Analyst Damu Balaji : తెలంగాణ కాబోయే సీఎం రేవంత్ రెడ్డి బయోగ్రఫీ.. ప్రేమ, పెళ్లి.. రేవంత్ రెడ్డి నుండి రేవంతన్న వరకు ఆయన ప్రస్థానం…: అనలిస్ట్ దాము బాలజీ
Analyst Damu Balaji : తెలంగాణ ఎన్నికలు ముగిసాయి… గెలుస్తామన్న ధీమాతో ముందస్తుకు వెళ్లిన కెసిఆర్ తెలంగాణ ప్రజల ఆలోచనలను అంచనా వేయడంలో విఫలమయ్యారు. తెలంగాణ ఏర్పడిన పదేళ్లకు ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రాగా సీఎం రేస్ లో అందరి నోటా వినిపిస్తున్న పేరు రేవంత్ రెడ్డి. నిజానికి ఎన్నికలకు మూడు నెల్లముందు కూడా బిఆర్ఎస్, రెండో స్థానంలో బీజేపీ ఉండగా మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఏకంగా గెలవడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి. ఒంటి చేత్తో కాంగ్రెస్ ను గెలిపించిన రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కాబోతున్న తరుణం ఆయన జీవితం, సీఎంగా ఆయన ఎదిగిన తీరు అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.
Advertisement
విద్యార్ధి రాజకీయాల నుండి నేడు సీఎం పదవి వరకు…
1969 లో మహబూబ్ నగర్ కొండారెడ్డి గ్రామంలో జన్మించిన అనుముల రేవంత్ రెడ్డి గారు విద్యార్థి దశలోనే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఏబివిపి విద్యార్థి సంఘంలో ఉన్న ఆయన ఆర్ఎస్ఎస్ లో కూడా ఉన్నారు. అయితే చదువుయ్యాక అందరూ బీజేపీ పార్టీ వైపు వెళ్తారనుకుంటే ఎన్టీఆర్ మీద అభిమానము, అలాగే చంద్రబాబు మీద అభిమానంతో 2005లో ఆయన టీడీపీ పార్టీలోకి చేరి అధిష్టానం వద్దని చెప్పినా మేడ్చల్ మండలం జెడ్పిటిసి మెంబెర్ గా గెలిచారు. ఆపైన 2009 ఎమ్మెల్సిగా గెలుపొందిన ఆయన టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు కి ప్రియ శిష్యుడిగా మారాడు. కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన తెలంగాణ విడిపోయాక 2017లో కాంగ్రెస్ చేరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ముగ్గురిలో ఒక్కడిగా ఎన్నికయ్యడు.
2018 లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆయన మల్కాజిగిరి నుండి ఎంపి గా గెలిచారు. ఇక తాజాగా తెలంగాణ ఎన్నికలలో ఆయన గెలవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించారు. ఇక ఆయన వ్యక్తిగత జీవితం గురించి బాలాజీ మాట్లాడుతూ ఆయన ఇంటర్ చదివే సమయంలోనే గీత అనే అమ్మాయిని ప్రేమించగా ఆమె కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైపాల్ రెడ్డి గారి తమ్ముడి కూతురు కాగా డిగ్రీ చదివే సమయంలో వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసి గీతను ఢిల్లీలో చదివించారు. అయితే రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా జైపాల్ రెడ్డి గారి వద్దకే వెళ్లి తమ ప్రేమ వ్యవహారం చెప్పడంతో ఆయన ముక్కుసూటి తనం, ధైర్యం నచ్చి రాజకీయాల్లో ఖచ్చితంగా రానిస్తాడనే నమ్మకం కలిగి తమ్ముడికి చెప్పి పెళ్లి చేసారు. అలా రేవంత్ రెడ్డి గారు కష్టపడి తన లవ్ లైఫ్ అలాగే పొలిటికల్ లైఫ్ లోనూ సక్సెస్ అయ్యారు. ఇక ఆయన ఓటుకు నోటు కేసు సమయములో చంద్రబాబు పేరు చెబితే ఆయన సేఫ్ అవుతాడని తెలిసినా నిబద్దతతో వ్యవహరించి చంద్రబాబు ప్రియ శిష్యుడిగా మరోసారి రుజువు చేసుకున్నాడు. నిజానికి ఓటుకి నోటు కేసు ద్వారానే రేవంత్ కి మరింత ప్రాచుర్యం లభించింది అనడంలో సందేహం లేదు. తెలంగాణ రాజకీయనాయకులలో కెసిఆర్ ను ధైర్యంగా తన మాటలతో ఢీ కొట్టగల నాయకుడు రేవంత్ మాత్రమే. ఇక ఆయన స్పీచ్ లతో తెలంగాణ సమాజంలో రేవంత్ రెడ్డి కాస్తా రేవంతన్నగా ఆదరణ చూరగున్నారు అంటూ బాలాజీ రేవంత్ రెడ్డి గారి జీవితం గురించి వివరించారు.
Samantha: సినీ నటి సమంత ఇటీవల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈమె తన రాజకీయాలలో భాగంగా సమంత అక్కినేని కుటుంబం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా కొండ సురేఖ వార్తలలో నిలవడమే కాకుండా నాగార్జున ఈమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.
Advertisement
ఈ విధంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సమంతతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం స్పందిస్తూ ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక అప్పట్లో సమంత ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. తాజాగా మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ.. సౌత్ సినీ ఇండస్ట్రీ అండగా నిలిచి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇండస్ట్రీ ప్రజలు చూపించిన ఈ ప్రేమే నన్ను ఈ వివాదం నుంచి బయటపడేలా చేసింది. లేకుంటే మరింత కృంగిపోయే దానిని. అందరి సపోర్ట్ వల్లే తిరిగి మీ ముందు కూర్చున్నాను అంటూ ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇండస్ట్రీ సపోర్ట్.. కొండా సురేఖ సమంత గురించి తప్పుగా మాట్లాడటమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ గురించి సంచలన ఆరోపణలు చేశారు. సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ ఈమె వారి గురించి మాట్లాడటంతో అప్పట్లో తెలంగాణ రాజకీయాలలోనూ,సినీ ఇండస్ట్రీలోనూ ఈ విషయం సంచలనంగా మారింది.
Samantha: సినీ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత తన వ్యక్తిగత కారణాలు అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లకు కమిట్ అయ్యారు.
Advertisement
ఇక సమంత వ్యక్తిగత విషయానికి వస్తే నటుడు నాగచైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం పాటు కొనసాగ లేకపోయారు. సమంత నాగచైతన్య ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను చూపించుకునేవారు. అయితే వీరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.
ఇలా విడాకులు తీసుకున్న తర్వాత సమంత నాగచైతన్యకు సంబంధించిన జ్ఞాపకాలు అన్నిటిని కూడా చెరిపివేసింది. ఇలా తాను ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని వెనక్కి పంపియడమే కాకుండా తన మెడలో తాళిని కూడా వెనక్కి తిరిగి ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలన్నింటినీ కూడా కాల్చేసిన సమంత ఒకే ఒక గిఫ్ట్ మాత్రం భద్రంగా పెట్టుకున్నారని తెలుస్తుంది. పెళ్లి ఫోటో.. మరి సమంత భద్రంగా దాచుకున్న ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే.. నాగచైతన్య సమంత పెళ్లిలో దిగిన ఫోటోని భద్రంగా దాచి ఉంచారని తెలుస్తోంది. తన పెళ్లిలో తన తల్లిదండ్రులతో పాటు నాగచైతన్య సమంత కలిసి దిగిన ఫోటో అంటే తనకు చాలా ఇష్టమని గతంలో పలు సందర్భాలలో సమంత తెలిపారు. ఆ ఫోటోని మాత్రం అలాగే భద్రంగా ఉంచుకున్నారని తెలుస్తోంది.
Bahubali 3: ప్రభాస్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ హీరోగా బాహుబలి సినిమా గుర్తింపు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు.
Advertisement
ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే త్వరలోనే బాహుబలి త్రీ కూడా రాబోతోంది అంటూ తాజాగా నిర్మాత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో బాహుబలి 3 గురించి ప్రభాస్ రాజమౌళి మాట్లాడిన ఇప్పుడే అలాంటి ఆలోచనలేమీ లేవని తెలిపారు.
ఇకపోతే తాజాగా కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల బాహుబలి నిర్మాతలతో కలిసి మాట్లాడానని అయితే వారు బాహుబలి 3 కూడా ఉండబోతోందని తెలిపారంటూ జ్ఞానవేల్ రాజా వెల్లడించారు.
బాహుబలి 3.. ఇలా బాహుబలి నిర్మాతలు పార్ట్ 3 కూడా ఉండబోతుందని చెప్పారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రభాస్ ఈ సినిమా చేసిన ఇప్పట్లో రాదని తెలుస్తుంది. ఇప్పటికే ఈయన సుమారు ఐదు పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి వరుస షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాతనే బాహుబలి త్రీ గురించి ఆలోచిస్తారని అభిమానులు చర్చలు జరుపుకుంటున్నారు.