Connect with us

Featured

హ్యాపీడేస్‌ తర్వాత ఆ డైరెక్టర్ అవకాశం ఇస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చారు: నటుడు వంశీ

సినీ ఇండస్ట్రీలో ఓ ప్రముఖ దర్శకుడి గురించి సినీ నటుడు వంశీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. హ్యాపీడేస్ తర్వాత ఆ సినిమాలో తనతో పాటు చేసిన వారందరికీ

Published

on

Advertisement

సినీ ఇండస్ట్రీలో ఓ ప్రముఖ దర్శకుడి గురించి సినీ నటుడు వంశీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. హ్యాపీడేస్ తర్వాత ఆ సినిమాలో తనతో పాటు చేసిన వారందరికీ మంచి పేరు వచ్చిందని నటుడు వంశీ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆ డైరెక్టర్ తీసిన సినిమా మంచి హిట్‌ కొట్టడం, అదీ గాక తనకు ఆ మూవీ నచ్చడంతో ఆయన్ని కలిసి విష్ చేద్దామని అనుకున్నట్టు ఆయన తెలిపారు.

ఆ తర్వాత నెంబర్ తీసుకొని ఆయనకు కాల్ చేసి, ఫిల్మ్ నగర్‌లో ఒకసారి కలిశానని వంశీ అన్నారు. బొకే ఇచ్చి, మంచి సినిమా తీశారని ఆయనతో మాట్లాడినట్టు వంశీ తెలిపారు. అప్పుడు ఆయన మీ గురించి ఆలోచిస్తున్నాను. ఈలోగా మీరే నాకు ఫోన్ చేసి నా దగ్గరికి వచ్చారు. మనిద్దరం తప్పకుండా కలిసి పనిచేయాలి అని ఆయన తనతో అన్నట్టు వంశీ వెల్లడించారు. ఈ మాట ఆయనే స్వయంగా అన్నారన్న వంశీ, నిజంగా తనను అప్రిషియేట్ చేయడానికి మాత్రమే అక్కడికి వెళ్లానని ఆయన అన్నారు. నా నెక్స్ట్ సినిమా ఆయనతో కావాలని గానీ, స్కెచ్ వేసుకొని గానీ అక్కడికి వెళ్లలేదని ఆయన చెప్పారు. ఆ క్షణం అనిపించింది అతను నిజంగా అంటున్నాని తాను అనుకున్నట్టు వంశీ తెలిపారు.

అతను చాలా మంచి డైరెక్టర్. అతనితో ఎలాంటి విభేదాలూ లేవు. ఆయన గురించి తాను తప్పుగా కూడా ఏమీ అనట్లేదని వంశీ అన్నారు. ఇక్కడ ఎవరి జర్నీ వాళ్లు చూసుకుంటారని, అతనికి ఒక 15కోట్ల సినిమా వస్తే, ఆ తర్వాత అంత కంటే ఎక్కువ బడ్జెట్లో సినిమా తీయాలని అనుకుంటాడని వంశీ తెలిపారు. అంతే తప్ప వంశీ అప్పుడెప్పుడో పుష్ప గుచ్ఛం ఇచ్చాడు. వాడు మంచి యాక్టర్. వాడితో సినిమా తీయాలని వారు ఎందుకనుకుంటారు ఆని పరోక్ష కామెంట్లు చేశారు వంశీ. అలా జరిగిందే తప్ప ఆయన్ని తాను ఏం తప్పు పట్టడం లేదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

ఇప్పటికీ కూడా ఆయనతో హాయ్, హలోలు నడుస్తూ ఉంటాయి. కానీ, తాను ఆయనకు కలిసింది ఇంకా గుర్తుందా అని తనకు ఎప్పుటినుంచో ఉన్న డౌట్ అని వంశీ అన్నారు. ఒకవేళ భవిష్యత్‌లో మళ్లీ ఆయనతో చేస్తే నేను మీకు గుర్తున్నానా అని ఆయన్ని అడగాలని ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Featured

Rashmika: ఆ నొప్పిని భరిస్తేనే హీరోయిన్స్ అవుతాం.. రష్మిక సెన్సేషనల్ కామెంట్స్!

Published

on

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈమె చివరిగా యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అప్పటి నుంచి ఎలాంటి సినిమాలు విడుదల కాలేదు కానీ ప్రస్తుతం ఈమె నటిస్తున్న సినిమాలన్నీ కూడా షూటింగ్ దశలో ఉన్నాయి.

Advertisement

ఇక త్వరలోనే ఈమె నటించిన పుష్ప 2 సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఇక పుష్ప సినిమాలో రష్మిక డీ గ్లామర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే గతంలో ఈమె తన పాత్ర గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

డీ గ్లామర్ పాత్రలో నటించాలి అంటే మామూలు విషయం కాదు. మేకప్ వేయటం కోసమే ఎన్నో గంటల సమయం పడుతుంది. అయితే ఇలాంటి పాత్రలో నటించడం కోసం రష్మిక చాలా ఇబ్బందులు పడినట్లు ఈమె తెలిపారు.. మేకప్ కోసం గంటలు కూర్చుని వేయించుకోవాలని మేకప్ ఎక్కడ చెరిగిపోతుందోనని కొన్నిసార్లు మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా కేవలం లిప్స్ ఒక్కటే క్లియర్ చేసుకొని జ్యూస్ మాత్రమే తాగేదానినని తెలిపారు.

మేకప్ రిమూవ్..
ఇక ఇలాంటి మేకప్ వేసుకున్న తర్వాత దానిని రిమూవ్ చేయాలంటే ఎంతో నొప్పిగా ఉండేది అలాంటి నొప్పిని మనం భరించినప్పుడే హీరోయిన్స్ గా సక్సెస్ అవుతాము అంటూ రష్మిక పుష్ప సినిమాలోని డీ గ్లామర్ పాత్ర గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Nagachaitanya: ఆ కారణంతోనే రేస్ కార్ల జోలికి వెళ్ళలేదు…చైతన్య కామెంట్స్ వైరల్!

Published

on

Nagachaitanya: సినీ నటుడు నాగచైతన్య ప్రస్తుతం కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈయన డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా దాదాపు 80% షూటింగ్ పూర్తి చేసుకుంది. సుమారు 80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement

ప్రస్తుతం నాగచైతన్య ఈ సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా నాగచైతన్య తాజాగా తనకు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. చిన్నప్పటినుంచి కూడా నాగచైతన్యకు రేసింగ్ అంటే చాలా ఇష్టం అనే సంగతి పలు సందర్భాలలో వెల్లడించారు. తనకు ఏదైనా కొత్త రకం బైక్ లేదా కారు కనిపిస్తే అసలు ఆగలేనని వెంటనే డ్రైవ్ చేస్తానని నాగచైతన్య తెలిపారు.

ఇటీవల కాలంలో తాను కార్ రేసింగ్ జోలికి వెళ్లలేదని ఈయన తెలిపారు. ప్రస్తుతం ఒకవైపు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండటం వల్ల కుదరలేదని అదేవిధంగా నా స్నేహితులు తాను ఈ అలవాటు మానుకుంటే మంచిదని చెప్పడంతో ఈ అలవాటును కాస్త తగ్గించుకుంటున్నానని తెలిపారు. తాను రేస్ వెళ్లేటప్పుడు చాలా వేగంగా వెళ్తాను అందుకే ఈ అలవాటు మానుకోమని తన స్నేహితులు చెప్పారని చైతన్య వెల్లడించారు.

జాలరి నేపథ్యంలో..
ఇక తండేల్ సినిమా విషయానికి వస్తే నిజ జీవిత కథ ఆధారంగా ఓ జాలరి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత నాగచైతన్య పలు సినిమాలలో నటించిన సక్సెస్ అందుకోలేకపోయారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Allu Aravind: చరణ్ ను టార్గెట్ చేసిన అల్లు అరవింద్… అల్లుడికి పోటీగా రానున్న తండేల్!

Published

on

Allu Aravind: సినీ ఇండస్ట్రీలో స్టార్ ఫ్యామిలీలుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన మెగా ,అల్లు ఫ్యామిలీ మధ్య గత కొంతకాలంగా బేదాభిప్రాయాలు ఉన్నాయనే మాట వాస్తవమే అని తెలుస్తోంది. ఎప్పుడైతే అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వచ్చారో అప్పటినుంచి ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిపోయింది. ఈ ఘటన తర్వాత ఎన్నో వేడుకలు జరిగినప్పటికీ ఈ రెండు కుటుంబాలు కలిసి కనిపించలేదు.

Advertisement

ఈ క్రమంలోనే ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో కూడా ఎన్నో వార్తలు వినిపించిన వాటిని ఖండిస్తూ ఇటు మెగా ఫ్యామిలీ గాని అటు అల్లు ఫ్యామిలీ గాని క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు నిజమేనని అందరికీ స్పష్టత వచ్చింది. అయితే తాజాగా మరో ఘటన కూడా వీరి మధ్య భేదాభిప్రాయాలు నిజమైనని రుజువు చేస్తోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ డైరెక్షన్లో నటించిన గేమ్ ఛేంజర్ సినిమా డిసెంబర్లోనే విడుదల కావలసి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ విడుదల చేయాలని దిల్ రాజు భావించారు. అదే రోజు చిరంజీవి విశ్వంభర కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో చిరంజీవిని బ్రతిమలాడి అదే రోజుకు రాంచరణ్ సినిమాని విడుదల చేస్తున్నారు.

రామ్ చరణ్ కు పోటీగా చైతన్య..
ఇలా రామ్ చరణ్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకు పోటీగా ఉండకుండా సంక్రాంతి బరిలో దిగగా అల్లు అరవింద్ మాత్రం తన అల్లుడు రామ్ చరణ్ ను టార్గెట్ చేశారని తెలుస్తుంది. అల్లు అరవింద్ నిర్మాతగా చందు మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి నాగచైతన్య జంటగా నటిస్తున్న తండేల్ సినిమాని చరణ్ సినిమాకు పోటీగా విడుదల చేయటానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాని జనవరి 14వ తేదీ విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలబడునుంది. ఇలా అల్లుడు పోటీగా మామ బరిలోకి దిగడంతో ఈ రెండు కుటుంబాల మధ్య భేదాభిప్రాయాలు నిజమేనని అభిమానులు భావిస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!