Connect with us

Featured

Aata Srividhya : చాలా రోజులకు ఆట శ్రీవిద్య.. బాబు పుట్టి చనిపోయాక.. సర్జరీ జరిగి.. ఇంత సన్నగా మారడానికి కారణం అదే..: ఆట శ్రీవిద్య

Published

on

Aata Srividya : ఈటీవీలో వచ్చే పోపులపెట్టే సీరియల్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయి ఆతరువాత ఈటీవీ సీరియల్ సంఘర్షణ లో ధరణి గా నటించిన శ్రీవిద్య అందరికి సుపరిచితురాలే. ఇక ఆట ప్రోగ్రామ్ తో మరింత పాపులర్ అయిన శ్రీ విద్య కెరీర్ బాగా ఉన్నా సమయంలోనే పెళ్లి చేసుకుని టీవీ కి దూరమయ్యారు. చాలా రోజుల తరువాత మళ్ళీ కొన్ని ఇంటర్వ్యూ లో పాల్గొంటున్న శ్రీ విద్య తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు.

Advertisement

బాబు పుట్టి చనిపోయాక…..

కెరీర్ బాగున్న సమయంలోనే ప్రస్తుతం రైటర్, డైరెక్టర్ గా ఉన్న వక్కంతం వంశీని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు శ్రీవిద్య. పెళ్లి తరువాత టీవీ కి దూరమైన శ్రీ విద్య 2010 లో ఒక బాబు పుట్టగా ఆ బాబు పుట్టిన వెంటనే చనిపోవడం వల్ల చాలా క్రుంగిపోయానంటూ చెప్పారు. ఇక మళ్ళీ ఒక పాప, ఒక బాబు పుట్టిన తరువాత బాగా లావుగా తయారవడం తో ఇక పాప పుట్టినపుడు డయాబేటిస్ రావడం తో సర్జరీ సహాయంతో సన్నగా మారినట్లు తెలిపారు శ్రీవిద్య.

పిల్లలంటే చాలా ఇష్టం ఉండటం ముగ్గురు పిల్లలు కావాలని అనుకున్నారట. అయితే కరోనా సమయంలో పుట్టిన పాప పుట్టగానే నాలుగు నిమిషాలకు మరణిండంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను అంటూ చెప్పారు శ్రీవిధ్య. ఇక తన భర్త తనకు ప్రతి విషయంలో ఎంతోమంది సపోర్ట్ ఇస్తారంటూ చెప్పిన శ్రీవిధ్య మళ్ళీ టీవీ రంగంలోకి వస్తానంటూ చెప్పారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Jani Master: జానీ మాస్టర్ కు బెయిల్ రద్దు…అదే ప్రధాన కారణమా?

Published

on

Jani Master: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు టైం చాలా బాడ్ గా నడుస్తుందని చెప్పాలి. ఈయన కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ ఈయన పట్ల లైంగిక ఆరోపణల కేసు నమోదు కావడంతో జైలు పాలు అయ్యారు. ఇక నేషనల్ అవార్డుకు ఎంపికైన జానీ మాస్టర్ అవార్డు అందుకోవడం కోసం బెయిల్ ఇవ్వాలని కోర్టులో తన భార్య పిటీషన్ ఇచ్చారు..

Advertisement

మరి కాసేపట్లో ఈయన జైలు నుంచి బయటకు వస్తారన్న నేపథ్యంలో నేషనల్ అవార్డు కమిటీ తనపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో అవార్డును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈయన బెయిల్ కూడా రద్దు అయ్యింది.మళ్ళీ వెంటనే బెయిల్ కోసం మరోసారి అప్పీల్ చేయగా కేసు విచారణలో ఉన్న దృష్ట్యా బెయిల్ ఇవ్వలేమని కోర్టు బెయిల్ పిటిషన్ ని కొట్టివేసింది.

ఈయనపై లైంగిక ఆరోపణలు అలాగే అత్యాచార కేసులు నమోదు కావడంతో బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించిందని తెలుస్తోంది. మరోవైపు ఈయనకు బెయిల్ రాకపోవడమే కాకుండా తన తల్లి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే. ఈమెకు గుండెపోటు రావడంతో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు.

బెయిల్ రద్దు..
ఇలా జానీ మాస్టర్ కు వ్యక్తిగతంగా అలాగే వృత్తిపరమైన విషయాలలో వరుసగా ఎదురు దెబ్బలు తగలడంతో అభిమానులు కూడా కంగారు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కేసు జానీ మాస్టర్ కెరియర్ పై కూడా కోలుకోలేని దెబ్బ కొట్టిందని చెప్పాలి. ప్రస్తుతం బెయిల్ పిటీషన్ కొట్టి వేసిన కోర్ట్ ఈయనకు ఎప్పుడు బెయిల్ మంజూరు చేస్తుందో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Adimulam: సూపర్ గా ఉన్నావు… మరో మహిళతో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం!

Published

on

Adimulam:సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఇటీవల వివాదాలకు కేరాఫ్ గా మారారని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం ఆయన తిరుపతిలో ఒక లాడ్జ్ లో తనపై అత్యాచారం చేశారు అంటూ ఓ బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇలా మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన విషయంలో ఈయన పెద్ద ఎత్తున వార్తలలో నిలిచారు.

Advertisement

ఇలా ఈ ఘటన మర్చిపోకముందే ఈయనకు సంబంధించి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదిమూలం వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు లేదని ఈయన మరో మహిళతో అసభ్యకరంగా ఫోన్ కాల్ మాట్లాడుతున్నటువంటి ఆడియో లీక్ అవ్వడంతో మరోసారి వార్తలలో నిలిచారు.

ఈ వీడియోలో ఆదిమూలం మహిళతో.. నువ్వు అందంగా ఉన్నావు.. పర్సనాలీటీ బాగా పెరిగిపోయింది. కలర్ గా బాగా పెరిగింది.. అప్పటికి ఇప్పటికి బ్యూటీఫుల్ గా అయిపోయావ్.. అంటూ మాట్లాడారు. అద్భుతంగా తయారైపోయావ్.అలా చేస్తే బాడీ అంతా రిలాక్స్ గా హ్యాపీగా ఉంటుందని.. నీకు ఏం తెలుసని.. బూతులు మాట్లాడారు. ఈ ఆడియో కాల్ ప్రస్తుతం సొషల్ మీడియాలో రచ్చగా మారింది.
తలలు పట్టుకుంటున్న నేతలు..
ఇలా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వీడియోలు వరుసగా బయటకు రావడంతో ఇతర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తలలు పట్టుకున్నారు. మరోవైపు వైకాపా నాయకులు ఈ వీడియోని వైరల్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. మరి ఈయన వ్యవహార శైలిపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

https://x.com/UttarandhraNow/status/1845730879186059365?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1845730879186059365%7Ctwgr%5Ef3a4317003765b74a967c68a526fc063c052e84d%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fm.dailyhunt.in%2Fnews%2Findia%2Ftelugu%2Fzeenewstelugu-epaper-dh9cfa441265e44dc6946fe7674729ec1c%2Fadimulamsupargaunnavmaromahilatorechhipoyinaaadimulanaadiyovairal-newsid-n634969815

Advertisement
Continue Reading

Featured

Elections 2024: ఈవీఎం ఎన్నికలు అయితే పోటీ చేయను.. వైకాపా మాజీ ఎమ్మెల్యే కామెంట్స్!

Published

on

Elections 2024: ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల విషయంలో ఎన్నో గందరగోల పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత వైసిపి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఏదో తప్పు జరిగిందని ఎంతోమంది సందేహాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈవీఎం ట్యాంపర్ అయ్యాయి అంటూ కూడా పలువురు సందేహాలు వ్యక్తం చేస్తూ కేసులు నమోదు చేశారు.

Advertisement

ఇకపోతే వచ్చే ఎన్నికలలో కూడా ఈవీఎం ద్వారా ఎన్నికలు జరిగితే తాము ఎన్నికలలో పోటీ చేయమని పలువురు వైకాపా మాజీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తాజాగా వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ ఈ విషయం గురించి మాట్లాడుతూ సంచలన స్టేట్మెంట్ అందించారు.

2024 లో జరగబోయే ఎన్నికలలో కూడా ఈవీఎం ద్వారానే ఎన్నికలు జరిగితే తాను ఎన్నికలలో పోటీ చేయనని ఈయన తెలిపారు. ఈవీఎం ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే చంద్రబాబు అండ్ బ్యాచ్ మరోసారి మోసానికి పాల్పడుతుందని అలాంటప్పుడు పోటీ చేసిన ప్రయోజనం ఉండదని రాచమల్లు తెలిపారు.

ఈవీఎం ట్యాంపరింగ్..
ఇటీవల మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అంటూ పలు ప్రాంతాలలో పోలైన ఓట్ల అసమానతులను చూపిస్తూ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో కూడా ఈవీఎంలను ఉపయోగిస్తే మరోసారి మోసమే జరుగుతుందని ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!