Connect with us

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement

Featured

YS Jagan Mohan Reddy: జగన్ తిరుమలకు వస్తే ప్రభుత్వానికి ఎందుకంత భయం… ఫైర్ అయిన మాజీ టీటీడీ చైర్మన్!

Published

on

YS Jagan Mohan Reddy: తిరుమల లడ్డు విషయంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయామంలో తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్న తరుణంలో నిజానిజాలు బయట పెట్టాలి అంటూ వైకాపా నాయకులు మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వానికి చాలెంజ్ విసురుతున్నారు. ఇలా ఎంతోమందికి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీవారి ప్రసాద విషయంలో తప్పుడు ఆరోపణలు చేసి అపచారం చేశారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకోబోతున్నారు.

Advertisement

ఈరోజు సాయంత్రం తిరుమల చేరుకున్న ఆయన రేపు ఉదయం స్వామివారిని దర్శించుకోబోతున్నారు ఈ క్రమంలోనే తిరుపతి మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే కొంతమంది వైకాపా నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అలాగే పలు ప్రాంతాలలో వైకాపా కార్యకర్తలను నాయకులను పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తుంటే కూటమి ప్రభుత్వానికి ఎందుకు అంత భయం అని ఆయన ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. స్వామి వారిని దర్శించడం కోసం ఎవరైనా ఎప్పుడైనా రావచ్చని అడ్డుకునే హక్కు వారికి లేదని తెలిపారు.చంద్రబాబు పాశవిక విధానాలను తాము ఎన్నటికీ వ్యతిరేకిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. వెయ్యి నాలుకల ధోరణిని సీఎం చంద్రబాబు మానుకోవాలని తెలిపారు.

ఇక పవన్ హైందవ ధ్వజ స్తంభం మాదిరిగా ఫీల్ అవుతున్నాడని దుయ్యబట్టారు. మరో పార్టీ బీజేపీ హిందువులంటే తామే అన్నట్లుగా ఆ పార్టీ కార్యకర్తలు భ్రమలో ఉన్నారని ఆరోపించారు. ఇక జగన్మోహన్ రెడ్డి తిరుమల కొండపైకి వెళ్లాలి అంటే డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై కూడా భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.

Advertisement

డిక్లరేషన్ అడిగే హక్కు లేదు..
జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్వయంగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఇక ఆయనను డిక్లరేషన్ అడిగితే ఈ కూటమి ప్రభుత్వానికి పతనం ఖాయమని అన్నారు. జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వకపోతే.. దర్శనానికి అనుమతి లేదనే హక్కు టీటీడీకి కూడా లేదని తెలిపారు. డిక్లరేషన్‌ వెనుక రాజకీయ కుట్ర ఉందని.. ప్రభుత్వం ఎంత నిర్బంధిస్తే అంత పైకి లేస్తామని భూమన అన్నారు.

Advertisement
Continue Reading

Featured

Savitri: మహానటి సావిత్రి మెడలో పూలమాల వేలం వేస్తే అంత ధర పలికిందా… మాములు క్రేజ్ కాదుగా?

Published

on

Savitri: సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో మహానటి సావిత్రి గారు ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన గుర్తింపు పొందిన ఈమె చివరి క్షణంలో మాత్రం ఎంతో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొని మరణించారు. ఇక సావిత్రి బ్రతికిన నినాదం ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపారని చెప్పాలి.

Advertisement

ఇక ఈమె సినిమాల పరంగా మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా సంపాదించినది మొత్తం దాన ధర్మాలకే ఖర్చు చేశారు. ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చిందని తన వద్దకు వస్తే చాలు తనకు తోచిన సహాయం చేసేవారు. ఇలా దాన గుణంలో సావిత్రికి మించిన వారు ఎవరు లేరని చెప్పాలి. ఇక అప్పట్లో ఈమెను అభిమానించే వారి సంఖ్య కూడా అధికంగానే ఉండేది.

ఇకపోతే సావిత్రి గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని సీనియర్ నటి జమున ఓ సందర్భంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఓసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విపత్తు నిథికి సినిమా వాళ్ల నుంచి విరాళాలు సేకరిస్తున్నారట. అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ నరసింహారావు గారు ఉన్నారు. అయితే ఆయన సావిత్రి గారి కోసం ఒక పూలమాలను తీసుకువచ్చినట్టు జమున తెలిపారు.

30 వేలు…
ఇలా సావిత్రి మెడలో వేసిన ఆ పూల దండను వేలం వేయగా అప్పట్లో ఆ పూలదండ 30000 ల ధర పలికిందని తెలుస్తుంది. అప్పట్లో 30 వేల రూపాయలు అంటే ఇప్పుడు 30 లక్షలతో సమానమని చెప్పొచ్చు. ఒక పూలదండ 30000 వేలంలో పోవడం అంటే సావిత్రి గారికి ఎలాంటి క్రేజ్ ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Madhavi Latha: అప్పుడు మాట్లాడకుండా ఏం చేస్తున్నారు రాజా.. ప్రకాష్ రాజ్ పై ఫైర్ అయిన మాధవీ లత!

Published

on

Madhavi Latha: సినీ నటుడు ప్రకాష్ రాజ్ ప్రస్తుతం తిరుపతి లడ్డు వ్యవహారం పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతి లడ్డు తయారీలో గత ప్రభుత్వం కల్తీ చేస్తుందని జంతువుల కొవ్వు నుంచి తయారుచేసిన నూనె ఉపయోగించారంటే ఆరోపణలు చేయడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. అయితే ఈ విషయంపై నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తరచు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేస్తున్న పోస్టుల హాట్ టాపిక్ గా మారాయి.

Advertisement

ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ చేస్తున్న ఈ వ్యాఖ్యలపై సినీ నటి మాధవి లత స్పందించారు.వేరే మతం వారిని ఒక్క మాట అంటేనే నానా హంగామా చేస్తారు. మొన్న బెంగుళూర్ లో ఆంజనేయస్వామి కీర్తనాలు వింటున్న వాళ్ళను వేరే మతం వాళ్ళు వచ్చి కొడితే అలాంటి వారి పట్ల ఏం మాట్లాడరు అప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటూ ఈమె ప్రశ్నించారు.

హిందూ మనోభావాలను గౌరవించి..
ఇక లడ్డు విషయంలో హీరో కార్తీ తన ప్రమేయం లేకున్నా.. హిందువుల మనోభావాలను గౌరవించి వారు క్షమాపణలు చెప్పారు. ఇందులో ఆనందం ఏముంది? తప్పు చెప్పడం వల్ల ఎవరకి ఆనందం రాదు. ఇలా క్షమాపణ చెప్పడం వల్ల భవిష్యత్తులో ఇలాంటి విషయాలపై కామెంట్స్ చేయరాదనే సదుద్దేశ్యంతో వారు క్షమాపణలు చెప్పారని ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ చేస్తున్నటువంటి పోస్టులను తప్పుపడుతూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!