Connect with us

Featured

ఐటెం సాంగ్స్ చేసే నటీమణులను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే.!

Published

on

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు వాళ్ళకంటూ మంచి గుర్తింపు రావడం కోసం చాలా రకాల పాత్రలను చేసి మంచి గుర్తింపును సాధించుకుంటారు ప్రస్తుతం చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని కోరుకుంటూ ఎవరూ చేయని భిన్నమైన కథలను ఉంచుకొని చేయాలి అనే ఉద్దేశంతో అహర్నిశలు కష్టపడుతూ మంచి కథలు చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు అయితే అలాంటి పరిస్థితిలో ఒకప్పుడు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ ,వెంకటేష్ లాంటి అగ్ర హీరోలు వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చేవారు. అప్పుడప్పుడు వారు కొన్ని వైవిధ్యమైన చిత్రాలను చేసి మంచి హీరోలు అనిపించుకున్నప్పటికీ ఎక్కువగా కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తూ ప్రేక్షకులను అలరించేవారు.

Advertisement

కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లో లెక్కలు మారిపోయాయి. చూసే ప్రేక్షకుల అభిరుచి కూడా మారిపోయింది అని చెప్పాలి. కొత్త సినిమా వస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఇప్పుడు కూడా అదే జరుగుతుంది వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కిస్తున్న చాలామంది దర్శకులు ప్రేక్షకుల అభిరుచిని కనిపెట్టి సక్సెస్ ఫుల్ సినిమాలుగా మార్చుకుంటున్నారు. అలా చాలా మంది దర్శకులు హీరోలుగా మంచి సక్సెస్ లు కొట్టి డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నారు. వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే ఒకప్పుడు సినిమాల్లో ఐటంసాంగ్స్ చేయడానికి ఐటం బామలు సపరేట్ గా ఉండేవారు. వారు ప్రతి సినిమాలో ఐటెం సాంగ్స్ చేస్తూ జనాలని ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ సినిమా సక్సెస్ సాధించడంలో వాళ్ళ వంతు పాత్ర పోషిస్తూ ఉండేవారు.

ఒకప్పుడు జయమాలిని లాంటి వారు వ్యాంపు క్యారెక్టర్ లో చేస్తూ మంచి గుర్తింపు పొందారు. వాళ్ల తరువాత సిల్క్ స్మిత కూడా సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ సంపాదించుకుంది. సిల్క్ స్మిత ఐటమ్ సాంగ్స్ చేస్తున్న టైంలోనే డిస్కోశాంతి కూడా ఐటెం సాంగ్స్ చేస్తూ మంచి గుర్తింపు సాధించుకుంది. అయితే ప్రస్తుతం సినిమాల్లో ఐటెం సాంగ్ లు హీరోయిన్స్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఒక సినిమాలో ఒక హీరోయిన్ ఐటెం సాంగ్స్ చేస్తూ హీరోయిన్ గానే కాకుండా ఐటం బామలుగా కూడా మంచి గుర్తింపు సాధించుకుంటు రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే ఒకప్పుడు ఇండస్ట్రీలో మంచి హీరోలుగా నటులుగా గుర్తింపు పొందిన వ్యక్తులు కొంత మంది ఐటెం భామలను పెళ్లి చేసుకున్నారు. వారు ఎవరో ఒకసారి మనం చూద్దాం..

శ్రీహరి – డిస్కో శాంతి

Advertisement

శ్రీహరి ఇండస్ట్రీకి వచ్చిన మొదట విలన్ గా వేషాలు వేస్తూ మంచి గుర్తింపు సాధించుకున్నారు. ఆ తర్వాత హీరోగా కూడా చాలా సినిమాల్లో నటించి హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా రియల్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకుని ఇండస్ట్రీలో యాక్షన్ సన్నివేశాలు అన్ని రియల్ గా చేసి ప్రేక్షకుల్ని అలరించేవారు. అందులో భాగంగా భద్రాచలం లాంటి సినిమా లో ఆయన పోషించిన పాత్ర కి మంచి పేరు రావడంతో పాటు సినిమా కూడా మంచి సక్సెస్ ను అందుకుంది. అయితే అప్పుడు ఐటమ్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న డిస్కో శాంతిని శ్రీహరి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అప్పట్లో శ్రీహరి మరణించిన విషయం మనందరికీ తెలిసిందే..

జెడి చక్రవర్తి – అనుకృతి శర్మ

హీరోగా తెలుగులో మంచి గుర్తింపు పొందారు జె.డి.చక్రవర్తి. శివ సినిమాతో విలన్ గా పరిచయం అయినప్పటికీ ఆ తర్వాత హీరోగా మంచి సినిమాల్లో నటించి తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. బొంబాయి ప్రియుడు, ప్రేమకు వేళాయరా లాంటి సినిమాల్లో హీరోగా చేసి మంచి గుర్తింపు పొందారు. వాళ్ల గురువైన రాంగోపాల్ వర్మ తీసిన శ్రీదేవి సినిమాలో వ్యాంప్ క్యారెక్టర్ పోషించిన అనుక్రూత శర్మని పెళ్లి చేసుకున్నారు జేడీ చక్రవర్తి..

Advertisement
Continue Reading
Advertisement

Featured

Vishnu Priya: హౌస్ లో విష్ణుప్రియ బట్టలు మార్చుకోవడం చూసింది అతనేనా.. ఎవరంటే?

Published

on

Vishnu Priya: బిగ్ బాస్ హౌస్ అంటేనే పెద్ద ఎత్తున గొడవలు వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఇక ఈ సీజన్ లో కూడా కంటెస్టెంట్ల మధ్య ఇలాంటి గొడవలే జరుగుతున్నాయి. ప్రస్తుతం హౌస్ లో కొనసాగుతున్న విష్ణు ప్రియ సోనియా మధ్య భారీ స్థాయిలో వివాదం జరుగుతుంది. సోనియా విష్ణు ప్రియ ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది.

Advertisement

నీకు ఫ్యామిలీ లేదు నాకు ఫ్యామిలీ ఉంది నీలాగా బట్టలు వేసుకుని తిరగలేను అంటూ ఇస్టానుసారంగా మాట్లాడటంతో సోనియా బాగా నెగిటివ్ అవుతుంది. నిజానికి విష్ణు ప్రియ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బిగ్ బాస్ హౌస్లో చేయలేదు. అంతేకాకుండా సోనియా ఫేమస్ అవడం కోసం విష్ణు ప్రియను టార్గెట్ చేస్తూ వస్తున్నారు.

ఇక విష్ణు ప్రియ గురించి నిఖిల్, అభయ్ దగ్గర మాట్లాడుతూ.. విష్ణుప్రియ రూమ్లో బట్టలు మార్చుకుంటూ ఉంటే ఆదిత్య ఆ రూంలోకి వెళ్లారు. అయన వణుకుతూ బయటకు వచ్చారు.. ఆమె జస్ట్ బ్లౌజ్ లో ఉంది మళ్లీ వచ్చి ఆదిత్య గారు ఆన్ కంఫర్ట్బుల్ గా ఫీల్ చేశాను సారీ సారీ అని చెప్తుంది.

ఆదిత్య ఓం..
నిజానికి ఆదిత్య ఓం అంత అన్ కంఫర్ట్బుల్ ఫీల్ అయ్యారని అతనికి కూడా తెలియకపోవడం గమనించాల్సిన విషయం. సోనియా హౌస్ లో ఫేమస్ అవడం కోసం కేవలం విష్ణు ప్రియ ను టార్గెట్ చేస్తూ రావడంతో ఈమె పట్ల అభిమానులు కూడా ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముందు తనని హౌస్ నుంచి బయటకు పంపించేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ ఘటనపై ఈ వారం నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Janhvi Kapoor: దేవర ప్రమోషన్స్ కోసం జాన్వీ కట్టిన ఈ చీర ఖరీదు తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?

Published

on

Janhvi Kapoor: దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి జాన్వీ కపూర్. ఇదివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే సినిమాలు చేస్తూ ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం తెలుగు సినిమాల ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Advertisement

ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ముంబైలో ఎంతో ఘనంగా లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి చిత్ర బృందం మొత్తం హాజరయ్యారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ పాత్రలో నటించారు.

ఇక ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా జాన్వీ కపూర్ గులాబీ రంగు చీర కట్టుకొని సందడి చేశారు. అయితే ఈమె చీర అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈమె కట్టిన ఈ చీర ఖరీదు ఎంత ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక ఈ వేడుకలో జాన్వీ కపూర్ నచికేత్ బ్రావే డిజైన్ చీరను కట్టారు.

దేవర…
ఈ చీర ఖ‌రీదు అక్ష‌రాల రూ. 1,24,850. అలాగే పింక్ శారీకి పెయిర్ అప్ గా చెవుల‌కు జాన్వీ పెట్టుకున్న ఇయ‌ర్ రింగ్స్ ధ‌ర రూ. 13 ల‌క్ష‌లని తెలిసిన అభిమానులు ఒకసారిగా షాక్ అవుతున్నారు. ఇలా సెలబ్రిటీలు బ్రాండెడ్ దుస్తులను ధరించడం సర్వసాధారణం. ఇక దేవర సినిమా ద్వారా మొదటిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈమె ఈ సినిమా ద్వారా ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Star Anchor: నాట్యం చేస్తున్న ఈ నాట్య మయూరిని గుర్తుపట్టారా… ఇప్పుడు టాప్ యాంకర్?

Published

on

Star Anchor: సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా వారి చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అభిమానులు ఆ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు. తాజాగా ఒక యాంకరమ్మ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Advertisement

నాట్యం మయూరిలా ఎంతో చక్కగా నాట్యం చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈమె అభిమానులు ఈ ఫోటోను మరింత వైరల్ చేస్తున్నారు. మరి ఈ ఫోటోలో ఉన్న ఈమె ఎవరో తెలుసా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ యాంకర్. ఎస్ మీరు గెస్ చేసినది కరెక్టే ఇక్కడ ఉన్నది యాంకర్ సుమ.

సుమా కేరళకు చెందిన అమ్మాయి అయినప్పటికీ తన తల్లి తండ్రుల ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చారు. ఇక హైదరాబాదులో ఉంటూనే ఈమె ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. మొదట దేవదాస్ కనకాల దర్శకత్వంలో వచ్చిన మేఘమాల సీరియల్ తో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ సమయంలోనే రాజీవ్ కనకాలతో పరిచయం ఏర్పడటం ఆ పరిచయము కాస్త ప్రేమగా మారడం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది.

యాంకర్ సుమ..
ఇలా పెళ్లి తర్వాత కూడా సుమ ఇండస్ట్రీలో పలు సినిమాలు అలాగే సీరియల్స్ లో నటించారు. అనంతరం యాంకర్ గా కూడా మారి ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా ఎంతో బిజీగా కొనసాగుతున్నారు. ఏదైనా ఒక సినిమా వేడుక జరుగుతుంది అంటే కచ్చితంగా ఆ కార్యక్రమంలో సుమ ఉండాల్సిందే. ఆ సినిమా టీజర్ లాంచ్ నుంచి మొదలుకొని సక్సెస్ మీట్ వరకు సుమ పాత్ర ఎంతగానో ఉంటుందని చెప్పాలి.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!