Connect with us

Featured

YS Jagan & Sharmila : అన్నాచెల్లి కలుస్తారా? ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్..

Published

on

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరంటారు.. కానీ ఇది రాజకీయపరమైన వైరం కాదే.. కుటుంబపరమైన వైరం. కలతలు వస్తేనే కలవడం కష్టం. అలాంటిది అన్నీ లాగేసి రోడ్డున నిలబెట్టిన అన్నను షర్మిల క్షమించగలదా? తిరిగి అన్నకు అండగా నిలవగలదా? రాజన్న బిడ్డనంటూ జనంలోకి వచ్చి మాత్రం షర్మిల సాధించిందేముంది? కనీస జనాదరణ పొందారా? కనీసం ఆమె పుట్టిన గడ్డైనా ఆమెను ఆదరించిందా? సొంత గడ్డపై పోటీ చేసి నవ్వుల పాలయ్యారు. కడప పార్లమెంటు నుంచి పోటీ చేసి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఇంత ఘోర పరాజయం షర్మిలను కదిలించలేకపోవచ్చు కానీ ఆమె కుటుంబ చరిత్రకు ఒక రెడ్ మార్క్ పడినట్టే కదా? పీసీసీ చీఫ్‌గా ఉండి ఏపీలో ఒక్కటంటే ఒక్క సీటును సాధించలేకపోవడం ఆమె కుటుంబ చరిత్రకే పెద్ద మచ్చ. షర్మిల పగ్గాలు చేపట్టాక జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం 2 కంటే తక్కువకు పడిపోయింది. వైసీపీ దారుణ పరాజయంతో ఆ పార్టీలోని కొందరు నేతలకు మరింత సంకట స్థితి ఏర్పడింది. ఎన్డీఏ కూటమి వైపు కూడా ఈ నేతలెవరూ చూసే పరిస్థితి లేదు. పోనీ కాంగ్రెస్‌లోకి వెళదామా? అంటే దానికంటే రాజకీయ సన్యాసం బెటరన్న ఆలోచనలో ఉన్నారు.

కుటుంబ చరిత్రకే ఇది అవమానం..

కనీసం ఓట్లకు కూడా షర్మిల గండి కొట్టలేకపోయారు. షర్మిల సాధించింది ఈ ఎన్నికల్లో ఒక్కటే ఒక్కటే కొన్ని చోట్ల ముస్లిం ఓట్లకు గండి కొట్టి అన్న జగన్‌పై పగ అయితే తీర్చుకోగలిగారు. ఇప్పుడు సమస్య ఏంటంటే.. జగన్ పరిస్థితి కూడా షర్మిలకు ఏమాత్రం తీసిపోదు. గత ఎన్నికల్లో 151 స్థానాలు గెలుచుకుని గర్వంగా కాలర్ ఎగురవేసిన జగన్.. ఐదేళ్లు తిరిగే సరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పడిపోయారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. నిజానికి జగన్ కుటుంబ చరిత్రకే ఇది అవమానం. అన్నా చెల్లెళ్లిద్దరూ కుటుంబ చరిత్రను మంటగలిపారు. ఇద్దరూ విడిపోయి సాధించింది ఇంతకు మించి ఏమీ లేదు. అసలు ఇప్పుడు ఆస్తి కోసం చెల్లిని ఇంటి నుంచి బయటకు గెంటిన జగన్ ఇప్పుడు రిగ్రెట్ ఫీలవుతారా? చెల్లితో కలిసుంటే తల్లి విజయమ్మ కూడా ఆయనతో ఉండేవారు. ఈ కష్టకాలంలో ఆయనకు కాస్త అండ దొరికేది. జగన్, షర్మిల ఇద్దరూ ఒకే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఒకరి విలువ మరొకరు తెలుసుకునే అవకాశం ఉందా? అనేది చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తల్లి, చెల్లి ఇద్దరూ గుర్తొస్తున్నారట..

ఇన్నాళ్లు అన్నాచెల్లెల్లిద్దరి మధ్య ఆస్తి గొడవల కారణంగా నేరుగా మాట్లాడుకోవడమే మానేశారు. ఇప్పుడు పరిస్థితి బాగోలేదు కాబట్టి షర్మిలకు ఏం కావాలో అది ఇచ్చేయాలని జగన్ అనుకుంటున్నారా? త్వరలో ఆస్తుల పంపకాలు షురూ అవుతాయా? అనే ప్రశ్నలు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి. వాస్తవానికి అన్నాచెల్లెల్లిద్దరి మధ్య భారతీరెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి దూరం పెంచారని టాక్. భారతీ రెడ్డిని పక్కనబెడితే సజ్జలకేంటి ప్రయోజనం అంటారా? నంబర్ గేమ్.. జగన్ తర్వాత తానే నంబర్ 2గా ఉండాలనే ఆరాటం. ఆ ఆరాటంతోనే సకల శాఖలకు ఆయనే మంత్రిగా వ్యవహరించి మొత్తానికి పార్టీనే మట్టిలో కలిపేశారు. ఇప్పుడు ఏపీలో వైసీపీ పాయే… కాంగ్రెస్ పాయే.. మొదలెత్తుకుంటే కానీ ముందుకు జరగదు. ఈ తరుణంలో జగన్ మెడకు కేసుల ఉచ్చు తిరిగి బిగించుకోకా మానదు. మరి జగన్ జైలుకు వెళ్తే పార్టీ బాధ్యతలను తిరిగి తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల తీసుకుంటారా? మొత్తానికి జగన్‌కు అయితే ఇప్పుడు తల్లి, చెల్లి ఇద్దరూ గుర్తొస్తున్నారట. కష్టాలొచ్చేసరికి కన్నవాళ్లు.. తోడబుట్టినది కనిపిస్తున్నారట. మరోవైపు షర్మిలకు కూడా కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ తరుణంలో ఆమె కూడా అన్నే దిక్కు అనుకునే అవకాశం ఉంది. ఇక చూడాలి ఏం జరుగుతుందో..

Advertisement
Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!