Connect with us

Featured

వామ్మో అంతగా ఎలా సంపాదించాడు కేవలం 5ఏళ్లలో లో 300 శాతం పెరిగిన ఆస్తులు..!

Published

on

వామ్మో అంతగా ఎలా సంపాదించాడు కేవలం 5ఏళ్లలో లో 300 శాతం పెరిగిన ఆస్తులు..!

Advertisement

అమిత్‌షా ఆస్తులు

ఆయన దేశంలో అధికార పార్టీకి జాతీయ అధ్యక్షుడు. అవినీతి, అక్రమాలకు ఆమడ దూరంలో ఉంటానని, ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్నానని చెప్పుకుంటున్నారు. నరేంద్ర మోడీని నాడు గుజరాత్‌కు ముఖ్యమంత్రినీ, దేశానికి ప్రధానినీ చేశానంటున్నారు. ఆయనే అమిత్‌ షా. అవినీతి మరకలను దరి చేరనీయని నిప్పుకణికను అని దర్పాన్ని చూపే అమిత్‌షా ఆర్థికంగా బహు చిన్నవాడని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆయన ఆస్తులను ఐదేండ్లలో 300 శాతం పెంచుకున్నారంటే ఆశ్చర్యమేయక మానదు. మరి ఇంత భారీ ఎత్తున ఆస్తులను అమిత్‌షా పెంచు కోవడం వెనుక దాగి ఉన్న చిదంబర రహస్యం అవినీతి, అక్రమాలేన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఓ మీడియా సంస్థ వార్తను ప్రచురించిన కొన్ని గంటల్లోనే తొలగించడం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది.

Advertisement

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆస్తులు 2012-2017 మధ్య కాలంలో ఏకంగా 300 శాతం పెరిగాయి. రాజ్యసభకు బీజేపీ అభ్యర్థిగా అమిత్‌షా దాఖలు చేసిన నామినేషన్‌తో ఈ విషయం స్పష్టమైంది. అమిత్‌షా చివరిసారిగా 2012లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన ఆస్తులను వెల్లడించారు. గుజరాత్‌లోని మూడు రాజ్యసభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులుగా అమిత్‌షా, కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ, బల్వంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. అమిత్‌షా స్థిర, చర ఆస్తులు(భార్య ఆస్తులతో కలుపుకొని) ఐదేండ్ల కాలంలో 300 శాతం పెరిగాయి. 2012లో అమిత్‌షా స్థిర, చర ఆస్తులను రూ.8.54 కోట్లుగా చూపించారు. ప్రస్తుతం ఈ ఆస్తులను రూ.34.31 కోట్లుగా నామినేషన్‌ పత్రాల్లో పేర్కొన్నారు. అంతేకాక.. చరాస్తులు ఐదేండ్లలో రూ.1.9 కోట్లు నుంచి ఏకంగా రూ.19 కోట్లకు(10 రెట్లు) పెరిగాయి. స్థిరాస్తులు రూ.6.63 కోట్ల నుంచి రూ.15.30 కోట్లకు పెరిగాయి.

స్మృతీ డిగ్రీ పూర్తి చేయలేదట..
మరోవైపు స్మృతీ ఇరానీ శుక్రవారం దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాల్లో మూడేండ్ల డిగ్రీ కోర్సు పూర్తి చేయలేదని పేర్కొనడం చర్చాంశ నీయంగా మారింది. 2004లో ఢిల్లీలోని చాందీచౌక్‌ నుంచి లోక్‌సభకు నామినేషన్‌ దాఖలు చేసిన సమయంలో 1996లోబీఏ పూర్తి చేసినట్టు వెల్లడించారు. కాగా.. 2011 రాజ్యసభ, 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఢిల్లీ యూనివర్సిటీ నుంచి 1994లో బీకామ్‌ పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. ఇప్పుడేమో అసలు డిగ్రీ పూర్తి కాలేదని నామినేషన్‌లో పేర్కొనడం గమనార్హం. పై విషయాలన్నింటిని ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ శనివారం బహిర్గత పరిచింది.
కొన్ని గంటలకే తొలగింపు

Advertisement

అమిత్‌ షా ఆస్తులు, స్మృతీ డిగ్రీ వివరాలను ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ అహ్మదాబాద్‌ ఎడిషన్‌లో శనివారం ప్రచురించింది. కానీ, ప్రచురించిన కొన్ని గంటలకే ఈ సమాచారాన్ని తమ వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది. వెబ్‌సైట్‌ నుంచి కథనాన్ని తొలగించడానికి గల కారణా లను మాత్రం వివరిం చలేదు. ఈ స్టోరీని ‘డీఎన్‌ఏ’ కూడా ప్రచురించి, తర్వాత వెబ్‌సైట్‌ నుంచి తొలగిం చింది. ఈ-పేపర్‌లో మాత్రం అందుబాటులో ఉంచిం ది. అమిత్‌షా ఆస్తుల వివరాలను టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించిన కొద్ది సేపటికే తొలగించిన విషయాన్ని ‘ది వైర్‌’ వెలుగులోకి తెచ్చింది. వార్తను తొలగించడానికి కారణాలను ది వైర్‌ తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ తగిన వివరణ రాలేదని కూడా వెల్లడించింది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Samantha: కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సమంత…అండగా నిలిచారంటూ?

Published

on

Samantha: సినీ నటి సమంత ఇటీవల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈమె తన రాజకీయాలలో భాగంగా సమంత అక్కినేని కుటుంబం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా కొండ సురేఖ వార్తలలో నిలవడమే కాకుండా నాగార్జున ఈమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ విధంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సమంతతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం స్పందిస్తూ ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక అప్పట్లో సమంత ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. తాజాగా మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ.. సౌత్ సినీ ఇండస్ట్రీ అండగా నిలిచి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇండస్ట్రీ ప్రజలు చూపించిన ఈ ప్రేమే నన్ను ఈ వివాదం నుంచి బయటపడేలా చేసింది. లేకుంటే మరింత కృంగిపోయే దానిని. అందరి సపోర్ట్ వల్లే తిరిగి మీ ముందు కూర్చున్నాను అంటూ ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇండస్ట్రీ సపోర్ట్..
కొండా సురేఖ సమంత గురించి తప్పుగా మాట్లాడటమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ గురించి సంచలన ఆరోపణలు చేశారు. సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ ఈమె వారి గురించి మాట్లాడటంతో అప్పట్లో తెలంగాణ రాజకీయాలలోనూ,సినీ ఇండస్ట్రీలోనూ ఈ విషయం సంచలనంగా మారింది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Samantha: నాగచైతన్య ప్రతి జ్ఞాపకాన్ని కాల్చేసిన సమంత.. ఆ ఒక్కటి భద్రంగా ఉంచుకుందా?

Published

on

Samantha: సినీ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత తన వ్యక్తిగత కారణాలు అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లకు కమిట్ అయ్యారు.

Advertisement

ఇక సమంత వ్యక్తిగత విషయానికి వస్తే నటుడు నాగచైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం పాటు కొనసాగ లేకపోయారు. సమంత నాగచైతన్య ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను చూపించుకునేవారు. అయితే వీరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇలా విడాకులు తీసుకున్న తర్వాత సమంత నాగచైతన్యకు సంబంధించిన జ్ఞాపకాలు అన్నిటిని కూడా చెరిపివేసింది. ఇలా తాను ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని వెనక్కి పంపియడమే కాకుండా తన మెడలో తాళిని కూడా వెనక్కి తిరిగి ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలన్నింటినీ కూడా కాల్చేసిన సమంత ఒకే ఒక గిఫ్ట్ మాత్రం భద్రంగా పెట్టుకున్నారని తెలుస్తుంది.
పెళ్లి ఫోటో..
మరి సమంత భద్రంగా దాచుకున్న ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే.. నాగచైతన్య సమంత పెళ్లిలో దిగిన ఫోటోని భద్రంగా దాచి ఉంచారని తెలుస్తోంది. తన పెళ్లిలో తన తల్లిదండ్రులతో పాటు నాగచైతన్య సమంత కలిసి దిగిన ఫోటో అంటే తనకు చాలా ఇష్టమని గతంలో పలు సందర్భాలలో సమంత తెలిపారు. ఆ ఫోటోని మాత్రం అలాగే భద్రంగా ఉంచుకున్నారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Bahubali 3: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలోనే బాహుబలి 3..హింట్ ఇచ్చిన నిర్మాత!

Published

on

Bahubali 3: ప్రభాస్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ హీరోగా బాహుబలి సినిమా గుర్తింపు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే త్వరలోనే బాహుబలి త్రీ కూడా రాబోతోంది అంటూ తాజాగా నిర్మాత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో బాహుబలి 3 గురించి ప్రభాస్ రాజమౌళి మాట్లాడిన ఇప్పుడే అలాంటి ఆలోచనలేమీ లేవని తెలిపారు.

ఇకపోతే తాజాగా కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల బాహుబలి నిర్మాతలతో కలిసి మాట్లాడానని అయితే వారు బాహుబలి 3 కూడా ఉండబోతోందని తెలిపారంటూ జ్ఞానవేల్ రాజా వెల్లడించారు.

బాహుబలి 3..
ఇలా బాహుబలి నిర్మాతలు పార్ట్ 3 కూడా ఉండబోతుందని చెప్పారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రభాస్ ఈ సినిమా చేసిన ఇప్పట్లో రాదని తెలుస్తుంది. ఇప్పటికే ఈయన సుమారు ఐదు పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి వరుస షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాతనే బాహుబలి త్రీ గురించి ఆలోచిస్తారని అభిమానులు చర్చలు జరుపుకుంటున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!