Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ సుకుమారన్.. డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు ఈ మలయాళ నటుడు. సలార్ సినిమా ముందు వరకు పృథ్వీరాజ్ ఎవరు అన్నది చాలామందికి తెలియదు. కానీ ఈ ఒక్క సినిమాతో భారీగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. సలార్ సినిమాలో ప్రభాస్ స్నేహితుడి పాత్రలో వరదరాజమన్నార్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇకపోతే నేడు ఆయన పుట్టినరోజు. మరి ఆయన 42వ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి చాలామందికి తెలియని విషయాల గురించి మనం తెలుసుకుందాం..
Advertisement
కేరళలో పుట్టి పెరిగిన పృథ్వీరాజ్ ది సినీ నేపథ్య కుటుంబం. తండ్రి పరమేశ్వరన్ సుకుమారన్, తల్లి మల్లిక, అన్నయ్య ఇంద్రజిత్, వదిన పూర్ణిమ ఇలా అందరూ కూడా నటులే కావడంతో పృథ్వీ చిత్ర పరిశ్రమలోకి రాకుండా మరో రంగంలో స్థిరపడాలని అనుకున్నారు. అలా ఉన్నత చదువు కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. అక్కడ ఉన్నప్పుడే దర్శకుడు రంజిత్ నుంచి ఒక సినిమాకి సంబంధించి ఆడిషన్ కోసం పిలుపు రావడంతో సరదాగా స్క్రీన్టెస్ట్ కు హాజరయ్యారు. తాను అనుకున్న హీరో పాత్రకు పృథ్వీ సరిపోతారనిపించడంతో డైరెక్టర్ ఆయన్ను ఎంపిక చేసుకున్నారు. అలా తొలిసారి నందనం సినిమాలో నటించారు.
అలా ఆయన ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు. పృధ్విరాజ్ భార్య పేరు సుప్రియ మేనన్. ఒకప్పుడు ఆమె జర్నలిస్టు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసి, పెళ్లి పీటలెక్కించింది. సతీమణి వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని గర్వంగా చెబుతుంటారు పృథ్వీ. వీరికో పాప. పేరు అలంకృతా మేనన్ సుకుమారన్. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో సెట్లో ఉన్నంతసేపూ ఆయనకు చాలా బోరింగ్గా అనిపించేదట. దాంతో ఏదైనా సినిమా అంగీకరించేముందు ఇదే చివరిది.
ఆ పని చేసే వాడిని..
Advertisement
దీన్ని పూర్తిచేశాక ఆస్ట్రేలియా వెళ్లిపోవాలి అని అనుకునేవాడినని ఒక సందర్భంలో తెలిపారు పృథ్వీ. అలా అనుకుంటూనే పలు సినిమాలు పూర్తి చేయడంతో క్రమంగా అదే తన ప్రపంచంగా మారిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు. సింగర్, నరేటర్గానూ అలరించారు. కాగా ఈ హీరోకి ప్రయాణాలంటే చాలా ఇష్టమట. అందమైన లొకేషన్లను ఫొటోలు తీయడం అలవాటు. ఇండస్ట్రీలోకి రాకపోయుంటే ట్రావెల్ వ్లాగర్ అయ్యేవాడినని ఒక సందర్భంలో తెలిపారు పృథ్వీరాజ్ సుకుమారన్.
Aara Mastan: ఇటీవల హర్యానాలో జరిగిన ఎన్నికల ఫలితాలు ఎవరు ఊహించని విధంగా వచ్చాయి. కాంగ్రెస్ గెలుస్తుందని అందరూ భావించినప్పటికీ చివరికి బిజెపి హర్యానాలో విజయకేతనం ఎగరవేసింది. అయితే తాజాగా హర్యానా ఎన్నికల ఫలితాలపై ఆరా మస్తాన్ చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి.
Advertisement
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆరా మస్తాన్ ఈవీఎంల ట్యాంపరింగ్ చేయడం కుదురుతుందని, అందుకే ఊహించిన ఫలితాలు రాకుండా వేరే ఫలితాలు వస్తున్నాయని తెలిపారు.తను వైసీపీ గెలుస్తుందని సర్వే చేసే తెలిపామని అది అబద్ధం అయ్యిందని దానికి కారణం ఈవీఎం టాంపరింగ్ అని అన్నారు. హర్యానాలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సమయంలో కాంగ్రెస్ ఆధిపత్యం చెలాయించింది. అదే ఈవీఎం కౌంటింగ్ సమయంలో బిజెపి ముందంజలోకి వచ్చింది.
దీన్ని బట్టి మనం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని అర్థం చేసుకోవచ్చని ఆరా మస్తాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా ఇక్కడ గెలుస్తామనే నియోజకవర్గాలలో కాకుండా వేరే నియోజకవర్గాలలో ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలుస్తున్నారని ఆరా మస్తాన్ ఆరోపించారు.
ఈవీఎంలు ట్యాంపరింగ్ .
Advertisement
ఒకప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి చంద్రబాబు ఏ మాట్లాడాలని కానీ ఇప్పుడు మాత్రం ఆయన గప్చుప్ గా ఉన్నారని దీన్ని బట్టి ప్రజలు ఒకటే అర్థం చేసుకోవాలని ఆయన తెలిపారు.ఇప్పుడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
AP Government: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల హామీలలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామంటూ హామీలు ఇచ్చారు. ఇకపోతే మహిళలకు ఉచిత బస్సు వారికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చారు.
Advertisement
ఇలా అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్న కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి పథకాలను అమలు చేయడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి అయితే ఈ దీపావళి పండుగకు మహిళలకు బంపర్ ఆఫర్ ఇస్తూ రెండు పథకాలను అమలులోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో పాటు గ్యాస్ సిలిండర్ల పంపిణీ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ దీపావళి పండుగను పురస్కరించుకొని ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అలాగే ఫ్రీ బస్సు ప్రయాణాన్ని కూడా తెలియజేయడంతో మహిళలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అమ్మ ఒడి ప్రతినెలా ప్రతి 18 సంవత్సరాలు దాటిన మహిళలకు 1500 ఇస్తున్నట్లు కూడా ఎన్నికల హామీలలో చెప్పారు కానీ ఇప్పటివరకు వీటిని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయకపోవడంతో విమర్శలను ఎదుర్కొంటున్నారు.
ఫ్రీ బస్ సౌకర్యం.. ఆగస్టు 15వ తేదీన ఫ్రీ బస్సు సౌకర్యం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అప్పట్లో తెలిపారు. అయితే ఈసారి మాత్రం దీపావళికి ఉంటుందని పలువురు ఎమ్మెల్యేలు వెల్లడించారు కానీ ఇంకా ఎలాంటి అధికారిక ఉత్తర్వులు మాత్రం వెల్లడించకపోవడంతో పలువురు నిన్ను నమ్మం బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
MS Narayana: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు ఎంఎస్ నారాయణ ఒకరు. ఈయన తన అద్భుతమైన కామెడీ ద్వారా ప్రేక్షకులను మెప్పించారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 17 సంవత్సరాలలోనే సుమారు 700కు పైగా సినిమాలలో నటించి రికార్డు సాధించారు.
Advertisement
ఇలా తాగుబోతు క్యారెక్టర్ లోను అలాగే ఎమోషనల్ సన్నివేశాలలో కూడా అందరిని ఆకట్టుకునే విధంగా తన నటనతో మెప్పించిన ఎమ్మెస్ నారాయణ గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ తనకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు .ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఎమ్మెస్ నారాయణ తోబుట్టువులు పదిమంది అని తెలిపారు. ఏడుగురు అబ్బాయిలు కాగా ముగ్గురు అమ్మాయిలని ఈయన ఒక సందర్భంలో తెలిపారు. అయితే తన చిన్న చెల్లెలు పెళ్లి జరిగిన కొద్దీ రోజులకి మరణించారని ఆ విషయం తనని ఎంతగానో బాధపెట్టిన సంఘటన అంటూ తెలిపారు.
నేను సినిమాలలోకి రాకముందు ఒక స్కూల్ టీచర్ గా పని చేసే వాడిని అప్పట్లో చాలీచాలని జీతం వచ్చేది. తద్వారా కుటుంబ పోషణ ఎంతో భారంగా ఉండేదని ఎమ్మెస్ నారాయణ తెలిపారు. ఇలా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తరుణంలో తన చెల్లెళ్లకు కూడా పెద్దగా ఏమి పెట్టుకోలేకపోయానని తెలిపారు.
Advertisement
స్కూల్ టీచర్.. ఇలా తాను ఇండస్ట్రీలోకి రాకముందు స్కూల్లో టీచర్ గా పని చేసే వారని వెల్లడించారు. అయితే ఈయన చాలా సినిమాలలో కూడా లెక్చరర్ పాత్రలను ప్రిన్సిపల్ పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు.