Connect with us

Featured

Talangana Congress Leaders : ‘బలగం’ సినిమా చూపించిన కాంగ్రెస్ పెద్దలు.. అవాక్కవుతున్న జనం.. ఇలాగే ఉంటే కేసీఆర్ కు చుక్కలే..!

Published

on

Talangana Congress Leaders : ‘బలగం’ సినిమా చూపించిన కాంగ్రెస్ పెద్దలు.. అవాక్కవుతున్న జనం.. ఇలాగే ఉంటే కేసీఆర్ కు చుక్కలే..!బలగం సినిమా చూశారా? చూసే ఉంటారులే.. ఊరు వాడా.. ఒక్కచోట చేరి మరీ ఈ సినిమాను చూసింది. మంచి సక్సెస్ టాక్ రావడంతో థియేటర్లకు వెళ్లలేని వారు సైతం ఓటీటీలో రాగానే బుల్లితెరపై వీక్షించారు. అన్నదమ్ముల అనుబంధం గురించి కుటుంబం కలిసి ఉండాలనేది ఈ సినిమాలో ప్రముఖంగా చూపించారు. ఇది చూసి విడిపోయిన అన్నదమ్ములు, సోదర, సోదరీమణులు కలిసిపోతున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత కలిసిపోయిన చాలా మందిని వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇదెందుకు అనుకుంటున్నారా? మన తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం ‘బలగం’ సినిమా చూసినట్టున్నారు. ఇన్నాళ్లు ఉప్పు – నిప్పులా ఉన్న నేతలు అంతా ఒక్కసారిగా కలిసిపోయారు. ఇలాంటి అరుదైన దృశ్యం చూస్తామని బహుశా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉండే నేతలు, కార్యకర్తలు ఊహించి ఉండరేమో. మొత్తానికి నల్లగొండ సాక్షిగా బలగం మూవీ ఎండింగ్‌లో అంతా కలిసిపోయే సీన్ ఉంటుందే దాన్ని చూపించేశారు..

కుమ్ములాటల పార్టీ అని టాక్..

నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. కలిసి ఉంటే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో నేతలకు తెలిసి వచ్చి ఉంటుంది. ఈ నిరుద్యోగ నిరసన ర్యాలీ అనంతరం జరిగిన సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, సీనియర్ నేత జానారెడ్డితో పలువురు పెద్దలు పాల్గొన్నారు. మిగిలిన వారి సంగతేమో కానీ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్‌లను ఒక వేదికపై కనిపించిన సందర్భాలు చాలా తక్కువే.. సడెన్ గా ఇలా వారిని చూడటంతో కాంగ్రెస్ శ్రేణులకు కొండంత బలాన్నిచ్చింది. చూడటానికి కన్నుల పండువగా అనిపించింది. వీరంతా ఇలాగే కలిసి ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదనీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీ అంటేనే కుమ్ములాటలకు కార్ ఆఫ్ పార్టీ అనే టాక్ ఉంది. ఈ సభ దానిని కొంతమేర చెరిపేసింది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన నల్లగొండ సాక్షిగా అంతా ఒక్కటయ్యారు. మిగిలిన నేతలంటారా? పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిందేమీ లేదు. వీరు కలిసొస్తే వారు కూడా కలిసి రావడం ఖాయం.

Advertisement
KCR Biopic: కేసీఆర్ బయోపిక్ కూడా చేస్తా… కేసీఆర్ గురించి వర్మ షాకింగ్ కామెంట్స్!

అధికార పార్టీకి చెమటలు పట్టడం ఖాయం..

కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లి.. రేవంత్ రెడ్డిని ఆలింగనం చేసుకుంటుంటే.. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈలలో కేకలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. అసలు వీరంతా కలిసి రావడం అనే మాట జనాల్లో విపరీతమైన ఉత్సాహాన్ని తీసుకొచ్చినట్టుంది.. ఈ సభకు ఇసుకేస్తే రాలనంత మంది జనం వచ్చారు. ఇది కదా మనకు కావాల్సిందను అభమానుకు, కార్యకర్తలు అనుకున్నారు. మొత్తానికి కర్ణాటక ఎన్నికల ప్రభావమో.. మరొకటో కానీ అంతా కలిసిపోయారు. ఇది చూస్తే అధికార పార్టీకి చెమటలు పట్టడం ఖాయమని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. నిజానికి తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అంటే జనానికి అభిమానమే. కానీ నేతల మధ్య కుమ్ములాటలే ఆ అభిమానాన్ని కప్పేస్తున్నాయి. ఇప్పటికైనా ఇలా ముందుకు వెళితే అంతా కాంగ్రెస్ పార్టీకి మంచే జరుగుతుంది. అధికారాన్ని చేజిక్కించుకోకున్నా కూడా సీట్లను భారీగా పెంచేసుకుని సెకండ్ ప్లేస్‌లో తిష్ట వేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ఎన్నికల ముందు కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయ్.. ఈ కలయిక.. ఇదే పరిస్థితి కొనసాగితే చెయ్యి పార్టీకి మంచి రోజులు వచ్చినట్లే.. బీఆర్ఎస్ గడ్డుకాలమే అని విశ్లేషకులు అంటున్నారు.

ఈ ముచ్చట ఎన్నాళ్ళో..!

ఇక కాంగ్రెస్ నేతల కలయిలకపై ట్రోల్స్ కూడా భారీగానే వస్తున్నాయి. ఇదంతా కొన్ని గంటలకే పరిమితమని కొందరు.. జనం ముందు బాగానే నటిస్తున్నారని మరి కొందరు.. ఇది ఉత్సాహమా.. అత్యుత్సాహమా? అని ఇంకొందరు.. ఎవరికి తోచిన విధంగా వారు పోస్టులు పెడుతున్నారు. ఇక ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం జనాల్లో ఎంత చులకన అయిపోయిందో తెలుసుకుని నేతలు నడుకుంటే బాగుండునని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఈ కలయికను ఈ సభ వరకూ మాత్రమే పరిమితం చేయకుండా.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే వరకూ సాగించాలని కోరుకుంటున్నారు. మరి పార్టీ నేతలు ఏం చేస్తారో చూడాలి. ఇలాగే కలిసి కట్టుగా ఉంటే మాత్రం అధికార పార్టీకి చుక్కలు చూపించడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి ఈ కలయికను నిలుపుకుంటారా? లేదంటే మళ్లీ జనాల్లో చులకనవుతారా? అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Continue Reading
Advertisement

Featured

Lahari: ఖరీదైన కారును కొన్న బుల్లితెర నటి లహరి.. కారు ధర ఎంతో తెలుసా?

Published

on

Lahari: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె తెలుగు బుల్లితెరపై వివిధ ఛానల్లలో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కి లహరి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబు పుట్టిన తరువాత కూడా బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకునే లహరి తాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈమె తన పేరెంట్స్ , భర్త కొడుకుతో కలిసి కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

బెంజ్ కారు..
ఇక ఈమె ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ఖరీదైన కారును లహరి కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

VN Adithya: డల్లాస్ లో డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్య కొత్త సినిమా… ఆదరణ మామూలుగా లేదుగా?

Published

on

VN Adithya: వి.ఎన్ ఆదిత్య పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనసంతా నువ్వే ,నేనున్నాను, శ్రీరామ్ వంటి ఫీల్ గుడ్ లవ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరో కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పీపుల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.

ఈ క్రమంలోనే జులై 7వ తేదీ ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో
లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో తన కొత్త సినిమా గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్‌లో జరగనుందని తెలుస్తోంది.
తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

Advertisement

ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి , శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Continue Reading

Featured

Suma -Siddharth: యాంకర్ సుమ బుజం పై చేతులు వేసి రచ్చ చేసిన సిద్ధార్థ్.. షాక్ లో నెటిజన్స్!

Published

on

Suma -Siddharth: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ ఇటీవల కాలంలో వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ సుమ పట్ల వ్యవహరించిన తీరుపై నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వేదికపై సుమ మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడితే చాలా ఓవర్ చేస్తున్నామని అందరూ అనేవాళ్ళు.

ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తాము అంటూ సుమ భుజంపై చేతులు వేస్తూ కామెంట్స్ చేశారు. సుమతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Advertisement

మన వయసు పెరగదు..
ఇలా సిద్ధార్థ్ మాట్లాడటంతో వెంటనే సుమా మాట్లాడుతూ… ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి వయసు ఎవరు పసిగట్టలేరు అందరి వయసు పెరుగుతూ ఉన్న మన వయసు మాత్రం అక్కడే ఆగిపోయింది అంటూ సుమా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి సుమ పట్ల సిద్ధార్థ్ వ్యవహార శైలి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!