సాధారణంగా పిల్లలు 9 నెలలు పూర్తి అయిన తర్వాత జన్మిస్తారు. ఈ విధంగా నెలలు నిండిన తర్వాత పుట్టిన బిడ్డ ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. కానీ కొందరు 8 నెలల కే జన్మిస్తూ ఉంటారు. ఇలా 8 నెలలకే జన్మించడం చాలా అరుదు. ఒకవేళ జన్మించిన ఎన్నో అనారోగ్య సమస్యలతో జన్మిస్తారు. అచ్చం ఇలాగే ఉత్తర ఐర్లాండ్లో ఓ బుడ్డోడు నెల తక్కువగా పుట్టాడు. నెల ముందుగా పుట్టినప్పటికీ అతని శరీర బరువు పెరగకపోగా అతని జుట్టు మాత్రం విపరీతంగా పెరిగిపోవడంతో ఈ బుడ్డోడు ప్రస్తుతం సెలబ్రిటీగా మారిపోయాడు.
Advertisement
ఉత్తర ఐర్లాండ్లో జాక్సన్ జేమ్స్ అయర్స్ అందరి పిల్లలు మాదిరి కాకుండా 8 వారాలు ముందుగానే జన్మించాడు. ప్రస్తుతం మూడు నెలల వయసున్న జాక్సన్ జుట్టు విపరీతంగా పెరిగిపోతుంది.అయితే ఈ విధంగా జుట్టు కేవలం తలపై మాత్రమే కాకుండా అతని శరీర భాగాలపై అధికంగా పెరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బాబును చూసినవారందరూ త్వరలోనే తనని హెయిర్ కట్ తీసుకెళ్లాలని సలహాలు ఇస్తున్నట్లు పిల్లాడి తల్లి తెలియజేశారు.
కేవలం మూడు నెలల వయసుకే జాక్సన్ కి ఇలా జుట్టు పెరగడానికి గల కారణాన్ని తన తల్లి వివరించింది. ఆ పిల్లాడు హైపెర్ ఇన్సూలినిజమ్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి బారిన పడిన వారికి తరచూ డయాజోజైడ్ మందులు ఇవ్వాలి. ఇలా మందును ఇస్తూ బాబు శరీరంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా డయాజోజైడ్ మందులు ఇవ్వటంతో జాక్సన్ కి ఇలా జుట్టు పెరగడం వంటి సైడ్ఎఫెక్ట్ వచ్చిందని తెలిపారు.
హైపర్ ఇన్సూలినిజమ్ అనే అనారోగ్యం ప్రతి 30వేల మంది పిల్లల్లో ఒకరికి వస్తుంది. ఈ విధమైనటువంటి సమస్య ఉన్న వారిలో శరీరంలో చక్కెర శాతం పూర్తిగా తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే వారికి డయాజోజైడ్ మందు ఇస్తూ ఉండాలి. ఈ మందు ఎవరు వాడినా ఈ జుట్టు పెరిగే సమస్య ఉంటుందట. ఈక్రమంలోనే జాక్సన్ కి మందులు వేయడం వల్ల అతనికి శరీర భాగం మొత్తం అధికంగా జుట్టు పెరిగినట్లు తల్లి షానన్ అయిరెస్ చెప్పినట్లు డైలీ మెయిల్ తెలిపింది.
Advertisement
అందరి తల్లులు మాదిరిగానే తన కొడుకును ఈ ప్రపంచానికి చూపించాలి అనే కుతూహలంతో అతని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వాడి చుట్టూ వల్ల వాడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని షానన్ అయిరెస్ వివరించారు.
Samantha: సినీ నటి సమంత ఇటీవల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈమె తన రాజకీయాలలో భాగంగా సమంత అక్కినేని కుటుంబం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా కొండ సురేఖ వార్తలలో నిలవడమే కాకుండా నాగార్జున ఈమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.
Advertisement
ఈ విధంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సమంతతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం స్పందిస్తూ ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక అప్పట్లో సమంత ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. తాజాగా మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ.. సౌత్ సినీ ఇండస్ట్రీ అండగా నిలిచి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇండస్ట్రీ ప్రజలు చూపించిన ఈ ప్రేమే నన్ను ఈ వివాదం నుంచి బయటపడేలా చేసింది. లేకుంటే మరింత కృంగిపోయే దానిని. అందరి సపోర్ట్ వల్లే తిరిగి మీ ముందు కూర్చున్నాను అంటూ ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇండస్ట్రీ సపోర్ట్.. కొండా సురేఖ సమంత గురించి తప్పుగా మాట్లాడటమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ గురించి సంచలన ఆరోపణలు చేశారు. సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ ఈమె వారి గురించి మాట్లాడటంతో అప్పట్లో తెలంగాణ రాజకీయాలలోనూ,సినీ ఇండస్ట్రీలోనూ ఈ విషయం సంచలనంగా మారింది.
Samantha: సినీ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత తన వ్యక్తిగత కారణాలు అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లకు కమిట్ అయ్యారు.
Advertisement
ఇక సమంత వ్యక్తిగత విషయానికి వస్తే నటుడు నాగచైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం పాటు కొనసాగ లేకపోయారు. సమంత నాగచైతన్య ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను చూపించుకునేవారు. అయితే వీరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.
ఇలా విడాకులు తీసుకున్న తర్వాత సమంత నాగచైతన్యకు సంబంధించిన జ్ఞాపకాలు అన్నిటిని కూడా చెరిపివేసింది. ఇలా తాను ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని వెనక్కి పంపియడమే కాకుండా తన మెడలో తాళిని కూడా వెనక్కి తిరిగి ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలన్నింటినీ కూడా కాల్చేసిన సమంత ఒకే ఒక గిఫ్ట్ మాత్రం భద్రంగా పెట్టుకున్నారని తెలుస్తుంది. పెళ్లి ఫోటో.. మరి సమంత భద్రంగా దాచుకున్న ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే.. నాగచైతన్య సమంత పెళ్లిలో దిగిన ఫోటోని భద్రంగా దాచి ఉంచారని తెలుస్తోంది. తన పెళ్లిలో తన తల్లిదండ్రులతో పాటు నాగచైతన్య సమంత కలిసి దిగిన ఫోటో అంటే తనకు చాలా ఇష్టమని గతంలో పలు సందర్భాలలో సమంత తెలిపారు. ఆ ఫోటోని మాత్రం అలాగే భద్రంగా ఉంచుకున్నారని తెలుస్తోంది.
Bahubali 3: ప్రభాస్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ హీరోగా బాహుబలి సినిమా గుర్తింపు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు.
Advertisement
ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే త్వరలోనే బాహుబలి త్రీ కూడా రాబోతోంది అంటూ తాజాగా నిర్మాత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో బాహుబలి 3 గురించి ప్రభాస్ రాజమౌళి మాట్లాడిన ఇప్పుడే అలాంటి ఆలోచనలేమీ లేవని తెలిపారు.
ఇకపోతే తాజాగా కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల బాహుబలి నిర్మాతలతో కలిసి మాట్లాడానని అయితే వారు బాహుబలి 3 కూడా ఉండబోతోందని తెలిపారంటూ జ్ఞానవేల్ రాజా వెల్లడించారు.
బాహుబలి 3.. ఇలా బాహుబలి నిర్మాతలు పార్ట్ 3 కూడా ఉండబోతుందని చెప్పారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రభాస్ ఈ సినిమా చేసిన ఇప్పట్లో రాదని తెలుస్తుంది. ఇప్పటికే ఈయన సుమారు ఐదు పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి వరుస షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాతనే బాహుబలి త్రీ గురించి ఆలోచిస్తారని అభిమానులు చర్చలు జరుపుకుంటున్నారు.