Bigg Boss: బిగ్ బాస్ షో తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సక్సెస్ఫుల్గా ప్రసారం అవుతూ సీజన్ల మీద సీజన్లు పూర్తి చేసుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటివరకు బిగ్ బాస్ షో కన్నడలో ప్రారంభమై 11 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఇక ప్రారంభం నుంచి బిగ్బాస్కి కిచ్చా సుదీప్ నే హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ప్రతి సంవత్సరం కొత్త కంటెస్టెంట్లు వస్తున్నారు, పోతున్నారు కానీ హోస్ట్ గా సుదీప్ ప్లేస్ మాత్రం మారలేదు. కన్నడలో బిగ్ బాస్ అంటే సుదీప్. సుదీప్ అంటే బిగ్బాస్ అని అక్కడి ప్రేక్షకులు అభిప్రాయపడుతుంటారు.
Advertisement
ఈ నేపథ్యంలో వచ్చే సీజన్ నుంచి బిగ్ బాస్ హోస్ట్ చేయనని సుదీప్ అధికారికంగా ప్రకటించాడు. ఈ సంచలన ప్రకటనకు ఆయన సొంత కారణాలు ఉన్నాయట. అయితే కొందరు సుదీప్ ప్రకటనకు వేరే అర్థం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు సుదీప్ మళ్లీ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. కిచ్చా సుదీప్ను కలర్స్ ఛానెల్, బిగ్ బాస్ నిర్వాహకులు అవమానించారని అందుకే అతను ఈ నిర్ణయం తీసుకున్నాడని కొందరు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ మేరకు ఆ విషయంపై ఆయన స్పందిస్తూ.. నా ట్వీట్ని చూసి, దానిని గౌరవిస్తూ వచ్చిన ప్రేమ, మద్దతును తెలియజేసిన వారందరికీ ధన్యవాదాలు. ఇది నిజంగా నాకు స్ఫూర్తినిస్తుంది. నన్ను గౌరవంగా చూస్తారు..
ఈ ప్రేమను, గౌరవాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. అయితే నాకు, కలర్స్ ఛానెల్ కు మధ్ విభేదాలు వచ్చాయని, ఆ ఛానెల్ నన్ను అగౌరవపరిచిందంటూ ప్రచారం చేసే వ్యక్తులకు నేను ఒక్కమాట చెప్పాలి అనుకుంటున్నాను. కలర్స్ ఛానెల్ తో నాది సుదీర్ఘమైన ప్రయాణం. బిగ్ బాస్ నుంచి ఎందుకు తప్పుకుంటున్నానో నా ట్వీట్ లో స్పష్టంగా, సూటిగా ఉంది. కలర్స్ ఛానెల్ తో నా సంబంధం చాలా బాగుంది. వారు ఎల్లప్పుడూ నన్ను గౌరవంగా చూస్తారు. అలాగే వారి పట్ల నాకెంతో గౌరవం ఉంది. మా మధ్య విభేదాలు ఉన్నాయన్నది వట్టి అపోహ మాత్రమే. నేను పనిచేస్తున్న టీమ్ పై లేనిపోని ఆరోపణలు ఎదురవుతున్నప్పుడు చూస్తూ ఊరుకుని ఆనందించే వ్యక్తిని మాత్రం కాదు అని సుదీప్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Aara Mastan: ఇటీవల హర్యానాలో జరిగిన ఎన్నికల ఫలితాలు ఎవరు ఊహించని విధంగా వచ్చాయి. కాంగ్రెస్ గెలుస్తుందని అందరూ భావించినప్పటికీ చివరికి బిజెపి హర్యానాలో విజయకేతనం ఎగరవేసింది. అయితే తాజాగా హర్యానా ఎన్నికల ఫలితాలపై ఆరా మస్తాన్ చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి.
Advertisement
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆరా మస్తాన్ ఈవీఎంల ట్యాంపరింగ్ చేయడం కుదురుతుందని, అందుకే ఊహించిన ఫలితాలు రాకుండా వేరే ఫలితాలు వస్తున్నాయని తెలిపారు.తను వైసీపీ గెలుస్తుందని సర్వే చేసే తెలిపామని అది అబద్ధం అయ్యిందని దానికి కారణం ఈవీఎం టాంపరింగ్ అని అన్నారు. హర్యానాలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సమయంలో కాంగ్రెస్ ఆధిపత్యం చెలాయించింది. అదే ఈవీఎం కౌంటింగ్ సమయంలో బిజెపి ముందంజలోకి వచ్చింది.
దీన్ని బట్టి మనం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని అర్థం చేసుకోవచ్చని ఆరా మస్తాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా ఇక్కడ గెలుస్తామనే నియోజకవర్గాలలో కాకుండా వేరే నియోజకవర్గాలలో ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలుస్తున్నారని ఆరా మస్తాన్ ఆరోపించారు.
ఈవీఎంలు ట్యాంపరింగ్ .
Advertisement
ఒకప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి చంద్రబాబు ఏ మాట్లాడాలని కానీ ఇప్పుడు మాత్రం ఆయన గప్చుప్ గా ఉన్నారని దీన్ని బట్టి ప్రజలు ఒకటే అర్థం చేసుకోవాలని ఆయన తెలిపారు.ఇప్పుడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
AP Government: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల హామీలలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామంటూ హామీలు ఇచ్చారు. ఇకపోతే మహిళలకు ఉచిత బస్సు వారికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చారు.
Advertisement
ఇలా అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్న కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి పథకాలను అమలు చేయడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి అయితే ఈ దీపావళి పండుగకు మహిళలకు బంపర్ ఆఫర్ ఇస్తూ రెండు పథకాలను అమలులోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో పాటు గ్యాస్ సిలిండర్ల పంపిణీ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ దీపావళి పండుగను పురస్కరించుకొని ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అలాగే ఫ్రీ బస్సు ప్రయాణాన్ని కూడా తెలియజేయడంతో మహిళలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అమ్మ ఒడి ప్రతినెలా ప్రతి 18 సంవత్సరాలు దాటిన మహిళలకు 1500 ఇస్తున్నట్లు కూడా ఎన్నికల హామీలలో చెప్పారు కానీ ఇప్పటివరకు వీటిని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయకపోవడంతో విమర్శలను ఎదుర్కొంటున్నారు.
ఫ్రీ బస్ సౌకర్యం.. ఆగస్టు 15వ తేదీన ఫ్రీ బస్సు సౌకర్యం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అప్పట్లో తెలిపారు. అయితే ఈసారి మాత్రం దీపావళికి ఉంటుందని పలువురు ఎమ్మెల్యేలు వెల్లడించారు కానీ ఇంకా ఎలాంటి అధికారిక ఉత్తర్వులు మాత్రం వెల్లడించకపోవడంతో పలువురు నిన్ను నమ్మం బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
MS Narayana: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు ఎంఎస్ నారాయణ ఒకరు. ఈయన తన అద్భుతమైన కామెడీ ద్వారా ప్రేక్షకులను మెప్పించారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 17 సంవత్సరాలలోనే సుమారు 700కు పైగా సినిమాలలో నటించి రికార్డు సాధించారు.
Advertisement
ఇలా తాగుబోతు క్యారెక్టర్ లోను అలాగే ఎమోషనల్ సన్నివేశాలలో కూడా అందరిని ఆకట్టుకునే విధంగా తన నటనతో మెప్పించిన ఎమ్మెస్ నారాయణ గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ తనకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు .ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఎమ్మెస్ నారాయణ తోబుట్టువులు పదిమంది అని తెలిపారు. ఏడుగురు అబ్బాయిలు కాగా ముగ్గురు అమ్మాయిలని ఈయన ఒక సందర్భంలో తెలిపారు. అయితే తన చిన్న చెల్లెలు పెళ్లి జరిగిన కొద్దీ రోజులకి మరణించారని ఆ విషయం తనని ఎంతగానో బాధపెట్టిన సంఘటన అంటూ తెలిపారు.
నేను సినిమాలలోకి రాకముందు ఒక స్కూల్ టీచర్ గా పని చేసే వాడిని అప్పట్లో చాలీచాలని జీతం వచ్చేది. తద్వారా కుటుంబ పోషణ ఎంతో భారంగా ఉండేదని ఎమ్మెస్ నారాయణ తెలిపారు. ఇలా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తరుణంలో తన చెల్లెళ్లకు కూడా పెద్దగా ఏమి పెట్టుకోలేకపోయానని తెలిపారు.
Advertisement
స్కూల్ టీచర్.. ఇలా తాను ఇండస్ట్రీలోకి రాకముందు స్కూల్లో టీచర్ గా పని చేసే వారని వెల్లడించారు. అయితే ఈయన చాలా సినిమాలలో కూడా లెక్చరర్ పాత్రలను ప్రిన్సిపల్ పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు.