్లు దిగదీసిన తరువాత భూత రాజు అనే వ్యక్తి దిష్టి తీసాక అప్పుడు ఆయన షూటింగ్ వెళ్ళేవారు. పౌరానిక పాత్రలు వేసినపుడు మాత్రం మాంసం ముట్టేవారు కాదు అంటూ ఎంతో నిష్టగా ఉండేవారు అంటూ చెప్పారు ఇమంది గారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Samantha: కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సమంత…అండగా నిలిచారంటూ?

Published

on

Samantha: సినీ నటి సమంత ఇటీవల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈమె తన రాజకీయాలలో భాగంగా సమంత అక్కినేని కుటుంబం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా కొండ సురేఖ వార్తలలో నిలవడమే కాకుండా నాగార్జున ఈమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ విధంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సమంతతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం స్పందిస్తూ ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక అప్పట్లో సమంత ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. తాజాగా మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ.. సౌత్ సినీ ఇండస్ట్రీ అండగా నిలిచి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇండస్ట్రీ ప్రజలు చూపించిన ఈ ప్రేమే నన్ను ఈ వివాదం నుంచి బయటపడేలా చేసింది. లేకుంటే మరింత కృంగిపోయే దానిని. అందరి సపోర్ట్ వల్లే తిరిగి మీ ముందు కూర్చున్నాను అంటూ ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇండస్ట్రీ సపోర్ట్..
కొండా సురేఖ సమంత గురించి తప్పుగా మాట్లాడటమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ గురించి సంచలన ఆరోపణలు చేశారు. సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ ఈమె వారి గురించి మాట్లాడటంతో అప్పట్లో తెలంగాణ రాజకీయాలలోనూ,సినీ ఇండస్ట్రీలోనూ ఈ విషయం సంచలనంగా మారింది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Samantha: నాగచైతన్య ప్రతి జ్ఞాపకాన్ని కాల్చేసిన సమంత.. ఆ ఒక్కటి భద్రంగా ఉంచుకుందా?

Published

on

Samantha: సినీ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత తన వ్యక్తిగత కారణాలు అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లకు కమిట్ అయ్యారు.

Advertisement

ఇక సమంత వ్యక్తిగత విషయానికి వస్తే నటుడు నాగచైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం పాటు కొనసాగ లేకపోయారు. సమంత నాగచైతన్య ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను చూపించుకునేవారు. అయితే వీరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇలా విడాకులు తీసుకున్న తర్వాత సమంత నాగచైతన్యకు సంబంధించిన జ్ఞాపకాలు అన్నిటిని కూడా చెరిపివేసింది. ఇలా తాను ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని వెనక్కి పంపియడమే కాకుండా తన మెడలో తాళిని కూడా వెనక్కి తిరిగి ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలన్నింటినీ కూడా కాల్చేసిన సమంత ఒకే ఒక గిఫ్ట్ మాత్రం భద్రంగా పెట్టుకున్నారని తెలుస్తుంది.
పెళ్లి ఫోటో..
మరి సమంత భద్రంగా దాచుకున్న ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే.. నాగచైతన్య సమంత పెళ్లిలో దిగిన ఫోటోని భద్రంగా దాచి ఉంచారని తెలుస్తోంది. తన పెళ్లిలో తన తల్లిదండ్రులతో పాటు నాగచైతన్య సమంత కలిసి దిగిన ఫోటో అంటే తనకు చాలా ఇష్టమని గతంలో పలు సందర్భాలలో సమంత తెలిపారు. ఆ ఫోటోని మాత్రం అలాగే భద్రంగా ఉంచుకున్నారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Bahubali 3: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలోనే బాహుబలి 3..హింట్ ఇచ్చిన నిర్మాత!

Published

on

Bahubali 3: ప్రభాస్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ హీరోగా బాహుబలి సినిమా గుర్తింపు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే త్వరలోనే బాహుబలి త్రీ కూడా రాబోతోంది అంటూ తాజాగా నిర్మాత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో బాహుబలి 3 గురించి ప్రభాస్ రాజమౌళి మాట్లాడిన ఇప్పుడే అలాంటి ఆలోచనలేమీ లేవని తెలిపారు.

ఇకపోతే తాజాగా కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల బాహుబలి నిర్మాతలతో కలిసి మాట్లాడానని అయితే వారు బాహుబలి 3 కూడా ఉండబోతోందని తెలిపారంటూ జ్ఞానవేల్ రాజా వెల్లడించారు.

బాహుబలి 3..
ఇలా బాహుబలి నిర్మాతలు పార్ట్ 3 కూడా ఉండబోతుందని చెప్పారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రభాస్ ఈ సినిమా చేసిన ఇప్పట్లో రాదని తెలుస్తుంది. ఇప్పటికే ఈయన సుమారు ఐదు పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి వరుస షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాతనే బాహుబలి త్రీ గురించి ఆలోచిస్తారని అభిమానులు చర్చలు జరుపుకుంటున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!