Sai pallavi: అలాంటి పుస్తకాలు చదివి సాయిపల్లవి మైండ్ పాడైపోయింది... వెంటనే తనని అరెస్ట్ చేయాలి బీజేపీ నేత డిమాండ్!

Raja Singh : విప్లవ పుస్తకాలు చదివి సాయిపల్లవి మైండ్ పాడైపోయింది… వెంటనే ఆమెని అరెస్ట్ చేయాలి బీజేపీ నేత రాజా సింగ్ డిమాండ్!

Raja Singh : ప్రముఖ నటి సాయి పల్లవి ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాటపర్వం సినిమాలో రానా సరసన సాయి పల్లవి నటించింది. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

Sai pallavi: అలాంటి పుస్తకాలు చదివి సాయిపల్లవి మైండ్ పాడైపోయింది... వెంటనే తనని అరెస్ట్ చేయాలి బీజేపీ నేత డిమాండ్!
Sai pallavi: అలాంటి పుస్తకాలు చదివి సాయిపల్లవి మైండ్ పాడైపోయింది… వెంటనే తనని అరెస్ట్ చేయాలి బీజేపీ నేత డిమాండ్!

ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి గోసంరక్షకులని కాశ్మీరీ పండిట్ లతో పోల్చటం పెద్ద దుమారం లేపాయి. ఈ విషయంపై ఇప్పటికే పలువురు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయం గురించి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యాడు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు అంటూ మండిపడ్డాడు. ముస్లింలు, క్రైస్తవుల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఎవ్వరికీ ధైర్యం ఉండదు… కానీ హిందువుల మీద మాత్రం ఇలాంటీ వ్యాఖ్యలు చేస్తారు అంటూ చెప్పుకొచ్చాడు.

Sai pallavi: అలాంటి పుస్తకాలు చదివి సాయిపల్లవి మైండ్ పాడైపోయింది… వెంటనే తనని అరెస్ట్ చేయాలి బీజేపీ నేత డిమాండ్!

సాయి పల్లవి సినిమా కోసం కమ్యూనిస్టులు పుస్తకాలు చదివి ఆమె మెదడు పనిచేయడం లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలలో ప్రతి పోలీస్ స్టేషన్ లో ఆమె మీద కేసు నమోదు చేయాలని చెప్పుకొచ్చాడు. ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడినందుకు ఇలా ఒకరిని శిక్షిస్తే తప్ప మరెవరూ ఇలాంటి పని చేయటానికి సాహసం చేయరు అంటూ కోపంతో ఊగిపోయాడు.

ఏం మాట్లాడినా సినిమా ప్రమోషన్ కోసం అంటారు…

ఇదిలా ఉండగా ఇప్పటికే హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ లో ఉన్న పోలీస్ స్టేషన్ లో సాయి పల్లవి మీద కేసు నమోదు అయ్యింది. అంతే కాకుండా ఆమె నటించిన విరాటపర్వం సినిమా బాయ్ కాట్ చేయాలని భజరంగ్ దళ్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం గురించి తాజాగా సాయి పల్లవి స్పందించింది. నిన్న హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో భాగంగా సాయి పల్లవి మాట్లాడుతూ.. ఇప్పుడు నేను ఏమి మాట్లాడినా కూడా సినిమా కోసం మాట్లాడుతున్నాను అనుకుంటారు. ఇప్పుడు నేను సినిమా విడుదల అవుతుందన్న సంతోషంలో ఉన్నాను. సినిమా విడుదల అయిన తర్వాత ఈ విషయం గురించి తప్పకుండా మాట్లాడుతాను అంటూ చెప్పుకొచ్చింది.