Connect with us

Featured

Unstoppable Season 2: 1995 బిగ్ డెసిషన్ స్పందించిన చంద్రబాబు.. కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాను.. నేను చేసింది తప్పా? బాలకృష్ణ ఏమన్నారో తెలుసా?

Published

on

Unstoppable Season 2: టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ మొట్ట మొదటిసారిగా అన్ స్థాపబుల్ విత్ ఎన్బికే షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ తెలుగు ఓటిటీ సంస్థ ఆహా లో ప్రసారమైన ఈ షో బాగా పాపులర్ అయ్యింది. అంతేకాకుండా ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ తో సంచలనం సృష్టించింది. బాలయ్య ఈ షోకీ హోస్ట్ గా వ్యవహరిస్తూ తనలో ఉన్న మరొక టాలెంట్ ను ప్రేక్షకులకు పరిచయం చేసారు. కాగా ఈ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను సైతం ఎంతగానో అలరించారు. ఈ షోలో తనదైన మ్యానరిజం, డైలాగ్స్, లుక్స్, సెన్సాఫ్ హ్యూమర్ తో అలరించారు.

Advertisement

ఇకపోతే ఇటీవలే మొదటి సీజన్ ముగిసిన విషయం తెలిసిందే. ఇక రెండవ సీజన్ మొదలవుతుందా అని బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. బాలయ్య అభిమానుల నిరీక్షణలకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. నేడు మధ్యాహ్నం 2 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది అన్ స్థాపబుల్ సీజన్ 2. ఈ షోలో మొదటి ఎపిసోడ్ కి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, కొడుకు నారా లోకేష్ హాజరయ్యారు. మొదటి ఎపిసోడ్ కె బాలకృష్ణ వియ్యంకుల వారు హాజరు కావడంతో ఈ ఎపిసోడ్ పై అంచనాలు మరింత పెరిగాయి.

అంతేకాకుండా మొదటి ఎపిసోడ్ ప్రారంభం కాకముందే ఎందుకు సంబంధించిన టీజర్, ప్రోమో లను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుంచి బాలయ్య అభిమానుల నుంచి భారీగా స్పందన లభించింది. ఇక ఇది ఇలా ఉంటే బాలకృష్ణ తనదైన శైలిలో పంచులు కామెడీ చేస్తూ వారిని నవ్వించారు. అంతే కాకుండా గతంలో అనగా 1995లో బిగ్ డెసిషన్ కు సంబంధించిన విషయాన్ని బాలకృష్ణ అడగగా ఆ విషయం పై స్పందించిన చంద్రబాబు..1995 లో జరిగిన బిగ్ డెసిషన్ పై కీలక వాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..

Unstoppable Season 2: కాళ్లు పట్టుకొని మరి బ్రతిమలాడాను..

ఆరోజు ఎమ్మెల్యేలు అందరూ వ్యతిరేకించారు. దీనిపై పెద్దాయనతో బాలయ్య, హరికృష్ణ, నాతో సహా మొత్తం ఐదుగురము భేటీ అయ్యాము. ఆ తర్వాత ఒక రూమ్ లో నేను, ఎన్టీఆర్ మూడు గంటలసేపు చర్చించుకున్నాం. ఆ సమయంలో నేను కాళ్లు పట్టుకొని మరి అడిగాను. చేద్దామని చెప్పాను. కానీ ఎన్టీఆర్ వినకుండా నన్ను ఒప్పించారు. మేము ఆరోజు చేసింది తప్పా అని చంద్రబాబు నాయుడు బాలకృష్ణను ప్రశ్నించగా వెంటనే స్పందించిన బాలకృష్ణ లేదు మీరు చేసింది కరెక్టే అని తెలిపాడు. అన్ స్థాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్లో భాగంగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు బాలకృష్ణ అభిమానులు మొదటి ఎపిసోడ్ కి రేంజ్ లో ప్రేక్షకధారణ లభించింది అంటే ఇక పోను పోను ఏ రేంజ్ లో ఉంటుందా అని అంచనా వేస్తున్నారు

Advertisement

Featured

Samantha: కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సమంత…అండగా నిలిచారంటూ?

Published

on

Samantha: సినీ నటి సమంత ఇటీవల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈమె తన రాజకీయాలలో భాగంగా సమంత అక్కినేని కుటుంబం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా కొండ సురేఖ వార్తలలో నిలవడమే కాకుండా నాగార్జున ఈమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ విధంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సమంతతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం స్పందిస్తూ ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక అప్పట్లో సమంత ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. తాజాగా మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ.. సౌత్ సినీ ఇండస్ట్రీ అండగా నిలిచి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇండస్ట్రీ ప్రజలు చూపించిన ఈ ప్రేమే నన్ను ఈ వివాదం నుంచి బయటపడేలా చేసింది. లేకుంటే మరింత కృంగిపోయే దానిని. అందరి సపోర్ట్ వల్లే తిరిగి మీ ముందు కూర్చున్నాను అంటూ ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇండస్ట్రీ సపోర్ట్..
కొండా సురేఖ సమంత గురించి తప్పుగా మాట్లాడటమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ గురించి సంచలన ఆరోపణలు చేశారు. సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ ఈమె వారి గురించి మాట్లాడటంతో అప్పట్లో తెలంగాణ రాజకీయాలలోనూ,సినీ ఇండస్ట్రీలోనూ ఈ విషయం సంచలనంగా మారింది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Samantha: నాగచైతన్య ప్రతి జ్ఞాపకాన్ని కాల్చేసిన సమంత.. ఆ ఒక్కటి భద్రంగా ఉంచుకుందా?

Published

on

Samantha: సినీ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత తన వ్యక్తిగత కారణాలు అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లకు కమిట్ అయ్యారు.

Advertisement

ఇక సమంత వ్యక్తిగత విషయానికి వస్తే నటుడు నాగచైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం పాటు కొనసాగ లేకపోయారు. సమంత నాగచైతన్య ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను చూపించుకునేవారు. అయితే వీరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇలా విడాకులు తీసుకున్న తర్వాత సమంత నాగచైతన్యకు సంబంధించిన జ్ఞాపకాలు అన్నిటిని కూడా చెరిపివేసింది. ఇలా తాను ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని వెనక్కి పంపియడమే కాకుండా తన మెడలో తాళిని కూడా వెనక్కి తిరిగి ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలన్నింటినీ కూడా కాల్చేసిన సమంత ఒకే ఒక గిఫ్ట్ మాత్రం భద్రంగా పెట్టుకున్నారని తెలుస్తుంది.
పెళ్లి ఫోటో..
మరి సమంత భద్రంగా దాచుకున్న ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే.. నాగచైతన్య సమంత పెళ్లిలో దిగిన ఫోటోని భద్రంగా దాచి ఉంచారని తెలుస్తోంది. తన పెళ్లిలో తన తల్లిదండ్రులతో పాటు నాగచైతన్య సమంత కలిసి దిగిన ఫోటో అంటే తనకు చాలా ఇష్టమని గతంలో పలు సందర్భాలలో సమంత తెలిపారు. ఆ ఫోటోని మాత్రం అలాగే భద్రంగా ఉంచుకున్నారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Bahubali 3: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలోనే బాహుబలి 3..హింట్ ఇచ్చిన నిర్మాత!

Published

on

Bahubali 3: ప్రభాస్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ హీరోగా బాహుబలి సినిమా గుర్తింపు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే త్వరలోనే బాహుబలి త్రీ కూడా రాబోతోంది అంటూ తాజాగా నిర్మాత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో బాహుబలి 3 గురించి ప్రభాస్ రాజమౌళి మాట్లాడిన ఇప్పుడే అలాంటి ఆలోచనలేమీ లేవని తెలిపారు.

ఇకపోతే తాజాగా కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల బాహుబలి నిర్మాతలతో కలిసి మాట్లాడానని అయితే వారు బాహుబలి 3 కూడా ఉండబోతోందని తెలిపారంటూ జ్ఞానవేల్ రాజా వెల్లడించారు.

బాహుబలి 3..
ఇలా బాహుబలి నిర్మాతలు పార్ట్ 3 కూడా ఉండబోతుందని చెప్పారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రభాస్ ఈ సినిమా చేసిన ఇప్పట్లో రాదని తెలుస్తుంది. ఇప్పటికే ఈయన సుమారు ఐదు పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి వరుస షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాతనే బాహుబలి త్రీ గురించి ఆలోచిస్తారని అభిమానులు చర్చలు జరుపుకుంటున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!