చిరకాల స్నేహితుడుని కలిసిన మెగాస్టార్… ప్రత్యేకమైన రోజు అంటూ ట్వీట్!

మెగాస్టార్ చిరంజీవికి చిత్ర పరిశ్రమలో ఏ విధమైనటువంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మెగాస్టార్ ప్రస్తుతం ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు.ఈ విధంగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన చిరంజీవి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెగా స్టార్ అనే పేరు సంపాదించుకున్నారు.ఈ విధంగా ఎన్నో సినిమాలలో నటిస్తూ కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ ఆ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుత హీరోలకు పోటీగా వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మెగాస్టార్ “ఆచార్య” సినిమాలో నటిస్తుండగా ఆ తర్వాత “గాడ్ ఫాదర్”, “భోళాశంకర్” వంటి సినిమాలలో కూడా నటిస్తున్నారు.ఇదిలా ఉండగా ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

మెగాస్టార్ పుట్టినరోజుకి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే చిరంజీవి తాజాగా తన చిరకాల మిత్రుడు, భారత దేశానికి మొట్టమొదటి సారిగా ప్రపంచ కప్ అందించిన క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ను కలుసుకున్నారు. ఈ సమావేశంలో చిరుతో పాటు ఆయన సతీమణి సురేఖ కూడా పాల్గొన్నారు. ఎన్నో రోజుల తర్వాత కలుసుకున్న వీరిద్దరూ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎంతో సరదాగా గడిపారు.

ఫలుక్ నామా ప్యాలెస్‏లో జరిగిన ఓ సమావేశంలో కపిల్ దేవ్ ను చిరు సతీసమేతంగా. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి ఇన్స్టాలో షేర్ చేస్తూ చాలా కాలం తర్వాత నా మిత్రుడిని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ ఈ క్రమంలోనే గతంలోకి వెళ్లి ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నామని ఇండియాకు ప్రపంచకప్ అందించిన హర్యానా హర్రీక్రేన్ అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.