Connect with us

Featured

Gunturu Kaaram: గుంటూరు కారం సినిమా పరిస్థితి చాలా దారుణం.. ఆ సినిమాకు క్యూ కడుతున్న అభిమానులు?

Published

on

Gunturu Kaaram: తాజాగా గుంటూరు కారం జై హనుమాన్ సినిమాలు విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. మొదటినుంచి ఈ రెండు సినిమాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదలకు ముందు రెండు సినిమాలు కూడా ఈక్వల్ గానే ప్రమోషన్స్ కార్యక్రమాలు చేయబడుతూ వచ్చాయి. కానీ ఎక్కువ శాతం ప్రేక్షకులు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాపై ఆసక్తిని చూపించారు. కానీ బుక్ మై షో అలాంటి టికెట్ బుకింగ్ యాప్ లలో మాత్రం హనుమాన్ సినిమాకే ఎక్కువ శాతం మెజారిటీ వచ్చింది. అయితే తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలచినట్టు గుంటూరు కారం సినిమా పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది.

Advertisement

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా బ్యాడ్ టాక్ ని తెచ్చుకోవడం తోపాటు కలెక్షన్ల విషయంలో కూడా వెనుక పడుతోంది. మరోవైపు హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. గుంటూరు కారం పరిస్థితి దారుణంగా మారింది. సంక్రాంతికి వచ్చింది కాబట్టే ఈ మాత్రం వసూళ్లైనా వచ్చాయి. లేదంటే డిజాస్టర్‌గా నిలిచి రెండో రోజే జెండా ఎత్తే పరిస్థితి వచ్చేది. గుంటూరు కారం సినిమాకు బ్యాడ్ రివ్యూలు, బ్యాడ్ మౌత్ టాక్ వచ్చింది. జనాలు గుంటూరు కారం వైపు చూడటం లేదు. ఈ విషయాన్ని బుక్ మై షో చూస్తే అర్థం అవుతుంది.

గుంటూరు కారంకు డిమాండ్ లేకపోయినా కూడా థియేటర్లు ఉన్నాయి. నైజాంలో గుంటూరు కారంకే థియేటర్లు ఇచ్చారు. ఇప్పుడు సినిమాను జనాలు చూడాలనుకోవడం లేదు. అయినా కూడా అదే సినిమాను థియేటర్లలో ఆడిస్తున్నారు. అదే ఆంధ్రలో అయితే డిమాండ్ ఉన్న సినిమాను వేసుకుంటున్నారు. హనుమాన్ సినిమాకు అక్కడ ఇరవై శాతం స్క్రీన్‌లు పెరిగాయని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు విడుదలకు ముందు ఎక్కువ థియేటర్స్ లో గుంటూరు కారం సినిమా విడుదల అవ్వగా ప్రస్తుతం ఎక్కువ థియేటర్స్ లో హనుమాన్ సినిమానే ప్రదర్శితం అవుతుంది.

హనుమాన్ సినిమాను ముందు నుంచి కూడా నైజాం ఏరియాలో అడుగు పెట్టనివ్వలేదు. దిల్ రాజు ఉన్న థియేటర్లన్నీ కూడా గుంటూరు కారంకే ఇచ్చాడు. ఇక శిరీష్ రెడ్డి అయితే హనుమాన్ గురించి దారుణంగా మాట్లాడాడు. గుంటూరు కారంతో పోలిక ఏంటి కావాలంటే నా సామిరంగాతో పోల్చుకోమను అంటూ కాస్త దురుసుగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇండస్ట్రీలో చాలా మంది హనుమాన్‌ను తక్కువ అంచనా వేశాడు. ఇదేం ఆడుద్దిలే అని లైట్ తీసుకున్నారు. చివరకు రిజల్ట్ చూస్తే టాలీవుడ్ తలెత్తుకునేలా చేసింది హనుమాన్.

Advertisement

గుంటూరు కారంని వెనక్కి నెట్టేసిన హనుమాన్..

ఇండియా మొత్తం ప్రశాంత్ వర్మకు సలాం కొట్టే పరిస్థితి వచ్చింది. ఇంత తక్కువ బడ్జెట్‌లో అంత క్వాలిటీ ఎలా వచ్చిందంటూ బాలీవుడ్ సైతం షాక్ అవుతోంది. ఒక వేళ డిమాండ్‌కు తగ్గట్టుగా హనుమాన్‌కు థియేటర్లు ఇచ్చి ఉంటే కలెక్షన్లు వేరేలా ఉండేవి. కేవలం ప్రీమియర్లతోనే నైైజాంలో రెండున్నర కోట్లకు పైగా వసూళ్ చేసింది హనుమాన్. అదే పూర్తి స్థాయిలో థియేటర్లు ఇచ్చి ఉంటే దుమ్ములేపేసేది. ఇప్పుడు హైద్రాబాద్‌లోనే గుంటూరు కారంకు 712 షోలు ఉంటే అందులో కనీసం 250 కూడా ఫుల్ అవ్వలేదు. అదే హనుమాన్‌ను చూసుకుంటే 230కి 228 ఫుల్ అయ్యాయి. అంటే ఏ రేంజ్‌లో డిమాండ్ ఉందే అర్థం చేసుకోవచ్చు. ఇక ఓవర్సీస్‌లోనూ హనుమాన్ పై చేయి సాధించింది. యూఎస్‌లో 369 లొకేషన్ల నుంచి 408k డాలర్లను వసూళ్ చేస్తే.. 409 లొకేషన్ల నుంచి గుంటూరు కారం 334k డాలర్లను మాత్రమే వసూళ్ చేసింది. అంటే హనుమాన్‌ను ఇకపై గుంటూరు కారం అందుకోవడం కష్టమే అన్నట్టుగా తెలుస్తోంది. చూస్తుంటే గుంటూరు కారంను కుర్చీ మడత పెట్టి.. పక్కన పడేసింది హనుమాన్.

Advertisement

Advertisement

Featured

Samantha: కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సమంత…అండగా నిలిచారంటూ?

Published

on

Samantha: సినీ నటి సమంత ఇటీవల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈమె తన రాజకీయాలలో భాగంగా సమంత అక్కినేని కుటుంబం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా కొండ సురేఖ వార్తలలో నిలవడమే కాకుండా నాగార్జున ఈమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ విధంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సమంతతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం స్పందిస్తూ ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక అప్పట్లో సమంత ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. తాజాగా మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ.. సౌత్ సినీ ఇండస్ట్రీ అండగా నిలిచి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇండస్ట్రీ ప్రజలు చూపించిన ఈ ప్రేమే నన్ను ఈ వివాదం నుంచి బయటపడేలా చేసింది. లేకుంటే మరింత కృంగిపోయే దానిని. అందరి సపోర్ట్ వల్లే తిరిగి మీ ముందు కూర్చున్నాను అంటూ ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇండస్ట్రీ సపోర్ట్..
కొండా సురేఖ సమంత గురించి తప్పుగా మాట్లాడటమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ గురించి సంచలన ఆరోపణలు చేశారు. సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ ఈమె వారి గురించి మాట్లాడటంతో అప్పట్లో తెలంగాణ రాజకీయాలలోనూ,సినీ ఇండస్ట్రీలోనూ ఈ విషయం సంచలనంగా మారింది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Samantha: నాగచైతన్య ప్రతి జ్ఞాపకాన్ని కాల్చేసిన సమంత.. ఆ ఒక్కటి భద్రంగా ఉంచుకుందా?

Published

on

Samantha: సినీ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత తన వ్యక్తిగత కారణాలు అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లకు కమిట్ అయ్యారు.

Advertisement

ఇక సమంత వ్యక్తిగత విషయానికి వస్తే నటుడు నాగచైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం పాటు కొనసాగ లేకపోయారు. సమంత నాగచైతన్య ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను చూపించుకునేవారు. అయితే వీరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇలా విడాకులు తీసుకున్న తర్వాత సమంత నాగచైతన్యకు సంబంధించిన జ్ఞాపకాలు అన్నిటిని కూడా చెరిపివేసింది. ఇలా తాను ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని వెనక్కి పంపియడమే కాకుండా తన మెడలో తాళిని కూడా వెనక్కి తిరిగి ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలన్నింటినీ కూడా కాల్చేసిన సమంత ఒకే ఒక గిఫ్ట్ మాత్రం భద్రంగా పెట్టుకున్నారని తెలుస్తుంది.
పెళ్లి ఫోటో..
మరి సమంత భద్రంగా దాచుకున్న ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే.. నాగచైతన్య సమంత పెళ్లిలో దిగిన ఫోటోని భద్రంగా దాచి ఉంచారని తెలుస్తోంది. తన పెళ్లిలో తన తల్లిదండ్రులతో పాటు నాగచైతన్య సమంత కలిసి దిగిన ఫోటో అంటే తనకు చాలా ఇష్టమని గతంలో పలు సందర్భాలలో సమంత తెలిపారు. ఆ ఫోటోని మాత్రం అలాగే భద్రంగా ఉంచుకున్నారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Bahubali 3: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలోనే బాహుబలి 3..హింట్ ఇచ్చిన నిర్మాత!

Published

on

Bahubali 3: ప్రభాస్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ హీరోగా బాహుబలి సినిమా గుర్తింపు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే త్వరలోనే బాహుబలి త్రీ కూడా రాబోతోంది అంటూ తాజాగా నిర్మాత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో బాహుబలి 3 గురించి ప్రభాస్ రాజమౌళి మాట్లాడిన ఇప్పుడే అలాంటి ఆలోచనలేమీ లేవని తెలిపారు.

ఇకపోతే తాజాగా కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల బాహుబలి నిర్మాతలతో కలిసి మాట్లాడానని అయితే వారు బాహుబలి 3 కూడా ఉండబోతోందని తెలిపారంటూ జ్ఞానవేల్ రాజా వెల్లడించారు.

బాహుబలి 3..
ఇలా బాహుబలి నిర్మాతలు పార్ట్ 3 కూడా ఉండబోతుందని చెప్పారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రభాస్ ఈ సినిమా చేసిన ఇప్పట్లో రాదని తెలుస్తుంది. ఇప్పటికే ఈయన సుమారు ఐదు పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి వరుస షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాతనే బాహుబలి త్రీ గురించి ఆలోచిస్తారని అభిమానులు చర్చలు జరుపుకుంటున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!