Connect with us

General News

Rahul: దేశం కోసం మా కుటుంబం ప్రాణ త్యాగాలు చేసింది..! మోదీ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్..!

Rahul: దేశం కోసం మా కుటుంబం(నెహ్రూ కుటుంబం) ప్రాణ త్యాగాలు చేసిందని కాంగ్రెస్ అగ్రనేత, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ, మోదీకి కౌంటర్ ఇచ్చారు. మా

Published

on

Rahul: దేశం కోసం మా కుటుంబం(నెహ్రూ కుటుంబం) ప్రాణ త్యాగాలు చేసిందని కాంగ్రెస్ అగ్రనేత, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ, మోదీకి కౌంటర్ ఇచ్చారు. మా కుటుంబ త్యాగాలకు ఎవరూ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని చురకలు అంటించారు.

Rahul: దేశం కోసం మా కుటుంబం ప్రాణ త్యాగాలు చేసింది..! మోదీ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్..!
Rahul: దేశం కోసం మా కుటుంబం ప్రాణ త్యాగాలు చేసింది..! మోదీ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్..!

పార్లమెంట్లో ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలకు రాహుల్ ను మీడియా ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. తాను లేవనెత్తిన అంశాలపై కాకుండా ఇతర అంశాలు మాట్లాడుతూ, తన ప్రశ్నల నుంచి తప్పించుకున్నారని రాహుల్ పేర్కొన్నారు.

Rahul: దేశం కోసం మా కుటుంబం ప్రాణ త్యాగాలు చేసింది..! మోదీ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్..!
Rahul: దేశం కోసం మా కుటుంబం ప్రాణ త్యాగాలు చేసింది..! మోదీ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్..!

చైనా- పాక్ ఏకమవడం, రాజ్యాంగ ఉల్లంఘనలు, దేశంలో విభజన రాజకీయాలపై ప్రశ్నించినా సమాధానమే రాలేదన్నారు. రాష్ర్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డాడు.

తెలంగాణ నుంచి తొలి దళిత ముఖ్యమంతిగా..

మూడు గంటలకు పైగా ఆయన ప్రసంగంలో ఆ పార్టీ పై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్ కుటుంబ పాలనే(గాంధీల కుటుంబం) కారణమని తిట్టిపోశారు. దేశంలో అత్యవసర పరిస్థితికి, సిక్కుల ఊచకోతకు కారణం కాంగ్రెస్సే కారణమని విమర్శించారు. గతంలో చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బలహీనపరిచిందన్నారు. ఈ సందర్భంగా 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను తప్పుపట్టారు. సరైన చర్చ లేకుండా రాష్ర్టంను విడదీశారని ఆక్షేపించారు. పార్లమెంట్ తలుపులు మూసి అప్రజాస్వమిక పద్ధతుల్లో నాటి బిల్లును ఆమోదించారన్నారు. లోక్ సభలో పెప్పర్ స్ర్ప ఘటనలతో ఆనాడు హింస ఘటనలూ చోటుచేసుకున్నాయని ఆరోపించారు. అందరినీ సంప్రదించి నిర్ణయం తీసుకోకపోవడంతో నాటి సమస్యలు రెండు తెలుగు రాష్ర్టలలో ఇంకా నలుగుతూనే ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో నాటి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బలహీనపరచారన్నారు. తెలంగాణ నుంచి తొలి దళిత ముఖ్యమంతి టి.అంజయ్య మరణాంతరం జరిగిన అవమానాన్ని మోదీ గుర్తుచేశారు. ఈ ఆరోపణలకు మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీకి కాంగ్రెస్ అంటే భయమని, అందుకు నిదర్శనమే ఈ ప్రసంగమని ఆరోపించారు. తాను లేవనెత్తిన అంశాలను పక్కదోవపట్టించారన్నారు. ఈ ప్రభుత్వ విధానాలతో చైనా – పాకిస్తాన్ దేశాలు ఒక్కటవుతున్నాయని ఇది దేశానికి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నాం. అయినప్పటికీ విషయమై సమాధానమే రాలేదన్నారు. ఈ వైఖరికి దేశ భద్రతకు మంచిది కాదన్నారు. కొవిడ్ మొదటి దశలోనూ మోదీ ప్రభుత్వానికి పలు చేసామన్నారు. అయినా పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీనో, నెహ్రూ కుటుంబాన్నో విమర్శించడం కాదు మీరు(మోదీ) దేశ రక్షణకు చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

General News

ఏపీలో ఆ న్యూస్ ఛానల్ ప్రసారానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Published

on

ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అతిపెద్ద బిజినెస్ లలో సెటప్ బాక్స్ బిజినెస్ కూడా ఒకటి ఏపీలో సుమారు 65 లక్షల కుటుంబాలు ఏపీ ఫైబర్ సెటప్ బాక్స్ ని ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన రాజకీయాల కారణంగా జూన్ 6వ తేదీ నుంచి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారం ఆగిపోయాయి.

జూన్ ఆరవ తేదీ నుంచి సాక్షి టీవీతో పాటు ఎన్ టీవీ, టీవీ9 వంటికి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారాలు ఆగిపోయాయి. ఇలా న్యూస్ ఛానల్ లో ప్రసారం నిలిపివేయడంతో ఇది చట్టపరంగా విరుద్ధమని తిరిగి ప్రసారాలను పునరుద్ధరించాలని 15 మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్‌లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించడాన్ని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రశంసించింది.న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్లో చట్ట విరుద్ధంగా కొన్ని న్యూస్ ఛానల్ లను నిలిపివేయడం జరిగింది. ఇలా నిలిపివేయటాన్ని న్యాయస్థానం పూర్తిగా ఖండించింది. కేవలం రాజకీయ న్యాయకత్వం పరంగా మార్పులు రావడంతోనే కేబుల్ ఆపరేటర్ల పై ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయాలని ఒత్తిడి తీసుకురావడం తగదని చెప్పారు.

Advertisement

ఇలా సుమారు 62 లక్షల కుటుంబాలకు ఈ న్యూస్ ఛానల్ ప్రసారం నిలిపివేయటం చట్టపరంగా విరుద్ధమని, ఈ విధంగా ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయటం అనేది ప్రేక్షకుల సమాచార హక్కుని నిరాకరించే ప్రయత్నం జరగటం దురదృష్టకరమైన తెలిపారు. ఈ క్రమంలోనే నిలిపివేసిన ఈ చానల్లను తిరిగి పునరుద్ధరించాలని హైకోర్టు తీర్పును వెల్లడించింది.

Advertisement
Continue Reading

Featured

Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!

Published

on

Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈయన గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నేడు తెల్లవారుజామున 4:50 నిమిషాలకు కన్నుమూశారు.

శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఈయనని హైదరాబాద్లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈయన పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే ఈయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.

ఒక రామోజీరావు మరణ వార్త తెలియడంతో సినీ పరిశ్రమ అటు మీడియా రంగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. మీడియా రంగానికి ఎన్నో సేవలు చేసిన రామోజీరావు మరణ వార్త తెలిసి ప్రముఖ రాజకీయ నాయకులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన మరణ వార్త తెలియడంతో తెలుగుదేశం అధినేతలు మరణం వార్తపై సంతాపం ప్రకటిస్తున్నారు.

Advertisement

అనారోగ్యంతో కన్నుమూత..

రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య ఈయన రామోజీ గ్రూప్ సంస్థలను స్థాపించి ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా పత్రిక రంగానికి ఎన్నో సేవలు చేస్తున్నటువంటి ఈయన ఎన్నో అవార్డులను పురస్కారాలను కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఈయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీ లోని తన నివాసానికి తరలించారు కూడా స్పందిస్తున్నారు.

Advertisement

Continue Reading

Featured

బరితెగించిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా డీజీపీ ఫోటో వాడేశారు

Published

on

సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అదుపు లేకుండా పోతుంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అడ్డదారుల తొక్కుతూనే ఉన్నారు. ఏకంగా తెలంగాణ డీజీపీ పేరుతో సైబర్‌ క్రైమ్‌ కు దిగారు. తెలంగాణ డీజీపీ వాట్సాప్ ఫోటోతో కొందరు కేటుగాళ్లు సైబర్ ఫ్రాడ్‌కు పాల్పడుతున్నారు. డీజీపీ ఫోటో పెట్టుకొని ఓ అగంతుకుడు ఓ వ్యాపారవేత్త కుమార్తెకు వాట్సాప్ కాల్ చేశాడు. డీపీ తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఫోటో ఉండటంతో ఆమె అగంతుకుడితో మాట్లాడింది. డ్రగ్స్ కేసు ఆమెను అరెస్ట్ చేస్తున్నామని బెదిరించాడు.

కేసు నుండి తప్పించేందుకు 50 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే కేసు నుంచి ఎవరూ తప్పించలేరని బెదిరించాడు. అయితే.. ఆయన మాట్లాడిన తీరును అనుమానించి ఆ యువతి పోలీసులకు తన తండ్రికి చెప్పింది. ఆ వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. +92 కోడ్ తో వాట్సాప్ కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇది పాకిస్తాన్ కోడ్ అని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా సైబర్ నేరగాళ్లు ఏ మాత్రం తగ్గడం లేదు. సులభంగా డబ్బు సంపాదించడం కోసం అడ్డుదారులు తొక్కుతూనే ఉన్నారు. దాని కోసం సమాజంలో పెద్ద వాళ్ల పేర్లు వాడుతున్నారు. ఒక్కోసారి పెద్దవారి సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు. గతంలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ చేశారు.

Advertisement

Continue Reading
Advertisement

Trending

Don`t copy text!