Connect with us

Featured

Bandla Ganesh: తాత తండ్రులు ఉంటే సరిపోదు.. టాలెంట్ ఉండాలి.. గుర్తుపెట్టుకో బ్రదర్.. విజయ్ కి కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేష్?

Published

on

Bandla Ganesh: విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ మాస్ స్పీచ్ తో అందరిని ఆకట్టుకున్నారు. అయితే విజయ్ దేవరకొండ మాట్లాడిన ఈ వ్యాఖ్యలు కొందరు హీరోలను ఉద్దేశించి మాట్లాడారని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇండస్ట్రీలో ఎలాంటి వారసత్వం లేకపోయినా తన టాలెంట్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్నానని పరోక్షంగా విజయ్ దేవరకొండ కొందరు హీరోలకు కౌంటర్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.

Advertisement

Bandla Ganesh: ఇదేంటి బండ్లన్నా.. దిల్ రాజుకు కొడుకు పుడితే మరో నిర్మాతకు విష్ చేశావు.. బండ్ల గణేష్ ను భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ చేసిన ఈ వ్యాఖ్యల పై నిర్మాత నటుడు బండ్ల గణేష్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా విజయ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ తనకు కౌంటర్ ఇచ్చారు.ఈ సందర్భంగా బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తాతలుతండ్రులు ఉంటే సరిపోదు.. టాలెంట్ కూడా ఉండాలి. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్ లా గుర్తుపెట్టుకో బ్రదర్ అంటూ కామెంట్ చేశారు.

Bandla Ganesh: ఎన్నో ర్యాంప్ లు.. వ్యాంప్ వస్తుంటాయి... పూరి ఛార్మిలతో పాటు సెలబ్రెటీలను ఓ రేంజ్ లో ఆడుకున్న బండ్లన్న!

Bandla Ganesh: ఎన్నో ర్యాంప్ లు.. వ్యాంప్ వస్తుంటాయి… పూరి ఛార్మిలతో పాటు సెలబ్రెటీలను ఓ రేంజ్ లో ఆడుకున్న బండ్లన్న!

ఈ విధంగా బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే కొందరు నెటిజెన్లు ఈట్వీట్ పై స్పందిస్తూ బండ్ల గణేష్ ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. బండ్ల గణేష్ విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ తనపై ఇలా కౌంటర్ వేశారనీ కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం బండ్ల గణేష్, రామ్ చరణ్ ఎన్టీఆర్ మహేష్ బాబు ప్రభాస్ కి కౌంటర్ వేశారంటూ ఆయన పై మండిపడుతున్నారు.

ట్రెండ్ అవుతున్న ట్రైలర్..

మొత్తానికి లైగర్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ ఇచ్చిన మాస్ స్పీచ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో పలు చర్చలకు దారితీసింది. మరి ఈ వివాదం ఇంతటితో ఆగుతుందా లేకపోతే ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.ఇకపోతే ఈయన నటించిన ఈ లైగర్ సినిమా వచ్చేనెల 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇక ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు పెంచాయి.

Advertisement

Advertisement

Featured

KTR: సమంత నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణం… కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!

Published

on

KTR: తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేటీఆర్ పై భారీ స్థాయిలో విమర్శలు చేశారు. సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కారణం కేటీఆర్ అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

కేటీఆర్ కు డ్రగ్స్ అలవాటు ఉంది. ఆయన ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీలకు కూడా డ్రగ్స్ అలవాటు చేసి వారిని రేవ్ పార్టీలకు పిలిచి వారిని బ్లాక్ మెయిల్ చేసేవారు. అందుకే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ అందరూ కూడా త్వరగా పెళ్లిళ్లు చేసుకుని ఇండస్ట్రీకి దూరమవుతున్నారని కొండా సురేఖ వెల్లడించారు.

ఇలా కేటీఆర్ డ్రగ్స్ కు బానిసయి సెలబ్రిటీలకు డ్రగ్స్ ఇస్తున్నారనే విషయం సినిమా ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు అంటూ ఈ సందర్భంగా కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్స్ ఈ వ్యాఖ్యలపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ప్రేమించుకొని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న నాగచైతన్య సమంత మూడేళ్ల తర్వాత విడాకులు తీసుకొని విడిపోయారు.

డ్రగ్స్ అలవాటు..
వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడంతో వీరి విడాకులకు గల కారణాలు ఏంటి అనే విషయం గురించి స్పష్టత లేకపోయినా అప్పట్లో విడాకులకు ఇదే కారణం అంటూ ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి. ఇక విడాకుల తర్వాత నాగచైతన్య మరొక నటి శోభిత ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన సమంత మాత్రం ఇప్పటికే సింగిల్గానే ఉంటూ కెరియర్ పై ఫోకస్ పెట్టారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: హీరో కార్తీ లడ్డు వివాదంపై మరోసారి స్పందించిన పవన్… నాకు బ్రదర్స్ అంటూ!

Published

on

Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు విషయంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. తిరుపతి లడ్డు తయారీలో కల్తీ జరిగింది అనే విషయం తెలియడంతో ఈయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. నేడు ఈ దీక్షను విరమించారు. ఇలా 11 రోజులపాటు కొనసాగిన ఈ దీక్షలో భాగంగా ఈయన పెద్ద ఎత్తున సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ కామెంట్లు చేశారు.

Advertisement

ఇకపోతే తిరుపతి లడ్డు వ్యవహారం ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఈయన హీరో కార్తీ కి వార్నింగ్ ఇవ్వడం ఆయన క్షమాపణలు చెప్పడం మనకు తెలిసిందే. అయితే తాజాగా మరోసారి కార్తీక్ లడ్డు వ్యవహారం గురించి ఈయనకు ఓ తమిళ మీడియా ప్రశ్నలు వేసింది. ఈ ప్రశ్నకు పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు.

హీరో కార్తీ సూర్య ఇద్దరు నాకు బ్రదర్స్ లాంటివారు వారు కూడా ఎంతో భక్తి భావం కలిగిన వాళ్ళే వారు తిరుమల రావడం కూడా నాకు తెలుసు. అయితే ఆరోజు కార్తి లడ్డు గురించి మాట్లాడుతూ ఇదొక సెన్సిటివ్ విషయం అని చెప్పారు. దాంతో పక్కన ఉన్న వారందరూ కూడా నవ్వారు. మనం సెలబ్రిటీలం మనం ఏది మాట్లాడితే అదే అందరూ ఫాలో అవుతారు. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని చెప్పాను.

కావాలని అలా మాట్లాడలేదు..
ఆ సమయంలో కార్తీగారు కావాలని అలా మాట్లాడలేదు.. కానీ ఆయన అనుకోకుండా అలా మాట్లాడేశారు అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు.. కోలీవుడ్ ఇంట్రెస్ట్ లో చాలామంది హీరోలు నాకు బ్రదర్స్ లాంటివారని ఈ సందర్భంగా పవన్ తమిళంలో మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

https://x.com/CinemaWithAB/status/1841158035122897115?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1841158035122897115%7Ctwgr%5Ef0dae7d22344a6320466ce3534c303de2baad5c8%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Ftelugu-news%2Fmovies%2Fpawan-kalyan-reacts-again-on-karthi-regarding-tirumala-laddu-issue-871172.html

Advertisement
Continue Reading

Featured

Prabhas: వామ్మో ప్రభాస్ తో ఉంటే చెడిపోవడం ఖాయం.. స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు!

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల ఈయన కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా మంచి విజయం కావడంతో ఈయన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఇక ప్రభాస్ సినిమా షూటింగ్లో ఉంటే కనుక అక్కడ ఉన్న ఆర్టిస్టులకు పండగ అని చెప్పాలి.

Advertisement

చిన్న పెద్ద అనే తేడా లేకుండా షూటింగ్ లొకేషన్లో ఉన్నటువంటి వారందరికీ ఒకే రకమైన ఆహార పదార్థాలను తెప్పించి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటారు. ఇక ప్రభాస్ ఫుడ్ తోనే అందరిని చంపేస్తారంటూ ఎంతో మంది సెలబ్రిటీలు ఈయన ఇచ్చే ఆతిథ్యం గురించి ఎంతో గొప్పగా చెప్పారు.

ఇకపోతే తాజాగా నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే.. ఈ సినిమా ద్వారా వీరిద్దరి మధ్య ఎంతో మంచి స్నేహబంధం పెరిగిపోయిందని పృథ్విరాజ్ పలు సందర్భాలలో వెల్లడించారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన మరోసారి ప్రభాస్ తో స్నేహం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

చెడిపోతాము..

Advertisement

ప్రభాస్ తో స్నేహం చేస్తూ ఆయన పక్కన ఉంటే కనుక చెడిపోతామని తెలిపారు. అయితే చెడు వ్యసనాల ద్వారా కాదని ఆయన పెట్టే ఫుడ్డు తిని మనం కూడా చెడిపోతామని పృథ్విరాజ్ వెల్లడించారు. ప్రభాస్ ఎన్నో రకాల ఆహార పదార్థాలను స్వయంగా ఇంటి నుంచి తయారు చేయించి తెప్పిస్తారు వాటన్నింటినీ కనుక మనం తింటే వేరే పనులపై దృష్టి పెట్టలేమని తద్వారా ఫిట్నెస్ కోల్పోతామని ఈ సందర్భంగా ప్రభాస్ ఫుడ్ గురించి పృథ్విరాజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!