మీకు జనతా గ్యారేజ్ సినిమా గుర్తుందా? జూనియర్ ఎన్టీఆర్ లోని మరో నటుడిని పరిచయం చేసిన సినిమా అది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఎన్నో సంచలనాలను సృష్టించింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు.. తెలుగు సినీ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. జనతా గ్యారేజ్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న పాత్ర మోహన్ లాల్ ది. ఆయన నిజానికి తెలుగు నటుడు కాదు.
Advertisement
ఆయన మలయాళం నటుడు. తెలుగులో మనకు మెగాస్టార్ చిరంజీవి ఎలాగో.. మలయాళంలో మోహన్ లాల్ అలాగ. ఆయన అక్కడ మెగాస్టార్. ఆయన మలయాళం సినిమాలు చాలా తెలుగులో డబ్ అవుతాయి కాబట్టి మనకు మోహన్ లాల్ పరిచయమే. కానీ.. ఆయన తెలుగులో డైరెక్ట్ గా ఏ సినిమాలోనూ నటించలేదు. చాలా తక్కువ సినిమాల్లో నటించారు. అందులో జనతా గ్యారేజ్ ఒకటి.
అసలు.. ఆ పాత్రకు మోహన్ లాల్ ను ఎందుకు కొరటాల ఎంచుకున్నారు?
నిజానికి.. తెలుగులో అటువంటి పాత్రలు చేయడానికి బోలెడు మంది నటులు ఉన్నారు కానీ.. కొరటాల శివ మాత్రం కేవలం మోహన్ లాల్ కే ఆ పాత్రకు ప్రాధాన్యత ఇచ్చారు. దానికి కారణం ఏంటో కూడా కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. జనతా గ్యారేజ్ సినిమాలో ఆ పాత్ర చాలా కీలకం. జూనియర్ ఎన్టీఆర్ కు దీటుగా ఆ పాత్ర ఉంటుంది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ కు దీటుగా మరో తెలుగు యాక్టర్ ను పెడితే.. అంత సెట్ కాదు. అందుకే.. నాకు మోహన్ లాల్ అయితే ఆ పాత్రకు కరెక్ట్ గా సూట్ అవుతారు అనిపించింది. ఆ పాత్ర చాలా ఇంటెన్స్ ఉన్న పాత్ర. నాచురల్ గా ఉన్న పాత్ర. ఆ పాత్రలో హీరోయిజం ఉండదు. ఆ పాత్ర కొంచెం పెద్ద వయసుగా కనిపించాలి. ఇలా.. అన్నింటికీ మోహల్ లాల్ అయితేనే సెట్ అవుతారని ఆ పాత్రకు మోహన్ లాల్ ను తీసుకున్నాం.. అని కొరటాల శివ చెప్పుకొచ్చారు.
Advertisement
మోహన్ లాల్ కు కథ చెప్పగానే ఏమన్నారు?
నిజానికి.. మోహన్ లాల్ కు చాలామంది తెలుగు డైరెక్టర్లు కథ చెప్పి ఉంటారు. కానీ.. ఆయన ఎక్కువగా తెలుగు సినిమాలు చేయడానికి ఇష్టపడలేదు. అయితే.. కొరటాల శివ మాత్రం.. ఆయన దగ్గరికి వెళ్లి.. జనతా గ్యారేజ్ కథ చెప్పారట. దీంతో వెంటనే ఆయన కథ విని.. బాగుంది. చేసేద్దాం అన్నారట. దీంతో కొరటాల శివకు ఏం అర్థం కాలేదట. నిజానికి.. కథ చెప్పి వద్దాం అని మాత్రమే కొరటాల అనుకున్నారట. కానీ.. మోహన్ లాల్ మాత్రం ఆ పాత్రకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. అలా జనతా గ్యారేజ్ సినిమా మొదలైందట.
Advertisement
బాలకృష్ణకు ఆ క్యారెక్టర్ ఎందుకు ఇవ్వలేదు?
బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్.. ఇద్దరితో కలిసి సినిమా తీయడం అంటే అది పవర్ ఫుల్ కాంబినేషన్. వాళ్లిద్దరితో సినిమా తీయాలంటే.. అంతటి స్థాయి కథ ఉండాలి. జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ.. ఇద్దరూ కలిసి సినిమా చేస్తే.. సినిమా నుంచి బయటికి వస్తారు జనాలు.. బాబాయ్.. అబ్బాయి కదా.. అన్న విషయం దగ్గరే ఆగిపోతారు కానీ.. సినిమాలో ఇన్వాల్వ్ కారు. ఆడియెన్స్ ఎక్కువగా పర్సనల్ స్కేల్ లోకి వెళ్లిపోతారు. అందుకే.. అటువంటి కాంబోలో సినిమా తీయాలంటే ఇంకా పవర్ ఫుల్ కథ రాయాల్సి ఉంటుంది.. అని కొరటాల శివ చెప్పుకొచ్చారు.
Samantha: సినీ నటి సమంత ఇటీవల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈమె తన రాజకీయాలలో భాగంగా సమంత అక్కినేని కుటుంబం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా కొండ సురేఖ వార్తలలో నిలవడమే కాకుండా నాగార్జున ఈమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.
Advertisement
ఈ విధంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సమంతతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం స్పందిస్తూ ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక అప్పట్లో సమంత ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. తాజాగా మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ.. సౌత్ సినీ ఇండస్ట్రీ అండగా నిలిచి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇండస్ట్రీ ప్రజలు చూపించిన ఈ ప్రేమే నన్ను ఈ వివాదం నుంచి బయటపడేలా చేసింది. లేకుంటే మరింత కృంగిపోయే దానిని. అందరి సపోర్ట్ వల్లే తిరిగి మీ ముందు కూర్చున్నాను అంటూ ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇండస్ట్రీ సపోర్ట్.. కొండా సురేఖ సమంత గురించి తప్పుగా మాట్లాడటమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ గురించి సంచలన ఆరోపణలు చేశారు. సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ ఈమె వారి గురించి మాట్లాడటంతో అప్పట్లో తెలంగాణ రాజకీయాలలోనూ,సినీ ఇండస్ట్రీలోనూ ఈ విషయం సంచలనంగా మారింది.
Samantha: సినీ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత తన వ్యక్తిగత కారణాలు అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లకు కమిట్ అయ్యారు.
Advertisement
ఇక సమంత వ్యక్తిగత విషయానికి వస్తే నటుడు నాగచైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం పాటు కొనసాగ లేకపోయారు. సమంత నాగచైతన్య ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను చూపించుకునేవారు. అయితే వీరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.
ఇలా విడాకులు తీసుకున్న తర్వాత సమంత నాగచైతన్యకు సంబంధించిన జ్ఞాపకాలు అన్నిటిని కూడా చెరిపివేసింది. ఇలా తాను ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని వెనక్కి పంపియడమే కాకుండా తన మెడలో తాళిని కూడా వెనక్కి తిరిగి ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలన్నింటినీ కూడా కాల్చేసిన సమంత ఒకే ఒక గిఫ్ట్ మాత్రం భద్రంగా పెట్టుకున్నారని తెలుస్తుంది. పెళ్లి ఫోటో.. మరి సమంత భద్రంగా దాచుకున్న ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే.. నాగచైతన్య సమంత పెళ్లిలో దిగిన ఫోటోని భద్రంగా దాచి ఉంచారని తెలుస్తోంది. తన పెళ్లిలో తన తల్లిదండ్రులతో పాటు నాగచైతన్య సమంత కలిసి దిగిన ఫోటో అంటే తనకు చాలా ఇష్టమని గతంలో పలు సందర్భాలలో సమంత తెలిపారు. ఆ ఫోటోని మాత్రం అలాగే భద్రంగా ఉంచుకున్నారని తెలుస్తోంది.
Bahubali 3: ప్రభాస్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ హీరోగా బాహుబలి సినిమా గుర్తింపు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు.
Advertisement
ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే త్వరలోనే బాహుబలి త్రీ కూడా రాబోతోంది అంటూ తాజాగా నిర్మాత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో బాహుబలి 3 గురించి ప్రభాస్ రాజమౌళి మాట్లాడిన ఇప్పుడే అలాంటి ఆలోచనలేమీ లేవని తెలిపారు.
ఇకపోతే తాజాగా కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల బాహుబలి నిర్మాతలతో కలిసి మాట్లాడానని అయితే వారు బాహుబలి 3 కూడా ఉండబోతోందని తెలిపారంటూ జ్ఞానవేల్ రాజా వెల్లడించారు.
బాహుబలి 3.. ఇలా బాహుబలి నిర్మాతలు పార్ట్ 3 కూడా ఉండబోతుందని చెప్పారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రభాస్ ఈ సినిమా చేసిన ఇప్పట్లో రాదని తెలుస్తుంది. ఇప్పటికే ఈయన సుమారు ఐదు పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి వరుస షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాతనే బాహుబలి త్రీ గురించి ఆలోచిస్తారని అభిమానులు చర్చలు జరుపుకుంటున్నారు.