Helath Benefits: జామ కాయ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతీ ఒక్కరికీ ఇష్టమే. దీని వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. దీనిలో ఎక్కువగా సీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అంతే కాదు దీనిని పేదవాని యాపిల్ అని కూడా అంటారు.Helath Benefits: మీకు జామకాయ అంటే ఇష్టమా..! అయితే అందులో ఉండే గింజలు తినొచ్చా..?
ఎందుకంటే.. తక్కువ ధరలో ప్రతీ ఒక్కరికీ ఇది అందుబాటులో ఉంటుంది. అంతే కాదు ఏ ప్రాంత రైతులు అయినా దీనిని పండిస్తారు. ఇంటి ఆవరణలో కూడా చాలామంది జామ చెట్లను పెంచుతుంటారు. అందుకే దీనిని పేదవాని యాపిల్ అంటారు. దీనిలో పోషక విలువలు చాలా ఉంటాయని.. ప్రతీ ఒక్కరు దీనిని తీసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.Helath Benefits: మీకు జామకాయ అంటే ఇష్టమా..! అయితే అందులో ఉండే గింజలు తినొచ్చా..?
ఇదంతా ఇలా ఉండగా.. జామకాయ తినే సమయంలో కొన్ని కాయల్లో గింజలు తక్కువగాను.. మరికొన్ని కాయల్లో గింజలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే మనం ముక్కలుగా కోసి వాటిపై కారం, ఉప్పు చల్లుకొని తింటుంటాం. అయితే ఈ గింజలను తినడం మంచిదేనా.. దాని వాల్ల ఏమైనా సైట్ ఎఫెక్ట్స్ ఉన్నాయా.. అనే విషయాలు చాలామందికి తెలియదు. దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
జామకాయ లోపల కొన్ని తెల్లగాను.. మరికొన్ని ఎరుపు రంగులో విత్తనాలు ఉంటాయి. కానీ ఏ కాయలో అయినా గింజలు అనేవి సహజంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబున్నారు. ఈ విత్తనాలలో ఫైబర్ సమృద్దిగా ఉండటం వలన మలబద్దకం, అసిడిటీ, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు లేకుండా చేయటమే కాకుండా జీర్ణ క్రియ బాగా జరిగేలా చేసి బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుందట. అంతే కాదు రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యకరంగా ఉండటంతో పాటు.. రక్తప్రసరణ మంచిగా జరిగి గెండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉపయోగపడతుంది. ఇక శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ ర్యాడికల్స్ ను ఎప్పటికప్పుడు తొలగించి కణాలను రక్షించేందుకు సహాయం చేస్తాయట. అంతే కాకుండా రోగనిరోధక శక్తి పెంపొందేందుకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా కూడా ఉపయోగపడుతుందట. అందుకే జామకాయలో అయినా.. పండులో అయినా విత్తనాలను ఎలాంటి డౌట్ లేకుండా తినేయొచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు.
Rajamouli: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు డైరెక్టర్ రాజమౌళి. ఈయన దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇక తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత రాజమౌళికి దక్కుతుందని చెప్పాలి. ఇలా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
రాజమౌళి కెరియర్ లో వచ్చిన మగధీర సినిమా ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాలి. మొదటిసారి ఇలాంటి సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు అయితే ఈ సినిమా సమయంలో తాను ఎంతో కంగారు పడ్డానని అప్పటికే ఇది చాలా భారీ బడ్జెట్ కావడంతో ఒక రకమైన భయం ఉండేదని తెలిపారు.
ఇక తన సినిమాలలో అందరిలాగే స్టార్ హీరోయిన్లనే పెట్టుకోవాలని నేను అనుకుంటాను. కానీ నేను రాసుకున్న కథకు అనుగుణంగా ఏ హీరోయిన్ అయితే సెట్ అవుతుందో వారినే తీసుకుంటాను. ఆ హీరోయిన్ కు వరుసగా ప్లాపులు వచ్చిన ఆమె ఐరన్ లెగ్ అంటూ ట్రోల్స్ ఎదుర్కొన్న తాను వాటిని లెక్క చేయను. మగధీర..
Advertisement
ఇలా ఆ హీరోయిన్ హిస్టరీ గురించి నేను ఏమాత్రం ఆలోచించనని నా పాత్రకు సూట్ అయితే తప్పనిసరిగా వారికి అవకాశాలు ఇస్తాను అంటూ ఈ సందర్భంగా హీరోయిన్ల గురించి రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈయన మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది.
Venu Swamy: బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ 8 కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా వేణు స్వామి సందడి చేయబోతున్నారనే సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమం ఆగస్టులోనే ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన లిస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో వేణు స్వామి కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు స్వామి బిగ్ బాస్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
ఇలా ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలోకి రాబోతున్నారని తెలియగానే ఈ కార్యక్రమం పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈయన కారణంగా రేటింగ్స్ కూడా భారీగా వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే వేణు స్వామి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటూ అందుకోబోయే రెమ్యూనరేషన్ గురించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
లక్షల్లో రెమ్యునరేషన్..
Advertisement
దేశ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ తీసుకొని రెమ్యూనరేషన్ ఈయన అందుకోబోతున్నారని తెలుస్తోంది. వేణు స్వామి వారానికి లక్షల్లోనే రెమ్యూనరేషన్ అందుకునే విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు సమాచారం. మరి వేణు స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని ఆయన రెమ్యూనరేషన్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు. ఈమె హైదరాబాదులో రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ బిజినెస్ చేసుకుంటూ జీవనం గడిపేది అయితే ఈమె చాలా తక్కువ ధరకే కడుపునిండా భోజనం పెట్టడంతో ఈమె గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్లి తనతో ఇంటర్వ్యూ తీసుకోవడంతో ఒక్కసారిగా ఈమె పాపులర్ అయ్యారు.
ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె ప్రస్తుతం సెలబ్రిటీగా మారిపోయారని చెప్పాలి. ఎన్నో కార్యక్రమాలలో కూడా కుమారి ఆంటీ సందడి చేశారు. ఇక త్వరలోనే కుమారి ఆంటీ బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.
ఈ విధంగా కుమారి ఆంటీ రోజురోజుకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకోవడంతో ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఆమె వద్దకు వచ్చి ఆమె ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్దకు సినీ నటుడు సోను సూద్ వచ్చి ఒక్కసారిగా సర్ప్రైజ్ ఇచ్చారు. కుమారి ఆంటీని కలిసిన ఈయన ఆమెతో సరదాగా మాట్లాడి తన కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Advertisement
మహిళా సాధికారత.. మహిళా సాధికారత కష్టపడే తత్వానికి కుమారి ఆంటీ నిదర్శనమని సోను సూద్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా తనకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానని వెంటనే నాకు తెలియజేయాలి అంటూ ఆమెకు ధైర్యం చెప్పారు. ఇక సోను సూద్ గురించి కుమారి ఆంటీ మాట్లాడుతూ.. ఎంతోమందికి సహాయం చేసిన సోను సూద్ కి ఏమిచ్చినా తక్కువే అంటూ కుమారి ఆంటీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.