Connect with us

Featured

ప్రభాస్ రిస్క్ చేస్తున్నాడా.. రాధే శ్యామ్ విషయంలో కొత్త టాక్..

Published

on

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కమిటయిన సినిమాల లైనప్ చుస్తే ఏ రేంజ్‌లో ఆయన ఒక్కడి మీద మార్కెట్ ఉందో అందరికీ తెలిసిందే. ఒక్క ప్రభాస్ కమిటయిన సినిమాల బిజినెస్ 8 నుంచి 10 వేల కొట్ల వరకు ఉంటుందని చెప్పుకుంటున్నారు. అంతగా ప్రభాస్ సినిమాలకు మార్కెట్ ఏర్పడటానికి కారణం బాహుబలి సిరీస్. ఈ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. అందుకే ఒక్కో సినిమాను దాదాపు 3 నుంచి 4 వందల కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Advertisement

ఇక ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె చిత్రాలను పాన్ వరల్డ్ సినిమాలుగా నిర్మిస్తున్నారు. వీటి బడ్జెట్ 600 కోట్లకు పైగానే ఉంది. దీన్ని బట్టి చూస్తే మన ప్రభాస్ రేంజ్ హాలీవుడ్‌లో కూడా హై రేంజ్‌లో ఉందని అర్థమవుతోంది. ఇక ప్రభాస్ సినిమా అంటే అందరూ కూడా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ అని ఫిక్సైపోతున్నారు. కానీ రాధే శ్యామ్ లాంటి రొమాంటిక్ లవ్ స్టోరి చేస్తూ సర్‌ప్రైజ్ ఇచ్చాడు ప్రభాస్. పూజా హెగ్డే లాంటి క్రేజీ హీరోయిన్ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయిన దగ్గర్నుంచి రాధే శ్యామ్ సినిమా మీద అంచనాలు ఆమాంతం పెరిగిపోయాయి.

పోస్టర్, సాంగ్స్ సినిమా మీద మంచి అంచనాలు పెంచాయి. అయితే ఈ సినిమా మీద కొందరిలో కాస్త నెగిటివ్ ఒపీనియన్ కూడా కలుగుతోంది. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ యాక్షన్ పాన్ ఇండియన్ సినిమా – అలాగే భీమ్లా నాయక్ లాంటి మాస్ మల్టీస్టారర్ సినిమాలతో ఈ రొమాంటిక్ లవ్ స్టోరిని రిలీజ్ చేయాలనుకోవడం పెద్ద రిస్క్ అంటున్నారు. ప్రభాస్ 10 ఏళ్ళ తర్వాత లవ్ స్టోరి అంటే ముందు అందరిలో మంచి ఆసక్తి నెలకొన్నా గానీ, ప్రభాస్‌కు పెరిగిన ఈ మాస్ ఇమేజ్ వల్ల మైనస్ అవుతుందేమో అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు.

రెండు భారీ చిత్రాలతో రాధే శ్యామ్ లాంటి క్లాస్ మూవీని తీసుకు రావడం ఒక పెద్ద రిస్క్.. పొరపాటున కథ ఏమాత్రం నచ్చక పోయినా జనాలు వెంటనే మిగతా రెండు సినిమాల వైపు మళ్ళుతారు. ఇందులో అసలు సందేహం లేదు. ఇక సాహో లాంటి భారీ యాక్షన్ సినిమాను కూడా ప్రేక్షకులు తిప్పికొట్టారు. ఇప్పుడు ఈ క్లాస్ సినిమా అంటే జనాలలో నిజంగానే సందేహాలు ఉన్న మాట వాస్తవమే. మరి సంక్రాంతి రేస్‌లో నిలబడాలంటే ఖచ్చితంగా రాధే శ్యామ్ కథ, కథనం, మేకింగ్, మ్యూజిక్..ఇలా ప్రతీదీ సూపర్ అనిపించాలి.. మెస్మరైజ్ చేయాలి.

కానీ, ఆ మెస్మరైజ్ రాధే శ్యామ్ చేస్తుందా అంటే 50-50 ఛాన్సెస్ అనే టాక్ ఉంది. బాహుబలి తర్వాత లాంగ్ గ్యాప్‌లో వచ్చిన సాహో దెబ్బకొట్టింది. మళ్ళీ ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చే రాధే శ్యామ్ సినిమా మీద అంచనాలు స్థిరంగా లేవు. చూడాలి మరి ప్రభాస్ నమ్మకాలన్నీ ఏమవుతాయో. ఈ సినిమా రిజల్ట్ మీదే నెక్స్ట్ సినిమాల బిజినెస్ కూడా ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. ఇందులోనూ సందేహం లేదు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Jani Master: జానీ మాస్టర్ కి బిగ్ షాక్… అవార్డు వెనక్కి తీసుకోవాలటూ ఆదేశాలు?

Published

on

Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల అత్యాచార కేసులో భాగంగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన ఈయన మద్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈయన తన అసిస్టెంట్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తనని అరెస్టు చేశారు.

Advertisement

ఇలా రిమాండ్ లో ఉన్నటువంటి ఈయన పోలీసు విచారణలో పలు విషయాలను తెలిపారు. ఇకపోతే ఇటీవల జానీ మాస్టర్ కి కోర్టు మద్యంతర బెయిల్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ ఆరో తేదీ నుంచి పదవ తేదీ వరకు ఈయనకు బెయిల్ ఇస్తున్నట్టు కోర్ట్ వెల్లడించారు.

ఈ విధంగా జానీ మాస్టర్ బయటకు వస్తున్నారని సంబరపడేలోపు ఈయనకి ఊహించని షాక్ తగిలింది. జానీ మాస్టర్ పై ఆరోపణలు రావడానికి కంటే ముందుగా ఈయన 70వ జాతీయ అవార్డు ప్రకటనలో భాగంగా ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఇలా జానీ మాస్టర్ నేషనల్ అవార్డు అందుకోవడం ఇది రెండోసారి.

అవార్డు వెనక్కి…
ఇలా నేషనల్ అవార్డుకు ఎంపికైన తరువాత ఈయన పట్ల లైంగిక ఆరోపణల కేసు నమోదు కావడంతో జాతీయ అవార్డు సమితి ఈ అవార్డును వెనక్కి తీసుకోబోతున్నారు.మాస్టర్ పై ఫోక్సో కేసు నమోదు కావడంతో కమిటీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇలా జానీ మాస్టర్ కు జాతీయ అవార్డు వచ్చిందని సంతోష పడిన అభిమానులకు ఈ విషయం తెలియగానే ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈ విషయంపై జానీ మాస్టర్ స్పందన ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Balakrishna: కొండా సురేఖ కామెంట్స్ పై స్పందించని బాలయ్య బాబు.. కారణం అదేనా!

Published

on

Balakrishna: తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై టాలీవుడ్ ఒక్కసారిగా భగ్గుమంది. ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అవి కాస్త టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అక్కినేని కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ విషయం తెలిసిందే. దాంతో ఇప్పటి వరకు ఆమె చేసిన వ్యాఖ్యలపై చాలామంది సెలబ్రిటీలు స్పందించారు. అంతేకాదు తమ సోషల్ మీడియా వేదికగా కొండా సురేఖపై విమర్శలు చేస్తూ ట్వీట్లు, పోస్టులు పెట్టారు. ఒకరకంగా చెప్పాలంటే అక్కినేని నాగార్జునకు తమ నైతిక మద్దతు ప్రకటించి తాము ఉన్నామని భరోసాను ఇచ్చారు.

Advertisement

అయితే ఒక స్టార్ హీరో మాత్రం అసలు స్పందించలేదు. ఇప్పుడా స్టార్ హీరో ఎందుకు రియాక్ట్ కాలేదన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆ హీరో మరెవరో కాదు బాలయ్య బాబు. నాగార్జున కుటుంబం మీద కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై బాలకృష్ణ రియాక్ట్ కాలేదు. అయితే ఆయన పాత విషయాలను మరచిపోలేదా, అందుకే స్పందించలేదన్న చర్చ జరుగుతోంది. అయితే అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా బాలకృష్ణ పెద్ద ప్రెస్ నోటే ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు బాలయ్య సైలెంట్‌ గా ఉన్నారంటూ టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది.

కారణాలు అవే అంటూ..

అయితే బాలయ్య బాబు రియాక్ట్‌ కాకపోవడానికి రెండు కారణాలు ఉండవచ్చనీ టాక్ వినిపిస్తోంది. ఒకటి తన అక్క నారా భువనేశ్వరిపై వైసీపీ వాళ్ళు కామెంట్స్ చేస్తే నాగార్జున కనీసం స్పందించలేదని బాలకృష్ణ మనసులో పెట్టుకుని ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు నాగార్జున వైసీపీకి మద్దతు దారుడని, బాలయ్య టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం బిజీలో ఉండి మర్చిపోయి ఉంటారన్న వాదన వినిపిస్తున్నారు. కారణం ఏదైనా అందరి మద్దతు దొరికిన నాగార్జునకు,బాలయ్య మద్దతు లభించకపోవడం మాత్రం చర్చనీయాంశం అవుతోంది. మరి నిదానంగా అయినా బాలయ్య బాబు ఈ విషయంపై స్పందిస్తారేమో చూడాలి మరి.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Devara 2: దేవర2 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన తారక్.. షూటింగ్ అయ్యిందంటూ!

Published

on

Devara 2: కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ మంచి సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఇప్పుడు వరకు ఈ సినిమా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు మరిన్ని కలెక్షన్లను సాధిస్తోంది దేవర సినిమా. ప్రస్తుతం దేవర సినిమా లాభాల బాట పట్టింది. దసరా హాలిడేస్ కూడా ఉండటంతో 500 కోట్ల టార్గెట్ పెట్టుకుంది దేవర.

Advertisement

తాజాగా దేవర మూవీ యూనిట్ సక్సెస్ మీట్ కూడా చేసుకున్నారు. ఈ సినిమా విడుదల అవ్వడంతో అభిమానులు దేవర 2 గురించి చర్చించుకుంటున్నారు. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఏమో అని మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే దేవర రిలీజ్ సమయంలో ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లి అక్కడ ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే. బియాండ్ ఫెస్ట్ లో పాల్గొనడం, అక్కడి మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇవ్వడం చేసారు. హాలీవుడ్ లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ దేవర పార్ట్ 2 గురించి, కొరటాల శివ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈ మేరకు ఎన్టీఆర్ మాట్లాడుతూ.. దేవర రిజల్ట్ బాగుంది. పార్ట్ 2 కూడా ఉంటుంది.

మేజర్ సీన్స్ అయిపోయాయి..

ఆల్రెడీ కథ సిద్దమైపోయింది. దాన్ని ఇంకా బాగా రాసుకోవాలి. దేవర పార్ట్ 2లో ఒక రెండు మేజర్ సీన్స్ కూడా షూటింగ్ అయిపోయింది. డైరెక్టర్ కొరటాల శివకు మొత్తం అన్ని వదిలేసి ఒక నెల రోజులు రెస్ట్ తీసుకో, హాలిడేకు వెళ్ళు అని చెప్పాను. ఆ తర్వాత వచ్చి మళ్ళీ దేవర 2 మీద వర్క్ చేయమని చెప్పాను. దేవర 2 పార్ట్ 1 కంటే ఇంకా పెద్దగా గొప్పగా అంటుంది అని తెలిపారు తారక్. ఇక ఈ సందర్భంగా తారక్ చేసిన వ్యాఖ్యలను మరోసారి వైరల్ చేస్తున్నారు అభిమానులు. ఇక తారక్ మాటలను బట్టి చూస్తే కొరడాల శివ నెక్స్ట్ సినిమా దేవర2 అని తెలుస్తోంది. పార్ట్2 పూర్తి అయిన తర్వాతనే తదుపరి సినిమాకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా పూర్తవ్వగానే దేవర 2 షూట్ మొదలుపెడతాడని సమాచారం.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!