Featured
YS Jagan : పడి లేచిన కెరటమవుతారా? పత్తా లేకుండా పోతారా?
Published
4 months agoon
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడే అసలు సిసలైన పరీక్ష. ఒకప్పుడు జగన్ తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయంలో అయినా ఆయనకు కొందరు రాజకీయ ప్రముఖులు అండగా నిలిచారు. ఇప్పుడు ఎంతమంది నిలుస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. 11 అసెంబ్లీ.. 4 ఎంపీ సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇంతటి దారుణ పరాజయం వైసీపీ పెట్టిన తర్వాత ఇదే తొలిసారి. కాబట్టి ఇప్పుడు జగన్కు ఇది అత్యంత కష్టకాలం. ఆయన లైఫ్లో వరస్ట్ డేస్ తిరిగి రాబోతున్నాయనడంలో సందేహమే లేదు. జగన్ ఎందుకు ఓటమి పాలయ్యారనే విషయాలను పక్కనబెడితే ఆయనతో నిలిచేదెవరనేదే ఆసక్తికరం. వైసీపీ తరుఫున గెలిచిన వారంతా జగన్తో ఉంటారా? అనేది ప్రశ్నార్థకమే. వీరిలో ఎందరు ఉంటారో.. ఎందరు పక్క చూపు చూస్తారో తెలియదు. మొత్తంగా జగన్ జీరో అయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు.
ఇదే అసలు సిసలైన పరీక్ష..
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ అధికారం కావాలి. అధికారాన్ని అనుభవించేందుకు అలవాటు పడిన వ్యక్తి అది లేకుండా ఒక్క క్షణం కూడా నిలవలేడు. ఇది లోక రీతి. ఈ లెక్కన చూస్తే జగన్ జీరో అయినా ఆశ్చర్యం లేదు. అలాగే కేసులు కూడా జగన్ మెడ చుట్టూ చుట్టుకునే అవకాశం ఉంది. జగన్ కూడా లేకుంటే పార్టీ పరిస్థితి ఏంటన్న ఆందోళన సైతం గెలిచిన నేతలకు ఉండొచ్చు. కాబట్టి వారంతా వైసీపీలోనే కొనసాగుతారని భావించడం తప్పే అవుతుంది. ఇప్పటి వరకూ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ.. ఎంపీలు కానీ తాడేపల్లి వైపు కూడా తిరిగి చూడలేదని టాక్. కనీసం ప్రతిపక్ష హోదా కూడా జగన్ పార్టీకి దక్కలేదు. జగన్కు ఇంతకు మించిన దారుణ పరిస్థితి ఉండదేమో. ఇదే అసలు సిసలైన పరీక్ష. దీనిని జగన్ ఎలా దాటుతారు? ఈ పరిస్థితిని ఎదుర్కొని నిలుస్తారా? జీరోతో తన జీవితాన్ని మళ్లీ మొదలు పెడతారా? లేదంటే విపక్షాలు విమర్శిస్తున్నట్టుగా లండన్ వెళ్లి పోయి వ్యాపారాలు చూసుకుంటారా? ప్రతిదీ ఆసక్తికరంగానే ఉంది.
సహకరించే వారేరి?
నిన్న మొన్నటి వరకూ జగన్కు అండగా ప్రధాని మోదీ ఉండేవారు. ఇప్పుడు చంద్రబాబును కాదని మోదీ సైతం జగన్కు సాయం చేయలేరు. కాబట్టి కేంద్రం నుంచి కూడా ఎలాంటి సాయాన్ని వైసీపీ పొందలేదనడంలో సందేహమే లేదు. ఇప్పుడు జగన్ సమస్యల వలయంలో ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. అంతెత్తు ఎగిసి నేలకు చేరిన కెరటం. తిరిగి అదే స్పీడుతో కాకున్నా ఆలస్యంగానైనా లేస్తారా? లేదంటే పత్తా లేకుండా పోతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఆయనకు పట్టుదల ఉండొచ్చు కానీ సహకరించే వారేరి? నడిసంద్రంలో ఉన్నారు. ఒడ్డుకు చేర్చే నావ కోసం ఎదురు చూస్తున్నారు. గెలిచిన నేతలే తాడేపల్లి వైపు చూడటం లేదంటే.. ఓడిన నేతలు చూస్తారన్న నమ్మకం కూడా లేదు. కొంతమంది అయితే జగన్తో ఉండొచ్చు. వారికి కూడా వేరే దిక్కు లేదు కాబట్టి. అసలు జగన్ను ముంచిందే వారు కదా.. వారితో కలిసి పార్టీని పైకి లేపడమంటే సాధ్యమయ్యే పనేనా? ఏమో.. ఈ ప్రశ్నలన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి.
You may like
Featured
YS Jagan Mohan Reddy: జగన్ తిరుమలకు వస్తే ప్రభుత్వానికి ఎందుకంత భయం… ఫైర్ అయిన మాజీ టీటీడీ చైర్మన్!
Published
3 days agoon
27 September 2024By
lakshanaYS Jagan Mohan Reddy: తిరుమల లడ్డు విషయంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయామంలో తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్న తరుణంలో నిజానిజాలు బయట పెట్టాలి అంటూ వైకాపా నాయకులు మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వానికి చాలెంజ్ విసురుతున్నారు. ఇలా ఎంతోమందికి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీవారి ప్రసాద విషయంలో తప్పుడు ఆరోపణలు చేసి అపచారం చేశారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకోబోతున్నారు.
ఈరోజు సాయంత్రం తిరుమల చేరుకున్న ఆయన రేపు ఉదయం స్వామివారిని దర్శించుకోబోతున్నారు ఈ క్రమంలోనే తిరుపతి మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే కొంతమంది వైకాపా నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అలాగే పలు ప్రాంతాలలో వైకాపా కార్యకర్తలను నాయకులను పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తుంటే కూటమి ప్రభుత్వానికి ఎందుకు అంత భయం అని ఆయన ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. స్వామి వారిని దర్శించడం కోసం ఎవరైనా ఎప్పుడైనా రావచ్చని అడ్డుకునే హక్కు వారికి లేదని తెలిపారు.చంద్రబాబు పాశవిక విధానాలను తాము ఎన్నటికీ వ్యతిరేకిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. వెయ్యి నాలుకల ధోరణిని సీఎం చంద్రబాబు మానుకోవాలని తెలిపారు.
ఇక పవన్ హైందవ ధ్వజ స్తంభం మాదిరిగా ఫీల్ అవుతున్నాడని దుయ్యబట్టారు. మరో పార్టీ బీజేపీ హిందువులంటే తామే అన్నట్లుగా ఆ పార్టీ కార్యకర్తలు భ్రమలో ఉన్నారని ఆరోపించారు. ఇక జగన్మోహన్ రెడ్డి తిరుమల కొండపైకి వెళ్లాలి అంటే డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై కూడా భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.
డిక్లరేషన్ అడిగే హక్కు లేదు..
జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్వయంగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఇక ఆయనను డిక్లరేషన్ అడిగితే ఈ కూటమి ప్రభుత్వానికి పతనం ఖాయమని అన్నారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోతే.. దర్శనానికి అనుమతి లేదనే హక్కు టీటీడీకి కూడా లేదని తెలిపారు. డిక్లరేషన్ వెనుక రాజకీయ కుట్ర ఉందని.. ప్రభుత్వం ఎంత నిర్బంధిస్తే అంత పైకి లేస్తామని భూమన అన్నారు.
Featured
Savitri: మహానటి సావిత్రి మెడలో పూలమాల వేలం వేస్తే అంత ధర పలికిందా… మాములు క్రేజ్ కాదుగా?
Published
3 days agoon
27 September 2024By
lakshanaSavitri: సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో మహానటి సావిత్రి గారు ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన గుర్తింపు పొందిన ఈమె చివరి క్షణంలో మాత్రం ఎంతో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొని మరణించారు. ఇక సావిత్రి బ్రతికిన నినాదం ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపారని చెప్పాలి.
ఇక ఈమె సినిమాల పరంగా మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా సంపాదించినది మొత్తం దాన ధర్మాలకే ఖర్చు చేశారు. ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చిందని తన వద్దకు వస్తే చాలు తనకు తోచిన సహాయం చేసేవారు. ఇలా దాన గుణంలో సావిత్రికి మించిన వారు ఎవరు లేరని చెప్పాలి. ఇక అప్పట్లో ఈమెను అభిమానించే వారి సంఖ్య కూడా అధికంగానే ఉండేది.
ఇకపోతే సావిత్రి గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని సీనియర్ నటి జమున ఓ సందర్భంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఓసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విపత్తు నిథికి సినిమా వాళ్ల నుంచి విరాళాలు సేకరిస్తున్నారట. అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ నరసింహారావు గారు ఉన్నారు. అయితే ఆయన సావిత్రి గారి కోసం ఒక పూలమాలను తీసుకువచ్చినట్టు జమున తెలిపారు.
30 వేలు…
ఇలా సావిత్రి మెడలో వేసిన ఆ పూల దండను వేలం వేయగా అప్పట్లో ఆ పూలదండ 30000 ల ధర పలికిందని తెలుస్తుంది. అప్పట్లో 30 వేల రూపాయలు అంటే ఇప్పుడు 30 లక్షలతో సమానమని చెప్పొచ్చు. ఒక పూలదండ 30000 వేలంలో పోవడం అంటే సావిత్రి గారికి ఎలాంటి క్రేజ్ ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది.
Featured
Madhavi Latha: అప్పుడు మాట్లాడకుండా ఏం చేస్తున్నారు రాజా.. ప్రకాష్ రాజ్ పై ఫైర్ అయిన మాధవీ లత!
Published
3 days agoon
27 September 2024By
lakshanaMadhavi Latha: సినీ నటుడు ప్రకాష్ రాజ్ ప్రస్తుతం తిరుపతి లడ్డు వ్యవహారం పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతి లడ్డు తయారీలో గత ప్రభుత్వం కల్తీ చేస్తుందని జంతువుల కొవ్వు నుంచి తయారుచేసిన నూనె ఉపయోగించారంటే ఆరోపణలు చేయడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. అయితే ఈ విషయంపై నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తరచు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేస్తున్న పోస్టుల హాట్ టాపిక్ గా మారాయి.
ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ చేస్తున్న ఈ వ్యాఖ్యలపై సినీ నటి మాధవి లత స్పందించారు.వేరే మతం వారిని ఒక్క మాట అంటేనే నానా హంగామా చేస్తారు. మొన్న బెంగుళూర్ లో ఆంజనేయస్వామి కీర్తనాలు వింటున్న వాళ్ళను వేరే మతం వాళ్ళు వచ్చి కొడితే అలాంటి వారి పట్ల ఏం మాట్లాడరు అప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటూ ఈమె ప్రశ్నించారు.
హిందూ మనోభావాలను గౌరవించి..
ఇక లడ్డు విషయంలో హీరో కార్తీ తన ప్రమేయం లేకున్నా.. హిందువుల మనోభావాలను గౌరవించి వారు క్షమాపణలు చెప్పారు. ఇందులో ఆనందం ఏముంది? తప్పు చెప్పడం వల్ల ఎవరకి ఆనందం రాదు. ఇలా క్షమాపణ చెప్పడం వల్ల భవిష్యత్తులో ఇలాంటి విషయాలపై కామెంట్స్ చేయరాదనే సదుద్దేశ్యంతో వారు క్షమాపణలు చెప్పారని ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ చేస్తున్నటువంటి పోస్టులను తప్పుపడుతూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
YS Jagan Mohan Reddy: జగన్ తిరుమలకు వస్తే ప్రభుత్వానికి ఎందుకంత భయం… ఫైర్ అయిన మాజీ టీటీడీ చైర్మన్!
Savitri: మహానటి సావిత్రి మెడలో పూలమాల వేలం వేస్తే అంత ధర పలికిందా… మాములు క్రేజ్ కాదుగా?
Madhavi Latha: అప్పుడు మాట్లాడకుండా ఏం చేస్తున్నారు రాజా.. ప్రకాష్ రాజ్ పై ఫైర్ అయిన మాధవీ లత!
Pawan Kalyan: జగన్ తిరుపతి పర్యటన… కూటమి శ్రేణులకు పవన్ కీలక సూచనలు!
Sekhar Basha: అమ్మాయిలకు చట్టాలు చుట్టాలు వంటివి…జానీ మాస్టర్ కేసులో శేఖర్ భాషా కామెంట్స్!
TDP MLA: చెల్లి అంటూనే మహిళతో టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు.. వైరల్ అవుతున్న వీడియో?
Vijayawada Floods: విషాదం..నలుగురిని కాపాడాడు… వరదల్లో కొట్టుకుపోయాడు! భార్య 8 నెలల గర్భిణి!
Bollywood: తెరపై ప్రేక్షకులను భయపెట్టిన విలన్లు… వీరి భార్యలు గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Ambulance: ఘోరం… ఆంబులెన్సులో మహిళకు లైంగిక వేధింపులు.. నిండు ప్రాణాన్ని బలి తీశారుగా?
Nagababu: రేవంత్ రెడ్డి హైడ్రా నిర్ణయం పై నాగబాబు ప్రశంసలు… ఆంధ్రా సమస్యలు పట్టవా అంటూ?
Trending
- Featured4 weeks ago
Vijayawada Floods: విషాదం..నలుగురిని కాపాడాడు… వరదల్లో కొట్టుకుపోయాడు! భార్య 8 నెలల గర్భిణి!
- Featured4 weeks ago
TDP MLA: చెల్లి అంటూనే మహిళతో టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు.. వైరల్ అవుతున్న వీడియో?
- Featured3 weeks ago
Bollywood: తెరపై ప్రేక్షకులను భయపెట్టిన విలన్లు… వీరి భార్యలు గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- Featured4 weeks ago
Ambulance: ఘోరం… ఆంబులెన్సులో మహిళకు లైంగిక వేధింపులు.. నిండు ప్రాణాన్ని బలి తీశారుగా?
- Featured4 weeks ago
Nagababu: రేవంత్ రెడ్డి హైడ్రా నిర్ణయం పై నాగబాబు ప్రశంసలు… ఆంధ్రా సమస్యలు పట్టవా అంటూ?
- Featured3 weeks ago
Manikanta: అలా మాట్లాడటం సరికాదు.. మణికంఠ భార్యకు మద్దతుగా నిలిచిన సోదరి!
- Featured4 weeks ago
Sonia Akula: బిగ్ బాస్ కంటెస్టెంట్.. కరాటే ఫైటర్ సోనియా ఆకుల బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
- Featured3 weeks ago
Nithya Menon: నిత్యామీనన్ మలయాళీ అమ్మాయి కాదా… తన అసలు పేరు అదేనా?