Connect with us

Featured

Rashmika: రష్మిక ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…. ఇప్పుడు భారీగానే అందుకుంటుందిగా?

Published

on

Rashmika: రష్మిక మందన్న పరిచయం అవసరం లేని పేరు కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినటువంటి రష్మిక తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా తమిళంలోనూ అలాగే హిందీ భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా దూసుకుపోతున్నారు.

ఈమె ఇటీవల తన 28వ పుట్టినరోజు వేడుకలను ఎంత ఘనంగా జరుపుకున్నారు. రష్మికకు సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తన ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి ఒక వార్త సంచలనంగా మారింది. రష్మిక కర్ణాటకలోనే జన్మించి అక్కడే తన విద్యాభ్యాసం పూర్తి చేశారు.

ఇలా కాలేజీ చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు..ఇలా మోడలింగ్ రంగంలో కొనసాగుతున్నటువంటి ఈమెను చూసి కిరిక్ పార్టీ సినిమా అవకాశాలు కల్పించారు. ఈ సినిమా కోసం ఈమె ఏ విధమైనటువంటి ఆడిషన్స్ కూడా నిర్వహించలేదు. ఇక ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి రష్మిక మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

Advertisement

మోడలింగ్ రంగంలో..
ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం కోసం ఈమె తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ కేవలం 1.5 లక్షల రూపాయలు మాత్రమే తీసుకున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో చలో సినిమా అవకాశం వచ్చింది. ఈ సినిమాకు 50 లక్షలు తీసుకున్నటువంటి రష్మిక అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ రెమ్యూనరేషన్ కూడా పెంచుతూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఈమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఒక్కో సినిమాకు ఐదు నుంచి ఏడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకు సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు.

Advertisement

Featured

Allu Arjun: అది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే.. పార్టీలతో నాకు సంబంధం లేదు: అల్లు అర్జున్

Published

on

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కానీ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు తన స్నేహితుడు నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డికి మాత్రం స్వయంగా ప్రచార కార్యక్రమానికి వెళ్లి మద్దతు తెలియజేశారు దీంతో అల్లు అర్జున్ పై భారీ స్థాయిలో ట్రోల్స్ జరుగుతున్నాయి.

తన కుటుంబ సభ్యులు తన మామయ్య అయినటువంటి పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలియజేయకుండా వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ పై విమర్శలు కురిపిస్తున్నారు అయితే నేడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇలా తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ తాను నంద్యాలలో ప్రచార కార్యక్రమాలు చేయడం స్నేహంతోనే చేశానని నాకు పార్టీలతో సంబంధం లేదని తెలిపారు. నా మనసుకు నచ్చితే నా మామయ్య పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతాను అలాగే నా స్నేహితుడికి తెలియజేస్తాను ఇక నా మామయ్య చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు బన్నీ వాసు కావచ్చు ఎవరికైనా నేను సపోర్ట్ చేస్తానని తెలిపారు.

Advertisement

రాజకీయాలలో రాను..
రవితో నాకు 15 సంవత్సరాలుగా పరిచయం ఉంది. తాను ఎన్నికలలో పోటీ చేస్తే డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చాను 2019 సంవత్సరంలో అది కుదరలేదు. అందుకే ఈసారి తన భార్యతో కలిసి వెళ్లి తనకు మద్దతు తెలిపారని వెల్లడించారు. ఇక నాకు ఎలాంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదని తెలిపారు. ఇక మీరు రాజకీయాలలోకి రాబోతున్నారు అనే ప్రశ్న కూడా ఎదురు కావడంతో తనకు రాజకీయాలలోకి వచ్చే ఆలోచన ఏమాత్రం లేదని తెలిపిన అల్లు అర్జున్ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

Advertisement
Continue Reading

Featured

YS Jagan: ఓటు వినియోగించుకోవడం కోసం…పులివెందల బయలుదేరిన జగన్ దంపతులు!

Published

on

YS Jagan: ఏపీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది మరికొన్ని గంటలలో ఎన్నికలు ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. ఇప్పటికే ప్రతి ఒక్క గ్రామంలోనూ ఎన్నికల అధికారులు చేరుకొని ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి వారందరూ కూడా సొంత ఊరికి చేరుకున్నారు.

మరికొన్ని గంటలలో ఎన్నికల ప్రక్రియ మొదలుకానున్నటువంటి తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి పులివెందుల బయలుదేరారు. తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి తన సతీమణి వైయస్ భారతి తో కలిసి నాలుగు గంటలకు పులివెందుల బయలుదేరారు ఇక రెండు రోజులపాటు జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ఉంటారని తెలుస్తోంది.

పులివెందులకు సీఎం..
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున భద్రత చర్యలు చేపట్టారు ఒకవైపు పోలింగ్ ఉండటం మరోవైపు సీఎం వస్తున్నారని విషయం తెలియడంతో పులివెందులలో కట్టదిట్టమైనటువంటి చర్యలు చేపట్టారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ కూడా ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఉండటం కోసం ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను చేపట్టారు.

Advertisement

Continue Reading

Featured

Nagababu: నీ గెలుపు సిద్ధమైంది.. తమ్ముడు గురించి ఎమోషనల్ ట్వీట్ చేసిన నాగబాబు!

Published

on

Nagababu: సినీ నటుడు నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈయన ఈ ఎన్నికలలో కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు కూడా వచ్చాయి కానీ కూటమిలో భాగంగా ఆయనకు టికెట్ రాలేకపోయింది కానీ తన తమ్ముడికి గెలుపు కోసం తన పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు.

ఇకపోతే నాగబాబు సోషల్ మీడియాలో చేసే పోస్టులు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే ఆయన ఎవరినైతే టార్గెట్ చేశారో వారికి సూటిగా ఆ వ్యాఖ్యలు గుచ్చుకునేలా ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత తన తమ్ముడిపై ఉన్నటువంటి చెమట బొట్టులను తుడుస్తూ ఉన్నటువంటి ఫోటోని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ గురించి చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. నిన్ను నమ్మని వాళ్లకోసం ఎందుకు నిలబడతావు అని నేను అడిగితే తను మాత్రం చెట్టును చూపిస్తారు అది తనని నాటిన వారికి మాత్రమే నీడను ఇవ్వదని చెబుతారు. నీపై నిందలు వేసే వారికోసం ఎందుకు నిలబడతావు అని అడిగితే వర్షాన్ని చూపిస్తారు. తనని మొక్కనీ రైతు కంటతడపకుండా పంటనే తడుపుతుందని అప్పటినుంచి అడగటమే మానేశానని నాగబాబు తెలిపారు.

Advertisement

మార్గదర్శకు మెట్టు..
ఆకాశం లాంటి అతని ఆలోచనా విశాలతని అర్ధం చేస్కోడం మొదలెట్టాను..సేనాని మీరు చిందించిన ప్రతి చెమట బొట్టు రేపటితరం ఎక్కబోయే మార్గదర్శపు మెట్టు కాబోతుంది కూటమి రాబోతుంది. సిరా పూసిన సామన్యుడి వేలి సంతకంతో నీ గెలుపు సిద్దమైంది.. విజయీభవ..!అని నాగబాబు చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పవన్ ఫాన్స్ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారని చెప్పాలి ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!