Rashmi Gautam: పిల్లలు పుట్టాలంటే మంచం పక్కన ఉండాలి… బోల్డ్ కామెంట్స్ తో రెచ్చిపోయిన యాంకర్ రష్మీ!

Rashmi Gautam: బుల్లితెరపై ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అయితే ఈ కార్యక్రమానికి యాంకర్లుగా వ్యవహరిస్తున్న వారు కూడా ఎంతో మంచి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో యాంకర్ రష్మీ కూడా ఒకరు. ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న రష్మీ పలు ఈవెంట్లలో కూడా సందడి చేస్తూ ఉంటారు. ఇక జబర్దస్త్ కార్యక్రమం అంటే డబుల్ మీనింగ్ డైలాగులకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి.ఈ కార్యక్రమంలో పాల్గొనే కమెడియన్స్ వారి స్కిట్లలో డబుల్ మీనింగ్ డైలాగులు వాడితూ ఉంటారు.

ఇలా బూతు పదాలతో రెచ్చిపోతూ ఉండడంతో కొన్నిసార్లు ఈ కార్యక్రమం పై తీవ్ర వ్యతిరేకత కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమంలో తరచూ ఇలాంటి డబల్ మీనింగ్ డైలాగులకు ఏమాత్రం కొదువ ఉండదు. అయితే తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో భాగంగా భార్యాభర్తల స్కిట్ లో భాగంగా భార్యాభర్తలు మాట్లాడుతూ… పిల్లలు పుట్టాలంటే ఇలా కంచం పక్కన ఉంటే సరిపోదు అంటూ డైలాగ్ చెబుతుంటారు.

Rashmi Gautam: రేటింగ్ కోసం బూతు డైలాగులు….


ఇలా డైలాగ్ చెబుతుండగానే వెంటనే రష్మీ ఈ డైలాగ్ అందుకుని పిల్లలు పుట్టాలంటే మంచం పక్కన ఉండాలి అంటూ బోల్డ్ కామెంట్స్ చేశారు.ఇలా రష్మీ ఒక్కసారిగా ఇలాంటి డైలాగు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ కావడంతో మల్లెమాలవారు ఎప్పటికీ మారరు టిఆర్పి రేటింగ్స్ కోసం ఇలా బోల్డ్ డబుల్ మీనింగ్ డైలాగులు వాడుతూ ఉన్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.