Featured
CM KCR : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దడ పుట్టిస్తున్న కేసీఆర్ కామెంట్స్.. ఇంతకీ దళితబంధు రాబందులెవరు..!?
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/b47207310a52539c58088e13bb1e056c.jpg?ver=1719738860)
Published
1 year agoon
CM KCR : సీఎం కేసీఆర్.. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్లో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఏం మీ ఇంటి సొమ్ము అనుకున్నారా? సర్కార్ ఇచ్చే దళిత బంధు పథకానికి మూడు లక్షల కమీషన్ అడుగుతున్నారట.. ఏంటి కథ? అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీలో సైతం ఇంతకీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు కొందరు నేతలకు దడ పుడుతోంది. అసలు కేసీఆర్ ఏమన్నారు? ఆ వ్యాఖ్యలు రాష్ట్రంలో ఎందుకు సంచలనంగా మారాయి? కొందరు నేతలకు ఎందుకు దడపుడుతోంది? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇంతకీ దళితబంధు రాబందులెవరు? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..
దళిత బంధు రాబందుల లిస్ట్ ఇదేనంటూ పోస్టులు..!
‘‘దళిత బంధు స్కీమ్లో వసూళ్లకు పాల్పడ్డ ఎమ్మెలేలకు ఇదే నా చివరి వార్నింగ్. కొందరు ఎమ్మెల్యేలు రూ.3 లక్షల వరకూ వసూల్ చేశారు. ఆ ఎమ్మెల్యేల చిట్టా అంతా నా దగ్గర ఉంది. మళ్లీ వసూళ్లకు పాల్పడితే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కదు. దానితో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం. మీ అనుచరులు దళిత బంధు స్కీ్మ్ తీసుకున్నా మీదే బాధ్యత’’ కేసీఆర్ వసూళ్ల చిట్టా తన దగ్గర ఉందని చెప్పడంతో దళిత బంధు స్కీమ్లో వసూళ్లకు పాల్పడ్డ ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది. అని సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్లో ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఇది తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో దళిత బంధు రాబందుల లిస్ట్ ఇదేనంటూ పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఇక పలు జిల్లాల్లో దళిత బంధు రాబందుల పేర్లతో సహా లిస్ట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఆయా నేతలంతా ఎమ్మెల్యేలంతా తీవ్ర స్థాయిలో భయాందోళనకు గురవుతున్నారట. ఇప్పటికే పలువురు స్థానిక నేతలు దళితబంధు వసూళ్ల గురించి ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అది చాలదన్నట్టు ఏకంగా సీఎం కేసీఆరే వ్యాఖ్యలు చేయడంతో దళితబంధు రాబందులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
రోడ్డెక్కి మరీ దళితుల నిరసన..
అయితే ఈ వ్యాఖ్యలు సీఎం కేసీఆర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రెండు నియోజకవర్గాల నాయకులను ఉద్దేశించి కేసీఆర్ అన్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా జిల్లాలోని ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాల నేతలకు సీఎం ఆ వార్నింగ్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. ముథోల్, బోథ్, ఖానాపూర్లో కమీషన్ల వ్యవహారాలు ఎమ్మెల్యేలకు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయట. బోథ్లో కమీషన్లతో ఖరీదైన వాహనాలు కూడా కొనుక్కున్నారంటూ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలతో కొందరు నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. ఇక ముథోల్లో అయితే ఏకంగా ఎమ్మెల్యే అనుచరుల తీరుపై ఆమధ్య రోడ్డెక్కి మరీ దళితులు నిరసన తెలిపారు. ఒకటి రెండు చోట్ల ఎమ్మెల్యేను సైతం నిలదీశారు. ఇవన్నీ ఒక్కఎత్తైతే ఇప్పుడు సీఎం వ్యాఖ్యలు తీవ్ర చర్చకు వస్తున్నాయట. సీఎం దగ్గరున్న చిట్టాలో తమ పేర్లు ఉన్నాయో, లేదోనని తెలుసుకునే పనిలో ఎమ్మెల్యేలు ఉన్నారని కొందరు అధికార పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.
సీఎం లిస్ట్ను ముందు పెట్టి మరీ..
ఆసక్తికర విషయం ఏంటంటే.. దళిత బంధు పథకం విషయంలో లబ్ధిదారులకు నేతలు రూల్స్ పెడుతున్నారట. దీని ప్రకారం.. లబ్ధిదారులు అడ్వాన్స్గా కొంత.. పథకం వచ్చాక మిగతాది ఇవ్వాలంటూ రూల్ పెట్టారట. మొత్తమ్మీద ఈ పథకం కింద రూ.3 లక్షలు వసూలు చేస్తున్నారట. ఇక కొన్ని నియోజకవర్గాల్లో అయితే చోటా మోటా నేతలు వసూలు చేస్తే విషయం లీక్ అవుతుందని ఏకంగా ఒక టీంను ఏర్పాటు చేసుకుని మరీ దందాను నడిపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సర్వే నేపథ్యంలో ఈ విషయాలన్నీ సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లాయట. అందుకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. ఇంకా కొనసాగిస్తే మాత్రం ఈసారి సీఎం లిస్ట్ను ముందు పెట్టి మరీ వాయిస్తారని ఎమ్మెల్యేలు భయపడుతున్నారట. దీంతో తమ అనుచరులకు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారట. అసలే ఎన్నికల టైం.. అటు ఇటు అయితే టికెట్ కూడా రాదు.. కాబట్టి ఇక మీదట కమీషన్లు, దందాలు ఆపండి అంటూ కొందరు ఎమ్మెల్యులు అనుచరులకు గట్టిగానే చెబుతున్నారని టాక్. మరికొందరైతే అనుచరులకు పిలిచి క్లాస్ పీకుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక కొందరైతే తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేయాలని భావిస్తున్నట్టు టాక్. మొత్తమ్మీద కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్ దళితబంధు రాబందులకు దడ పుట్టిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
You may like
Featured
Kakli: కల్కి సినిమాకు ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్ కదా.. ఆ హీరో సజెస్ట్ చేస్తేనే ప్రభాస్ వరకు వచ్చిందా?
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1719738859)
Published
2 hours agoon
3 July 2024By
lakshanaKakli: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి. ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ వారు ఏకంగా 600 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది. ఇక ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్రభాస్ భైరవ పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.
నిజానికి ఈ సినిమాలో ముందుగా ప్రభాస్ ను అనుకోలేదట డైరెక్టర్ అయితే ఒక స్టార్ హీరో ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతోనే ప్రభాస్ వరకు వచ్చిందని తెలుస్తుంది. ఈ సినిమా కథ మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి ఈ సినిమా కథను వివరించారట ఈ సినిమా కథ విన్న చిరంజీవి సినిమా చాలా అద్భుతంగా ఉంది కచ్చితంగా సక్సెస్ అవుతుందని తెలియజేశారట.
చిరు రిజెక్ట్ చేశారా..
ఇలా తనకు కథ చెప్పిన తర్వాత ఇందులో భైరవ పాత్రలో మీరు నటించాలని కోరుకుంటున్నాను అని చెప్పడంతో వెంటనే చిరంజీవి ఈ సినిమాలో భైరవ పాత్రలో నేను నటిస్తే ఆ పాత్రకు పూర్తిగా న్యాయం జరగదు. ఈ పాత్రకు ప్రభాస్ సరిగ్గా సరిపోతారని ఆయనే ప్రభాస్ పేరును సజెస్ట్ చేశారని తెలుస్తోంది. ఇలా చిరంజీవి కాదంటేనే కల్కి సినిమా కథ ప్రభాస్ వరకు వచ్చిందని, చిరు కారణంగానే ప్రభాస్ మరో హిట్ సినిమాని అందుకున్నారని తెలుస్తోంది.
Featured
NTR: చిరంజీవి ఇచ్చిన అవార్డును ఆ హీరో ఇంటికి పంపిన తారక్.. ఏమైందంటే?
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1719738859)
Published
3 hours agoon
3 July 2024By
lakshanaNTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు ఎన్టీఆర్. ఈయన బాల నటుడి గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి చిన్న వయసులోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న తారక్ గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమా ఎలాంటి సక్సెస్ అయ్యిందో మనకు తెలిసిందే .ఈ సినిమాకు గాను ఈయనకు స్టార్ మా అవార్డు అందుకున్నారు అయితే ఈ అవార్డు ప్రముఖ నటుడు చిరంజీవి నాగార్జున చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. అయితే ఈ అవార్డును తీసుకున్న తారక్ ఇంట్లో పెట్టుకోకుండా వేరే హీరోకి పంపించారని తెలుస్తోంది.
ఇలా స్టార్ హీరో చిరంజీవి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకున్నటువంటి ఈయన వేదికపై మాట్లాడుతూ తాను చిన్నప్పటినుంచి చిరంజీవి గారు నాగార్జున బాబాయ్ సినిమాలను చూస్తూ తాను పెరిగానని తెలిపారు. ఇక ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ నటుడు శోభన్ బాబు మరణించారనే వార్త తెలియడంతో తనకు వచ్చిన ఈ అవార్డు శోభన్ బాబు గారి ఇంట్లో ఉండాలని నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్ ఆ అవార్డును తన ఇంటికి పంపించారు.
శోభన్ బాబు ఇంటికి..
ఆ క్షణం ఎన్టీఆర్ తీసుకున్న ఆ నిర్ణయానికి చిరంజీవి సైతం ఫిదా అవ్వడమే కాకుండా ఎన్టీఆర్ పై ప్రశంశల వర్షం కురిపించారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Featured
YS Sharmila: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన షర్మిల.. కారణం అదేనా?
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1719738859)
Published
3 hours agoon
3 July 2024By
lakshanaYS Sharmila: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కలిశారు. ఇటీవల హైదరాబాద్ లోనే ఉంటున్న ఈమె తెలంగాణ ముఖ్యమంత్రిని కలవడమే కాకుండా తన తండ్రి జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆమె తనకు ఆహ్వానం అందజేశారు. జులై 8వ తేదీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి అనే సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈసారి వైయస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఇన్ని రోజులపాటు జగన్మోహన్ రెడ్డి షర్మిల ఎవరికి వారు వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేసి తన తండ్రికి నివాళులు అర్పించేవారు.
ఇటీవల జగన్మోహన్ రెడ్డి నుంచి షర్మిల దూరంగా వెళ్లడమే కాకుండా ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో ఈసారి జరగబోయే జయంతి వేడుకలను షర్మిల ఘనంగా జరిపించడమే కాకుండా కాంగ్రెస్ పెద్దలను కూడా ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జూలై 8వ తేది విజయవాడలోని CK కన్వెన్షన్ సెంటర్ లో జరిగే రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానించారు.
ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు..
జులై 8వ తేదీ జరగబోయే ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ , లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర AICC పెద్దలతో పాటు .. ఏపి, తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల నాయకులు, ప్రముఖులు హాజరు కానున్నారు.
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/Kakli-80x80.webp)
Kakli: కల్కి సినిమాకు ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్ కదా.. ఆ హీరో సజెస్ట్ చేస్తేనే ప్రభాస్ వరకు వచ్చిందా?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/01/jrntr-1686392776.jpg?v=1704202423)
NTR: చిరంజీవి ఇచ్చిన అవార్డును ఆ హీరో ఇంటికి పంపిన తారక్.. ఏమైందంటే?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/sharmila-80x80.jpg?v=1719990357)
YS Sharmila: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన షర్మిల.. కారణం అదేనా?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/ys-jagan-80x80.webp)
YS Jagan: నెల్లూరు జైలుకు వైయస్ జగన్.. ఆ వైసీపీ నేతతో మూలఖత్?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/Ambani-Family-80x80.webp)
Ambani Family: సామూహిక వివాహాలు చేసిన అంబానీ కుటుంబం.. కానుకల లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/nallari-kirankumarireddy-80x80.png?v=1717917965)
Nallari Kiran Kumar Reddy : ఏపీలో దురదృష్టవంతుడంటే ఆయనే.. అంత సునామీలోనూ ఓటమి..
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/Ramoji_Rao-80x80.jpg?v=1717817310)
Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/ysjagan-80x80.png?v=1717659232)
YS Jagan : పడి లేచిన కెరటమవుతారా? పత్తా లేకుండా పోతారా?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/modi30-80x80.png?v=1717916702)
Modi 3.0 : ఏపీకి ఐదు కేంద్ర మంత్రి పదవులు.. ఎవరెవరికంటే..
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/pawan-kalyan-80x80.jpg?v=1717758472)
Pawan Kalyan: నరేంద్ర మోడీకి తన కొడుకుని పరిచయం చేసిన పవన్… సంతోషంలో ఫ్యాన్స్?
Trending
- Featured3 weeks ago
Nallari Kiran Kumar Reddy : ఏపీలో దురదృష్టవంతుడంటే ఆయనే.. అంత సునామీలోనూ ఓటమి..
- Featured4 weeks ago
Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!
- Featured4 weeks ago
YS Jagan : పడి లేచిన కెరటమవుతారా? పత్తా లేకుండా పోతారా?
- Featured3 weeks ago
Modi 3.0 : ఏపీకి ఐదు కేంద్ర మంత్రి పదవులు.. ఎవరెవరికంటే..
- Featured4 weeks ago
Pawan Kalyan: నరేంద్ర మోడీకి తన కొడుకుని పరిచయం చేసిన పవన్… సంతోషంలో ఫ్యాన్స్?
- Featured5 days ago
Ali: ఇప్పుడు ఎన్నికలు పెట్టిన ఆయన సీఎం నేను హోమ్ మినిస్టర్ అవుతా: అలీ
- Featured4 weeks ago
Hema: సినీనటి హేమకు భారీ షాక్.. జ్యూడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు!
- Featured4 weeks ago
YS Jagan & Sharmila : అన్నాచెల్లి కలుస్తారా? ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్..