Tollywood : భాష, యాసలతో కూడుకున్న మొరటైన కథలను ఎక్కువగా మనం తమిళ చిత్రాలలో చూస్తుంటాం. ఎందుకో ఈమధ్య డైరెక్టర్ సుకుమార్ అలాంటి కథలకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అలాంటి కథతో వచ్చిన సినిమాలే ఆయనకి సినీ పరిశ్రమలో పేరును తీసుకువచ్చాయి.
Advertisement
1985లో జరిగిన.. ఇతివృత్తంగా “రంగస్థలం” సినిమా కథని తీర్చిదిద్దారు. ఓ పాత కథ , ఏమాత్రం కొత్తదనం లేదు. కానీ కథ స్క్రీన్ ప్లే ఓ కొత్త తరహాలో వెళుతుంది. గోదావరి ప్రాంతాన్ని ఏ సినిమాలో తీసుకున్న నీటితో నిండిన గోదావరి పారుతుంటే.. సగటు ప్రేక్షకుడు ఎంతో ఆనందపడేవాడు. ఆ సినిమా కూడా అంతటి ఘన విజయాన్ని సాధించేది. అలా ఈ చిత్రానికి రామ్ చరణ్,సమంత లాంటి హీరో, హీరోయిన్స్ తోడవడంతో సూపర్ హిట్ గా నిలిచింది.
మొరటైన పచ్చి పల్లెటూరు కథతో వచ్చిన రంగస్థలం చిత్రాన్ని ప్రేక్షకులు హిట్ చేయడంతో.. డైరెక్టర్ సుకుమార్ మళ్ళీ ఓ మొరటైన కథ తో ఓ సినిమా రూపొందించాలనుకున్నారు. ఆ క్రమంలో.. ఈసారి ఆయన కొత్త ప్రాంతాన్ని అంటే రాయలసీమ నేపద్యంలో సినిమా రూపొందించాల అనుకున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో కథ సాగేలా సుకుమార్ ఓ కథను రాసుకున్నాడు. తిరిగి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో.. అల్లు అర్జున్, రష్మిక మందన హీరో, హీరోయిన్లుగా “పుష్ప” సినిమా విడుదలైంది. అల్లు అర్జున్ ని మునుపెన్నడూ చూడని విధంగా పూర్తిగా డిగ్లామరైజ్ చేస్తూ డైరెక్టర్ సుకుమార్ రాయలసీమ స్లాంగ్ తో కథని నడిపించిన తీరు తెలుగు ప్రేక్షకులే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యేలా చేసింది. అలా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయం సాధించింది.
తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రాంతాలైన ఆంధ్ర, రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రంగస్థలం, పుష్ప చిత్రాలు వచ్చాయి. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మరొక తెలంగాణ ప్రాంతం బ్యాక్ డ్రాప్ లో కూడా డైరెక్టర్ సుకుమార్ ఓ సినిమా రూపొందిస్తారని ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురుచూసారు. ఆ సమయంలో.. ఆయన శిష్యుడైన శ్రీకాంత్ ఓదెల ఓ మొరటు కథ తయారు చేసుకున్నారు.ఆ కథకి తగిన విధంగా.. తెలంగాణ ప్రాంతం, సింగరేణి పరిసర ప్రాంతాలను ఎంచుకున్నారు.
అయితే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బ్యానర్ లో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో “దసరా” సినిమా విడుదలయింది. ఈ సినిమాలో నాని,కీర్తి సురేష్ హీరో, హీరోయిన్లుగా నటించారు. కథలో కొత్తదనం పెద్దగా లేనప్పటికీ హీరో నానిని ఇంతకుముందు డిగ్లామర్ గా ప్రేక్షకులు చూడలేదు. నాని అలా కొత్తగా కనిపించడంతో.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అలా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ మూడు తెలుగు ప్రాంతాల నేపథ్యంతో కూడుకొని వచ్చిన ఈ మూడు సినిమాలు విజయదుందుభి మోగించాయి.
Samantha: సినీ నటి సమంత ఇటీవల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈమె తన రాజకీయాలలో భాగంగా సమంత అక్కినేని కుటుంబం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా కొండ సురేఖ వార్తలలో నిలవడమే కాకుండా నాగార్జున ఈమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.
Advertisement
ఈ విధంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సమంతతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం స్పందిస్తూ ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక అప్పట్లో సమంత ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. తాజాగా మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ.. సౌత్ సినీ ఇండస్ట్రీ అండగా నిలిచి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇండస్ట్రీ ప్రజలు చూపించిన ఈ ప్రేమే నన్ను ఈ వివాదం నుంచి బయటపడేలా చేసింది. లేకుంటే మరింత కృంగిపోయే దానిని. అందరి సపోర్ట్ వల్లే తిరిగి మీ ముందు కూర్చున్నాను అంటూ ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇండస్ట్రీ సపోర్ట్.. కొండా సురేఖ సమంత గురించి తప్పుగా మాట్లాడటమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ గురించి సంచలన ఆరోపణలు చేశారు. సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ ఈమె వారి గురించి మాట్లాడటంతో అప్పట్లో తెలంగాణ రాజకీయాలలోనూ,సినీ ఇండస్ట్రీలోనూ ఈ విషయం సంచలనంగా మారింది.
Samantha: సినీ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత తన వ్యక్తిగత కారణాలు అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లకు కమిట్ అయ్యారు.
Advertisement
ఇక సమంత వ్యక్తిగత విషయానికి వస్తే నటుడు నాగచైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం పాటు కొనసాగ లేకపోయారు. సమంత నాగచైతన్య ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను చూపించుకునేవారు. అయితే వీరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.
ఇలా విడాకులు తీసుకున్న తర్వాత సమంత నాగచైతన్యకు సంబంధించిన జ్ఞాపకాలు అన్నిటిని కూడా చెరిపివేసింది. ఇలా తాను ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని వెనక్కి పంపియడమే కాకుండా తన మెడలో తాళిని కూడా వెనక్కి తిరిగి ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలన్నింటినీ కూడా కాల్చేసిన సమంత ఒకే ఒక గిఫ్ట్ మాత్రం భద్రంగా పెట్టుకున్నారని తెలుస్తుంది. పెళ్లి ఫోటో.. మరి సమంత భద్రంగా దాచుకున్న ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే.. నాగచైతన్య సమంత పెళ్లిలో దిగిన ఫోటోని భద్రంగా దాచి ఉంచారని తెలుస్తోంది. తన పెళ్లిలో తన తల్లిదండ్రులతో పాటు నాగచైతన్య సమంత కలిసి దిగిన ఫోటో అంటే తనకు చాలా ఇష్టమని గతంలో పలు సందర్భాలలో సమంత తెలిపారు. ఆ ఫోటోని మాత్రం అలాగే భద్రంగా ఉంచుకున్నారని తెలుస్తోంది.
Bahubali 3: ప్రభాస్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ హీరోగా బాహుబలి సినిమా గుర్తింపు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు.
Advertisement
ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే త్వరలోనే బాహుబలి త్రీ కూడా రాబోతోంది అంటూ తాజాగా నిర్మాత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో బాహుబలి 3 గురించి ప్రభాస్ రాజమౌళి మాట్లాడిన ఇప్పుడే అలాంటి ఆలోచనలేమీ లేవని తెలిపారు.
ఇకపోతే తాజాగా కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల బాహుబలి నిర్మాతలతో కలిసి మాట్లాడానని అయితే వారు బాహుబలి 3 కూడా ఉండబోతోందని తెలిపారంటూ జ్ఞానవేల్ రాజా వెల్లడించారు.
బాహుబలి 3.. ఇలా బాహుబలి నిర్మాతలు పార్ట్ 3 కూడా ఉండబోతుందని చెప్పారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రభాస్ ఈ సినిమా చేసిన ఇప్పట్లో రాదని తెలుస్తుంది. ఇప్పటికే ఈయన సుమారు ఐదు పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి వరుస షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాతనే బాహుబలి త్రీ గురించి ఆలోచిస్తారని అభిమానులు చర్చలు జరుపుకుంటున్నారు.