Connect with us

Featured

Natti Kumar : చంద్రబాబు ఆ లెటర్ మాయం చేశాడా… లక్ష్మి పార్వతి ఆరోపణలకు నట్టి కుమార్ కౌంటర్..!

Published

on

Natti Kumar : ఎన్టీఆర్ గారి చిన్న కూతురు ఉమా మహేశ్వరి ఆగష్టు 1 వ తేదీన ఇంట్లో ఉంటి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ షాక్ నుండి నందమూరి కుటుంబ సభ్యులు ఇంకా తేరుకోకముందే ఈ ఇష్యూని రాజకీయం చేస్తున్నారు కొంతమంది. ఆమె ఆత్మహత్య చేసుకోడానికి లోకేష్ తో వివాదాలు కారణం అంటూ ఆరోపించారు. ఇక లక్ష్మి పార్వతి ఏకంగా ఉమా మహేశ్వరి మరణించాక చంద్రబాబు ఆమె రాసిన సుసైడ్ లెటర్ ను మాయం చేసాడని, ఈ ఉదంతం పై సిబిఐ ఎంక్వయిరీ చేయాలంటూ మీడియా మీటింగ్ పెట్టి మరీ ఆరోపించింది. ఇక అటు కొంతమంది వైసీపీ నేతలు కూడా ఉమా మహేశ్వరి మృతి పై చంద్రబాబు ను, లోకేష్ ను ఆమె చావుకు కారణం మీరే అంటూ ఆరోపిస్తున్నారు. ఒక వైసీపీ నేత ట్విట్టర్ వేదికగా హెరిటేజ్ లో ఉమా మహేశ్వరి గారికి వాటా ఉండటం వల్ల ఆ విషయంలో లోకేష్ కి ఉమా గారికి గొడవ జరిగిందంటూ ఆరోపించారు.

Advertisement

ఈ సమయంలో రాజకీయం అవసరమా…

ఇక ఫిల్మ్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ ఈ ఇష్యూ మీద మాట్లాడారు. ఎన్టీఆర్ గారి కూతురు మరణించి ఆయన కుటుంబం బాధలో ఉంటే ఇలాంటి ఆరోపణలు ఏంటి అంటూ ఫైర్ అయ్యారు. రాజకీయాలంటే వ్యక్తిగత విషయాల గురించి చేయకూడదంటూ చెప్పారు. లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ భార్య కదా మరి ఇంట్లో ఒక విషాదం జరిగినపుడు వీలైతే పరామర్శించి ధైర్యం చెప్పాలి అంతే కానీ ఇలాంటి ఆరోపణలను చేసి వారిని మరింత బాధపెట్టకూడదు. చంద్రబాబు నాయుడు మీద కోపం ఉంటే ఆయన మీద విమర్శలు చేయొచ్చు ఎన్టీఆర్ గారి కుటుంబాన్ని ఎందుకు లాగడం. చనిపోయిన ఆయన కూతురుని రాజకీయంగా వాడుకోవడం ఏమిటి అంటూ అభిప్రాయపడ్డారు. ఎవరైనా చనిపోయిన వారి మీద రాజకీయం చేయటం తప్పు అంటూ మాట్లాడారు.

ఆస్తి గురించి గొడవ అనే ఆరోపణలలో నిజం లేదని, ఎన్టీఆర్ గారు కూతుర్లకు కొడుకులకు సమానంగా ఆస్తి పంచారని చెప్పారు. ఇక ఒకవేళ ఆస్తి గురించి ఏదైనా ఉన్నా ఆమె తరువాత ఆస్తి కూతుర్లకు వస్తుంది ఈ విషయం అందరికీ తెలుసు. అయిన రాజకీయాల కోసం వాడుకుంటారా అని అన్నారు నట్టి కుమార్. వాళ్ళేదో విషాదం లో ఉంటే ఆమె ఇందుకు చనిపోయింది, అందుకు చనిపోయింది అంటూ మాట్లాడటం మంచిది కాదు అని అభిప్రాయపడ్డారు. అనారోగ్య సమస్యలను వల్ల ఆమె మరణిస్తే పోస్టుమార్టం లో కూడా ఆమెది ఆత్మహత్య అని తెలిసినా కూడా రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని నట్టి వాఖ్యణించారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Chiranjeevi: చిరంజీవి ఒక రాక్షసుడు.. మరి అంత దుర్మార్గమా… జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!

Published

on

Chiranjeevi: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు చిరంజీవి గురించి మరో నటుడు జేడీ చక్రవర్తి చేసిన వ్యాఖ్యల సంచలనగా మారాయి. జె.డి చక్రవర్తి గులాబీ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన ఈయన తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

Advertisement

ఇటీవల దయ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జే డీ చక్రవర్తి చిరంజీవి గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. చిరంజీవిని పట్టుకుని దుర్మార్గుడు రాక్షసుడు అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఈ విధంగా చిరంజీవి గురించి చక్రవర్తి మాట్లాడటానికి కారణం లేకపోలేదు ఓసారి చిరంజీవి హీరోగా నటిస్తున్న ఘరానా మొగుడు సినిమా షూటింగ్ జరుగుతుంది. అదే సమయంలోనే జె.డి చక్రవర్తి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న అంతం సినిమా కూడా అక్కడ షూటింగ్ జరుగుతుంది. అయితే అక్కడ షూటింగ్ జరిగే సమయంలో చిరంజీవి గారిని చక్రవర్తి గమనిస్తూనే ఉన్నారట. అందరూ కూడా షిఫ్ట్ మారుతున్న ఈయన మాత్రం అక్కడ అలాగే కూర్చుని తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు.

పని రాక్షసుడు..

Advertisement

ఇక ఓ రోజు తన కారులోనే నిద్రపోతున్నారు ఇదేంటి ఇలా నిద్రపోతున్నారని ఆయనని అడిగాను. ఇక్కడ కాకపోతే రూమ్ కి వెళ్లి నిద్రపోవచ్చు కదా అంటూ చిరంజీవి గారిని అడగగా ఆయన ఒకటే మాట చెప్పారు. నేను రూమ్ కి వెళ్తే ఎవరు నన్ను లేపరు. ఇక్కడైతే నన్ను లేపుతారు తద్వారా షూటింగ్ డిస్టర్బ్ కాదు అంటూ చెప్పారు. ఆ మాట వినగానే ఈయన ఏంటి మరి ఇంత దుర్మార్గంగా ఉన్నారు, మరి ఇంత పని రాక్షసుడా అంటూ నేను నా మనసులోనే అనుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయానని చక్రవర్తి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Kalyan Ram: బాలయ్య బాబాయ్ తో నన్ను అసలు పోల్చద్దు.. కళ్యాణ్ రామ్ షాకింగ్ కామెంట్స్!

Published

on

Kalyan Ram: సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది. ఇక నందమూరి వారసులుగా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కొనసాగుతున్న సంగతి మనకు తెలిసినదే. త్వరలోనే ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Advertisement

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నటుడు కళ్యాణ్ రామ్ సైతం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నిర్మాతగా వ్యవహరిస్తున్న కళ్యాణ్ రామ్ కూడా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.

మీరు మీ నిర్మాణ సంస్థలో ఇలాంటి సినిమాలను నిర్మించడమే కాకుండా మీరే నటించవచ్చు కదా అనే ప్రశ్న ఈయనకు ఎదురయింది. ఈ ప్రశ్నకు కళ్యాణ్ రామ్ సమాధానం చెబుతూ.. దయచేసి మీరు ఎప్పుడూ కూడా మా బాబాయ్ బాలకృష్ణతో నన్ను పోల్చొద్దని ఈయన తెలిపారు. ఆయన ఈ వయసులో కూడా చాలా యాక్టివ్ గా ఎంతో ఎనర్జీటిక్ గా సినిమాలు చేస్తున్నారు. ఆయనని చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది అలాంటి ఒక గొప్ప నటుడితో నన్ను పోల్చవద్దని తెలిపారు.

వాళ్లకంటూ ఓ సిగ్నేచర్ ఉంది..
ఇక ఎన్టీఆర్ నటన గురించి మాట్లాడుతూ..RRR సినిమాలో ఎన్టీఆర్ తన నటనతో కంటతడి పెట్టించారు. అలాంటి సినిమాలను నేను చేయలేను. వాళ్లకంటూ ఓ సిగ్నేచర్ ఉంది. ఎలాంటి పాత్రలైనా వాళ్లు చేయగలరు. ఇక నందమూరి హీరోల మధ్య ఉన్నది పోటీ కాదు..కేవలం స్ఫూర్తి. ఒకరిని చూసి ఇంకొకరు స్ఫూర్తిని పొందుతామని కళ్యాణ్ రామ్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Jani Master: జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు… కేసు నమోదు చేసిన పోలీసులు?

Published

on

Jani Master: సినీ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జానీ మాస్టర్ ఇటీవల 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో భాగంగా ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డుకు ఎంపిక అయ్యారు.అతి త్వరలోనే ఈయన ఈ అవార్డును అందుకోబోతున్నారు.

Advertisement

ఇలా ఈయన సౌత్ చిత్ర పరిశ్రమలో కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. అయితే తాజాగా జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఈయన ఓ మహిళ కొరియోగ్రాఫర్ పట్ల లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు రావడమే కాకుండా సదరు మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు.

గత కొద్దిరోజులుగా జానీ మాస్టర్ అవుట్ డోర్ షూటింగ్ వెళ్లిన సమయంలో తన పట్ల లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని తనపై అత్యాచారం కూడా చేశారని సదరు మహిళ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.. ఇలా షూటింగ్ వెళ్లిన సమయంలో మాత్రమే కాకుండా నార్సింగ్ లో తన నివాసంలో కూడా ఇలా తనపట్ల లైంగిక వేధింపులకు గురి చేశారని ఆమె పేర్కొన్నారు.

లైంగిక వేధింపులు..
ఇక ఈమె తోలుత రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఆమె నివాసం నార్సింగ్ లో ఉన్న నేపథ్యంలో రాయదుర్గం పోలీసులు ఈ కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు. ఈ క్రమంలోనే పోలీసుల పలు సెక్షన్ల కింద ఈయనపై కేసు నమోదు చేశారు. మరి ఈయన ఇప్పటివరకు ఈ విషయం గురించి ఎక్కడ స్పందించలేదు. ఇక జానీ మాస్టర్ పై ఇలాంటి కేసు నమోదు కావడంతో సోషల్ మీడియాలో రాజకీయాల పరంగా ఈ విషయం పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!