Yadamma Raju: కాలి వేలు తొలగిస్తుంటే ప్రాణం పోయినట్టు అయింది… ఎమోషనల్ అయిన యాదమ్మ రాజు!

Yadamma Raju: యాదమ్మ రాజు కొద్ది రోజుల క్రితం ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. ఈయన ప్రమాదంలో భాగంగా కాలికి బాగా దెబ్బ తగలడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అయితే ఈయన హాస్పిటల్ లో ఉన్నటువంటి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలు యాదమ్మ రాజుకు ఏమైంది ఎందుకు ఇలా ఉన్నఫలంగా హాస్పిటల్ బెడ్ పై ఉన్నారు అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేశారు.

ఇక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినటువంటి ఈయన బయటకు వచ్చిన ప్రతిసారి స్టిక్ సహాయంతో నడుస్తూ పలు సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈయన తాజాగా బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు నటించిన స్లండాగ్ హస్బెండ్ సినిమాలో నటించారు. తనకు ప్రమాదం జరిగినప్పటికీ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన తనకు జరిగిన ప్రమాదం గురించి తెలిపారు. రోడ్డుపై వెళ్తున్న ఒక వ్యక్తి బైక్ స్కిడ్ కావడంతో బైక్ వచ్చి నాపై పడిందని అందుకే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఇక ఈ ప్రమాదంలో తన కాలు దెబ్బతిందని కుడికాలు వేలు తొలగించారని తెలిపారు. ఇలా కాలు వేలు తొలగించే సమయంలో తొడపై ఉన్నటువంటి చర్మం తీసి ఇక్కడ వేశారు.

Yadamma Raju:

ఆ సమయంలో భరించలేనటువంటి బాధను అనుభవించానని తెలిపారు.ఇలా సర్జరీ చేస్తుంటే ప్రాణం పోయినంత పని అయిందని ఈ సందర్భంగా తాను అనుభవిస్తున్నటువంటి నొప్పిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ఇక ఒక ఆర్టిస్ట్ గా సినిమాలలో నటించడం వల్ల ప్రమోషన్ చేయాల్సిన బాధ్యత ఉంది కనుక తాను ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నాను అంటూ ఈ సందర్భంగా యాదమ్మ రాజు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.