Connect with us

Featured

Sai pallavi: కులాంతర వివాహం మహా పాపం… ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ పై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్!

Published

on

Sai pallavi: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఫిదా సినిమా ద్వారా అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి సాయి పల్లవి. హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం తెలుగులో వరుస సినిమాలలో నటించారు. ఎలాంటి గ్లామర్ షో కి తావు లేకుండా సహజ నటనతో ప్రేక్షకులను మెప్పించారు.

Advertisement

ఇకపోతే ఇటీవల సాయి పల్లవి చెల్లెలు పూజ వివాహం ఎంతో ఘనంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా సాయి పల్లవి తన చెల్లికి పెళ్లి చేయడంతో ఈమె పెళ్లి ఎప్పుడు అంటూ చాలామంది సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇలా సాయి పల్లవి పెళ్లి గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తరుణంలో ఈమె ఇంటర్ క్యాస్ట్ మ్యారేజి గురించి గతంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ గురించి సాయి పల్లవి మాట్లాడుతూ మా చిన్నప్పుడు మా ఇంట్లో పెద్దవాళ్లు మాకు ఒకటే విషయం చెప్పేవాళ్ళు.

మా కమ్యూనిటీలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం మహా పాపం. మా కమ్యూనిటీకి చెందిన వారిని పెళ్లి చేసుకోవాలి. పొరపాటున వేరే కమ్యూనిటీకి చెందిన వారిని పెళ్లి చేసుకుంటే కనుక వారిని ఆ ఊరిలో ఉండనివ్వరు. అలాగే ఆ ఇంట్లో జరిగే ఎలాంటి శుభకార్యాలకు అయినా లేదంటే అంత్యక్రియలకైనా కూడా వారిని రానివ్వరని సాయి పల్లవి తెలిపారు.
బ్లాక్ మెయిల్ చేయొద్దు…
ఇక నేను ఇండస్ట్రీలోకి వచ్చే సమయంలో మా నాన్న నాకు ఈ విషయాలు చెబుతారని తెలిసి నేను మా నాన్నతో ఒకటే మాట చెప్పాను. ఇలాంటి విషయాలన్నీ చెప్పి పిల్లలను బ్లాక్ మెయిల్ చేయొద్దని అలాంటివి చాలా ఇబ్బందిగా ఉంటాయని నాన్నతో చెప్పాను అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Pawan Kalyan: లడ్డు వివాదం.. జగన్ తప్పు ఏ మాత్రం లేదు… యూటర్న్ తీసుకున్న డిప్యూటీ సీఎం!

Published

on

Pawan Kalyan: తిరుపతి ఆలయంలో స్వామివారి ప్రసాదంగా పంచే లడ్డు కల్తీ జరిగింది అంటూ గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయంపై ఎంతోమంది శ్రీవారి భక్తులు ఆందోళన చెందారు. ఇక పవన్ కళ్యాణ్ సైతం ఈ తప్పును సరిదిద్దడం కోసం ఏకంగా దీక్ష కూడా చేపట్టిన సంగతి మనకు తెలిసిందే. గత ప్రభుత్వ హయామంలో లడ్డులో నెయ్యికి బదులు జంతువుల నూనె ఉపయోగిస్తున్నారు అంటూ ఆరోపణలు చేశారు.

Advertisement

ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేసిన ఈ ఆరోపణలను వైకాపా ప్రభుత్వం తిప్పి కొట్టింది. సరైన ఆధారాలు చూపించకుండా ఆరోపణలు చేయడం సరి కాదని వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతర కీలక నేతలందరూ కూడా ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి సైతం తిరుమలలో స్వామివారి సన్నిధిలో ఎలాంటి కల్తీ జరగలేదని ప్రమాణం చేయడంతో ఈ విషయం కాస్త కీలక మలుపు తిరిగింది.

ఇకపోతే ఈ విషయం గురించి జగన్మోహన్ రెడ్డి ఏకంగా ప్రధానమంత్రికి కూడా లేఖ రాశారు. ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాయడంతో పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదంలోకి ప్రధానిని లాగాల్సిన అవసరం లేదని, కొత్త ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు..

జగన్ రెడ్డిని తప్పు పట్టడం లేదు…
ఇక తిరుమల లడ్డు ఆరోపణలలో తాము వైయస్ జగన్మోహన్ రెడ్డిని తప్పు పట్టడం లేదని తెలిపారు. ఆయన సారథ్యంలో ఏర్పాటైన టీటీడీ బోర్డు సభ్యులే ఈ పని చేశారని స్పష్టం చేశారు. వారిని జగన్ రక్షించే ప్రయత్నం చేస్తోన్నారని పేర్కొన్నారు. ఇలా తిరుపతి లడ్డు విషయంలో జగన్ తప్పు లేదని పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఇలా ఒక్కసారిగా పవన్ యూటర్న్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేయడమే కాకుండా ఈ విషయంలో గత ప్రభుత్వ తప్పిదం లేదని మరికొందరు పవన్ వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Karthi: డిప్యూటీ సీఎం సార్ క్షమించండి… క్షమాపణలు చెప్పిన హీరో కార్తీ!

Published

on

Karthi: ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుపతి లడ్డు ప్రసాదం పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో తిరుపతి ప్రసాదం విషయంలో కల్తీ జరిగిందని ఆరోపణలు వచ్చాయి అయితే ఇందులో నిజా నిజాలు తెలియాల్సి ఉంది. ఈ క్రమంలోనే తప్పు జరిగిందనే విషయం తెలిసిన ఎంతోమంది భక్తులు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావిస్తున్నారు.

Advertisement

ఇకపోతే ఇలాంటి తప్పు జరిగినందుకు సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈయన దుర్గమ్మ గుడిలో కూడా శుద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఇదిలా ఉండగా లడ్డు వివాదం జరుగుతున్న నేపథ్యంలో హీరో కార్తీ సత్యం సుందరం సినిమా ప్రమోషన్లలో భాగంగా లడ్డు గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

యాంకర్ లడ్డు కావాలా నాయనా అని అడగడంతో కార్తీ లడ్డు ప్రస్తుతం సెన్సిటివ్ విషయంగా మారిపోయింది మాట్లాడకపోవడమే మంచిది అంటూ చెప్పుకు వచ్చారు. ఈ విషయంపై పవన్ స్పందిస్తూ.. హీరో కార్తీకి వార్నింగ్ ఇచ్చారు. సనాతన ధర్మాన్ని కాపాడండి ఇలా లడ్డు గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదు మీపై నాకెంతో గౌరవం ఉంది అంటూ సున్నితంగానే వార్నింగ్ ఇచ్చారు.

సాంప్రదాయాలను గౌరవిస్తాను..
ఇలా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై హీరో కార్తీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు కూడా తెలియజేశారు. డియర్ పవన్ కళ్యాణ్ గారు మీరు అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. నేను చేసిన వ్యాఖ్యలపై అనుకోకుండా అపార్థం ఏర్పడినందుకు క్షమాపణలు చెబుతున్నాను. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేనెప్పుడూ సాంప్రదాయాలను గౌరవిస్తాను అంటూ ఈయన క్షమాపణలు చెబుతూ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Kajal Agarwal: కాజల్ తో రొమాన్స్ అంటే వెనకడుగు వేసిన స్టార్ హీరో…. ఎవరంటే?

Published

on

Kajal Agarwal: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారిలో కాజల్ అగర్వాల్ ఒకరు. లక్ష్మీ కళ్యాణం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయమైన ఈమె అనంతరం చందమామ మగధీర వంటి వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు.

Advertisement

ఇక ఇండస్ట్రీలో యంగ్ హీరోల నుంచి మొదలుకొని సీనియర్ హీరోల సరసన నటించి మెప్పించారు. అయితే కాజల్ అగర్వాల్ తో సినిమా అంటే ఒక స్టార్ హీరో భయంతో పారిపోయారని తెలుస్తుంది. మరి కాజల్ తో సినిమా అంటే వెనుకడుగు వేసిన ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే.. ఆయన మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి అని తెలుస్తోంది.

చిరంజీవి కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో వివి వినాయక్ డైరెక్షన్లో ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఈ సినిమా తర్వాత కొరటాల డైరెక్షన్లో ఆచార్య సినిమా కూడా వచ్చింది కానీ కొన్ని కారణాలవల్ల కాజల్ సీన్లను తొలగించారు. ఇకపోతే ఖైదీ నెంబర్ 150 సినిమా సమయంలో సినిమా కథ మొత్తం విన్న చిరంజీవి హీరోయిన్ గా అనుష్క వంటి సీనియర్ హీరోయిన్స్ అయితే బాగుంటుందని సలహా ఇచ్చారట.

చిరంజీవి ఇలా సలహా ఇచ్చినప్పటికీ డైరెక్టర్ మాత్రం కాజల్ అగర్వాల్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా కథ రాశానని ఆమెనే ఫైనల్ చేద్దామని చెప్పారట. కానీ చిరంజీవి మాత్రం కాస్త వెనుకడుగు వేశారని తెలుస్తోంది. కాజల్ అగర్వాల్ అప్పటికే రామ్ చరణ్ తో కలిసి మూడు సినిమాలలో నటించారు.అలాగే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ వంటి వారందరితో కలిసి నటించింది అలాంటిది నేను కూడా ఈమెతో కలిసిన నటిస్తే ఫ్యాన్స్ ఆక్సెప్ట్ చేస్తారా లేదా అని సందేహం వ్యక్తం చేశారు.

Advertisement

చరణ్ తో నటించింది..
ఇలా ఎంతో అనుమానంగానే ఈ సినిమాకి ఓకే చెప్పిన చిరంజీవి అనంతరం సినిమా నుంచి ఒక పోస్టర్ విడుదల చేయడంతో సురేఖ ఆ పోస్టర్ కి మంచి పాజిటివ్ రివ్యూ ఇచ్చారట. ఆ సమయంలోనే ఈ సినిమా పాస్ అవుతుందని అనుకున్నాను అంటూ చిరంజీవి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!