Connect with us

Featured

Mahesh Babu: తెలంగాణ సీఎంను కలిసిన మహేష్ దంపతులు.. వైరల్ అవుతున్న మహేష్ కొత్త లుక్!

Published

on

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత దంపతులు ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు లుక్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇటీవల తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లో పెద్ద ఎత్తున వరదలు సంభవించిన సంగతి తెలిసిందే.

Advertisement

ఇలా వరదలు రావడంతో సినిమా ఇండస్ట్రీ పెద్ద ఎత్తున విరాళాలను అందజేశారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి చెక్కులను అందజేస్తూ వచ్చారు. తాజాగా మహేష్ బాబు నమ్రత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి అయితే ఇందులో మహేష్ బాబు సరికొత్త లుక్ బయటకు రావడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

పొడవాటి జుట్టు గుబురు గడ్డంతో మహేష్ బాబు ఎంతో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. అయితే మహేష్ బాబు ఈ మేకోవర్ రాజమౌళి సినిమా కోసం అనే సంగతి మనకు తెలిసిందే. ఈయన రాజమౌళి సినిమాకు కమిట్ అయ్యారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అతి త్వరలోనే షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తుంది.

పొడువాటి జుట్టులో..
ఇక మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాబోతుందనే విషయం తెలియడంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా భాగం కాబోతున్నారనే విషయం తెలియడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Abhay Naveen: బిగ్ బాస్ ను అందుకే తిట్టాను… అసలు కారణం బయటపెట్టిన అభయ్ నవీన్!

Published

on

Abhay Naveen:అభయ్ నవీన్ నోటి దూల కారణంగా బిగ్ బాస్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈయన సీజన్ 8 కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టారు. అయితే మూడవ వారంలో ఎలాంటి కంటెంట్ ఇవ్వకపోగా బిగ్ బాస్ గురించి ఇష్టానుసారంగా మాట్లాడటంతో నాగార్జున సైతం ఈయనకు తనదైన స్టైల్ లోనే వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

మూడవ వారంలో భాగంగా నవీన్ హౌస్ లో బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ ఎన్నో విమర్శలు చేశారు. పెళ్ళాంతో గొడవపడి మనకి టాస్కులు ఇస్తున్నారని చిన్నపిల్లల మాదిరిగా టాస్కులు ప్లాన్ చేశారు అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడటంతో ఈయన బిగ్ బాస్ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నవీన్ తాను బిగ్ బాస్ ను తిట్టడానికి గల కారణం ఏంటనే విషయాన్ని బయట పెట్టారు.

ఈ సందర్భంగా యాంకర్ ప్రశ్నిస్తూ అసలు బిగ్ బాస్ ను ఎందుకు తిట్టారు ఒక మనిషి పదిమందికి చేయలేరు కానీ ముగ్గురు ఆరుగురికి వంట చేయొచ్చు కదా అంటూ ప్రశ్నలు వేయడంతో చేయొచ్చు కానీ ఎలాంటి కండిషన్స్ టైమర్ లేకపోతే చేయొచ్చని అభయ్ తెలిపారు. అప్పటికే మూడు రోజుల నుంచి సరిగా తినలేదు రేషన్ రావడంతో సంతోషపడ్డాము అయితే బిగ్ బాస్ టైమర్ చెప్పడంతో ఇబ్బంది పడ్డామని తెలిపారు.

ఫుడ్ బాగలేదు..
ఇక హౌస్లో ఫుడ్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రేపటి కోసం కూడా ఈ రోజే ముందుగా ఫుడ్ చేసి పెట్టుకోవాలి అలాంటి ఫుడ్ తినడం వల్ల ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆదిత్య ఓం చాలా ఇబ్బంది పడ్డారని అందుకే తాను అలా కోప్పడ్డానని తెలిపారు. గాయమైన తర్వాత ఆయింట్మెంట్ రాసుకోవడం కంటే గాయం మానకుండా చూసుకోవడమే మంచిది కదా అనే పాలసీని నేను ఫాలో అవుతాను అంటూ మరోసారి అభయ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Janhvi Kapoor: మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో.. మీరు అంతే ముఖ్యం: జాన్వీ కపూర్

Published

on

Janhvi Kapoor: దివంగత నటి శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటి జాన్వీ కపూర్. ఈమె ఇదివరకు బాలీవుడ్ సినిమాలలో నటించిన మొదటిసారి దేవర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

Advertisement

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకలు నిర్వహించాలని భావించారు. కొన్ని కారణాల వల్ల వాయిదా పడటంతో చిత్ర బృందం వరుస వీడియోలను విడుదల చేస్తూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నటి జాన్వీ కపూర్ ఒక వీడియోని విడుదల చేశారు అయితే ఈ వీడియోలో ఈమె తెలుగులో మాట్లాడటం విశేషం.

ఈ సందర్భంగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం నన్ను ఇంతలా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇక ఎన్టీఆర్ అభిమానులు నన్ను ఎంతో ముద్దుగా జాను పాపా అంటూ పిలుస్తుండడం చాలా సంతోషంగా ఉంది ఇక మా అమ్మ అంటే మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు అలాగే అమ్మకు కూడా మీరు అంతే ముఖ్యమని తెలిపారు. అదేవిధంగా నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరూ గర్వపడే రోజు కోసం కష్టపడతానని తెలిపారు..

జానూ పాప…

Advertisement

ఇక దేవర సినిమాలో నాకు ఇలాంటి అవకాశం కల్పించినందుకు చిత్ర బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపారు. అయితే ఈ విషయాలన్నింటినీ స్వయంగా తాను ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పాలనుకున్నాను కానీ కుదరలేదు. అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను అంటూ ఈ సందర్భంగా జాన్వీ ఎంతో ముద్దుగా తెలుగులో మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Chiranjeevi: గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకున్న మెగాస్టార్… నాగబాబు పోస్ట్ వైరల్!

Published

on

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఇటీవల కాలంలో చిరంజీవి వరుస అత్యుత్తమమైన గౌరవాలను అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో దక్కడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఇకపోతే ఈయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు చోటు రావడంతో మెగా కుటుంబ సభ్యులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు సైతం తన అన్నయ్యకు అభినందనలు తెలియజేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

నేను డిగ్రీ చదివేప్పుడు నా దగ్గర గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఒక పుస్తకం ఉండేది. అందులో సినిమా సంబంధిత రికార్డ్స్ నేను ఎక్కువగా చూడలేదు. అద్భుతమైన సెట్స్ వేసినప్పుడో, బాండ్ చిత్రాల వంటి వాటిల్లో బోట్ తో లాంగ్ జంప్స్ చేసినప్పుడో ఇలా కొన్ని రికార్డ్స్ గురించి చదివాను. అవి కూడా చాలా తక్కువలో తక్కవ. నాకు తెలిసి ఒక 5% మాత్రమే.

గర్వంగా ఉంది..
ప్రస్తుతం అన్నయ్య సినిమాలలో నటిస్తూ 143 చిత్రాలలో 537 పాటల్లో 24 వేల డాన్స్ మూమెంట్స్ చేసినందుకు గాను ఇలాంటి అరుదైన రికార్డ్ గిన్నిస్ బుక్ లో నమోదు చేస్తూ పురస్కరించినందుకు చాలా గర్వంగా ఆనందంగా ఉంది ఆల్ ద బెస్ట్ అన్నయ్య అండ్ తన సంతోషాన్ని తెలియజేస్తూ ఈయన సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!