Featured
Indra Movie: ఇంద్రా సినిమాలో ఆ డైలాగ్ విని చిరంజీవి గిఫ్ట్ ఇచ్చారు.. పరుచూరి కామెంట్స్ వైరల్?
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1719738859)
Published
2 years agoon
By
lakshanaIndra Movie: తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా, దర్శకుడిగా, నటులుగా పరుచూరి బ్రదర్స్ కు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఎన్నో అద్భుతమైన డైలాగులను సినిమా కథలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత వీరికి ఉంది. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
![Chiranjeevi gave a gift after listening that dialogue in Indra movie Paruchuri comments viral](http://telugudesk.net/wp-content/uploads/2022/06/Collage-Maker-28-Jun-2022-01.17-PM.jpg)
Chiranjeevi gave a gift after listening that dialogue in Indra movie Paruchuri comments viral
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్ని కృష్ణ సిద్ధం చేసిన ఈ కథను బి.గోపాల్ వినిపించగా వీరిద్దరు సినిమా చేయటానికి ఒప్పుకోలేదు.అనంతరం చిన్నికృష్ణ ఫ్లాష్ బ్యాక్ కొన్ని మార్పులు చేయడంతో బి.గోపాల్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అశ్వినీదత్ ఒప్పుకోలేదు. ఇకపోతే ఈ సినిమాని చిరంజీవి గారికి వినిపించడంతో తాను ఈ సినిమా చేస్తానని అయితే కొన్ని యాక్షన్ డైలాగ్స్ తగ్గించి రాయాలని సూచించారు.
![Chiranjeevi gave a gift after listening that dialogue in Indra movie Paruchuri comments viral](http://telugudesk.net/wp-content/uploads/2022/06/Collage-Maker-28-Jun-2022-01.16-PM.jpg)
Chiranjeevi gave a gift after listening that dialogue in Indra movie Paruchuri comments viral
చిరంజీవి చెప్పిన విధంగానే యాక్షన్ డైలాగ్స్ తగ్గించి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాము. అయితే ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తి చేసుకున్న తర్వాత చిరంజీవి మాట్లాడుతూ 80 శాతం షూటింగ్ పూర్తయింది ఇక ఇరవై శాతం షూటింగ్ లో మీ ఇష్టం వచ్చిన డైలాగ్స్ రాయండి అని చెప్పారు. ఆయన అలా చెప్పేసరికి మొక్కే కదా అని పీకేస్తే నీ పీక కోస్తా… రాననుకున్నావా రాలేననుకున్నావా అనే డైలాగ్స్ రాసి మెగాస్టార్ గారికి వినిపించాను.
సెల్ ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చారు…
ఈ డైలాగ్స్ విన్న ఆయన అశ్విని దత్ ను పిలిపించి ఆయనకు ఒక ఖరీదైన సెల్ ఫోన్ చూపించి ఒక గంటలో ఇలాంటి ఫోన్ పరుచూరి గారి చేతిలో ఉండాలి అని తనకు బహుమానంగా ఇచ్చారని గోపాలకృష్ణ తెలిపారు. ఇక ఈ సినిమా వేడుకల్లో భాగంగా అభిమానులు ఎప్పుడో చిరంజీవి గారిని వేదికపై ఒక స్టెప్ వేయాలని అడిగేవారు అలాంటిది ఈ సినిమా వేడుకలో డైలాగ్ చెప్పాలని అడిగారు. అంతగా ఇంద్ర సినిమాలో డైలాగులు ఫేమస్ అయ్యాయని ఈ సినిమా గురించి గోపాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
You may like
Chiranjeevi: కోట్లు సంపాదించిన నాది మిడిల్ క్లాస్ మెంటాలిటీనే… చిరంజీవి కామెంట్స్ వైరల్!
Chiranjeevi: సుమ మా ఇంట్లో దొంగతనం చేసింది.. అందరి ముందు పరువు తీసిన చిరు!
Radha: ఆ పాటకు చిరుతో డాన్స్ చేయాలంటే కష్టంగా అనిపించింది: రాధా
Uday Kiran: చిరంజీవి.. ఉదయ్ కిరణ్ కు గాడ్ ఫాదర్ .. ఉదయ్ సోదరి కామెంట్స్ వైరల్!
Chiranjeevi: హీరోయిన్ త్రిషకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్.. సంతోషంలో తేలిపోతున్న నటి?
Chiranjeevi: వామ్మో చిరంజీవి కట్టుకున్న వాచ్ ధర అన్ని లక్షలా.. చూడటానికి సింపుల్ గానే ఉందే!
Featured
NTR: చిరంజీవి ఇచ్చిన అవార్డును ఆ హీరో ఇంటికి పంపిన తారక్.. ఏమైందంటే?
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1719738859)
Published
12 seconds agoon
3 July 2024By
lakshanaNTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు ఎన్టీఆర్. ఈయన బాల నటుడి గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి చిన్న వయసులోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న తారక్ గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమా ఎలాంటి సక్సెస్ అయ్యిందో మనకు తెలిసిందే .ఈ సినిమాకు గాను ఈయనకు స్టార్ మా అవార్డు అందుకున్నారు అయితే ఈ అవార్డు ప్రముఖ నటుడు చిరంజీవి నాగార్జున చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. అయితే ఈ అవార్డును తీసుకున్న తారక్ ఇంట్లో పెట్టుకోకుండా వేరే హీరోకి పంపించారని తెలుస్తోంది.
ఇలా స్టార్ హీరో చిరంజీవి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకున్నటువంటి ఈయన వేదికపై మాట్లాడుతూ తాను చిన్నప్పటినుంచి చిరంజీవి గారు నాగార్జున బాబాయ్ సినిమాలను చూస్తూ తాను పెరిగానని తెలిపారు. ఇక ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ నటుడు శోభన్ బాబు మరణించారనే వార్త తెలియడంతో తనకు వచ్చిన ఈ అవార్డు శోభన్ బాబు గారి ఇంట్లో ఉండాలని నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్ ఆ అవార్డును తన ఇంటికి పంపించారు.
శోభన్ బాబు ఇంటికి..
ఆ క్షణం ఎన్టీఆర్ తీసుకున్న ఆ నిర్ణయానికి చిరంజీవి సైతం ఫిదా అవ్వడమే కాకుండా ఎన్టీఆర్ పై ప్రశంశల వర్షం కురిపించారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Featured
YS Sharmila: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన షర్మిల.. కారణం అదేనా?
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1719738859)
Published
2 mins agoon
3 July 2024By
lakshanaYS Sharmila: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కలిశారు. ఇటీవల హైదరాబాద్ లోనే ఉంటున్న ఈమె తెలంగాణ ముఖ్యమంత్రిని కలవడమే కాకుండా తన తండ్రి జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆమె తనకు ఆహ్వానం అందజేశారు. జులై 8వ తేదీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి అనే సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈసారి వైయస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఇన్ని రోజులపాటు జగన్మోహన్ రెడ్డి షర్మిల ఎవరికి వారు వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేసి తన తండ్రికి నివాళులు అర్పించేవారు.
ఇటీవల జగన్మోహన్ రెడ్డి నుంచి షర్మిల దూరంగా వెళ్లడమే కాకుండా ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో ఈసారి జరగబోయే జయంతి వేడుకలను షర్మిల ఘనంగా జరిపించడమే కాకుండా కాంగ్రెస్ పెద్దలను కూడా ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జూలై 8వ తేది విజయవాడలోని CK కన్వెన్షన్ సెంటర్ లో జరిగే రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానించారు.
ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు..
జులై 8వ తేదీ జరగబోయే ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ , లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర AICC పెద్దలతో పాటు .. ఏపి, తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల నాయకులు, ప్రముఖులు హాజరు కానున్నారు.
Featured
YS Jagan: నెల్లూరు జైలుకు వైయస్ జగన్.. ఆ వైసీపీ నేతతో మూలఖత్?
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1719738859)
Published
3 mins agoon
3 July 2024By
lakshanaYS Jagan: వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జులై 4వ తేదీ నెల్లూరు జైలుకు వెళ్లబోతున్నారు. నెల్లూరు జైలులో రిమాండ్ లో ఉన్నటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈయన పరామర్శించడానికి వెళ్తున్నారు. పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈయనకు 14 రోజులపాటు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం నెల్లూరు జైలులో ఉన్నారు. ఈ క్రమంలోనే పిల్లలతో ఇప్పటికే కొంతమంది వైసీపీ కీలక నేతలు మూలాఖత్ అయ్యారు. అయితే తాజాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం నెల్లూరు జైలుకు వెళ్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించబోతున్నట్లు తెలుస్తోంది.
జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో విజయం తమదేనని చాలా ధీమా వ్యక్తం చేశారు కానీ ఫలితాలు ఊహించిన విధంగా రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఈ విషయం నుంచి ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నారని తెలుస్తోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను తిరిగి పరామర్శించడానికి అలాగే ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలని కేడర్ కి సూచించడమే కాకుండా కార్యకర్తలకు అండగా ఉండాలని కూడా తెలిపారు.
పిన్నెల్లితో మూలాఖత్…
ఇక త్వరలోనే తాను ప్రజలలోకి రాబోతున్నానని జగన్ వెల్లడించారు. ఈ తరుణంలోనే ముందుగా అరెస్టయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈయన పరామర్శించబోతున్నారు. ఇన్ని రోజులపాటు బెంగళూరులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటీవల తాడేపల్లికి చేరుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక తాడేపల్లి నుంచి నేరుగా నెల్లూరుకు హెలికాప్టర్లో వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గాన జైలుకు వెళ్లబోతున్నారు.
![](https://telugudesk.net/wp-content/uploads/2024/01/jrntr-1686392776.jpg?v=1704202423)
NTR: చిరంజీవి ఇచ్చిన అవార్డును ఆ హీరో ఇంటికి పంపిన తారక్.. ఏమైందంటే?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/sharmila-80x80.jpg?v=1719990357)
YS Sharmila: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన షర్మిల.. కారణం అదేనా?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/ys-jagan-80x80.webp)
YS Jagan: నెల్లూరు జైలుకు వైయస్ జగన్.. ఆ వైసీపీ నేతతో మూలఖత్?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/Ambani-Family-80x80.webp)
Ambani Family: సామూహిక వివాహాలు చేసిన అంబానీ కుటుంబం.. కానుకల లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/chandra-babu-1-80x80.webp)
AP: సచివాలయ సిబ్బందికి మరో బాధ్యత.. ఈసారి ఇంటింటి సర్వే.. బాబు వాడకం మామూలుగా లేదు?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/nallari-kirankumarireddy-80x80.png?v=1717917965)
Nallari Kiran Kumar Reddy : ఏపీలో దురదృష్టవంతుడంటే ఆయనే.. అంత సునామీలోనూ ఓటమి..
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/Ramoji_Rao-80x80.jpg?v=1717817310)
Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/modi30-80x80.png?v=1717916702)
Modi 3.0 : ఏపీకి ఐదు కేంద్ర మంత్రి పదవులు.. ఎవరెవరికంటే..
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/ysjagan-80x80.png?v=1717659232)
YS Jagan : పడి లేచిన కెరటమవుతారా? పత్తా లేకుండా పోతారా?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/pawan-kalyan-80x80.jpg?v=1717758472)
Pawan Kalyan: నరేంద్ర మోడీకి తన కొడుకుని పరిచయం చేసిన పవన్… సంతోషంలో ఫ్యాన్స్?
Trending
- Featured3 weeks ago
Nallari Kiran Kumar Reddy : ఏపీలో దురదృష్టవంతుడంటే ఆయనే.. అంత సునామీలోనూ ఓటమి..
- Featured4 weeks ago
Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!
- Featured3 weeks ago
Modi 3.0 : ఏపీకి ఐదు కేంద్ర మంత్రి పదవులు.. ఎవరెవరికంటే..
- Featured4 weeks ago
YS Jagan : పడి లేచిన కెరటమవుతారా? పత్తా లేకుండా పోతారా?
- Featured4 weeks ago
Pawan Kalyan: నరేంద్ర మోడీకి తన కొడుకుని పరిచయం చేసిన పవన్… సంతోషంలో ఫ్యాన్స్?
- Featured5 days ago
Ali: ఇప్పుడు ఎన్నికలు పెట్టిన ఆయన సీఎం నేను హోమ్ మినిస్టర్ అవుతా: అలీ
- Featured4 weeks ago
Hema: సినీనటి హేమకు భారీ షాక్.. జ్యూడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు!
- Featured4 weeks ago
YS Jagan & Sharmila : అన్నాచెల్లి కలుస్తారా? ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్..