Connect with us

Featured

గొంతు నొప్పి సమస్యతో బాధపడుతున్నారా… కొబ్బరి నూనెతో ఇలా చేయండి?

ప్రస్తుతం వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకోవడం వల్ల మనలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది వర్షాకాలంలో

Published

on

Advertisement

ప్రస్తుతం వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకోవడం వల్ల మనలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది వర్షాకాలంలో దగ్గు జలుబు వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. ముఖ్యంగా అధికంగా దగ్గు రావడం వల్ల గొంతులో నొప్పిగా ఉంటుంది.ఈ గొంతు నొప్పి కారణంగా మాట్లాడటానికి లేదా ఏదైనా తినడానికి ఎంతో ఇబ్బంది పడుతుంటారు. మరి ఈ విధంగా గొంతు నొప్పి సమస్యతో బాధపడేవారు ఈ కొబ్బరినూనె చిట్కాలు పాటించి తొందరగా గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందండి.

కొబ్బరినూనె ఎంతో సహజసిద్ధమైనది. ఈ కొబ్బరి నూనెలో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, పాలీఫెనాల్స్, విటమిన్ ఇ, విటమిన్ కె ఆమ్లాలు పాలీఫెనాల్స్, ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడటానికి కీలకపాత్ర పోషిస్తాయి. అందుకోసమే వంటలలో కూడా కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతుంటారు.

ముఖ్యంగా గొంతు నొప్పి సమస్యతో బాధపడేవారు రెండు నుంచి మూడు టీ స్పూన్ల కొబ్బరి నూనెను నోటిలో వేసుకొని నెమ్మదిగా గార్గ్లింగ్ చేయాలి. అయితే కొబ్బరి నూనెను మనం మింగకూడదు. ఇలా నెమ్మదిగా
గార్గ్లింగ్ చేయటం వల్ల నోటిలో ఉన్న బ్యాక్టీరియా తొలగిపోయి మనకు గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

Advertisement

ఈ విధంగా గార్గ్లింగ్ చేయటం వల్ల గొంతులో ఉన్నటువంటి బ్యాక్టీరియా తొలగిపోయి గొంతు వాపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సాధారణంగా గొంతు నొప్పితో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసుకుని గార్గ్లింగ్ చేస్తారు. అలా చేసినప్పటికీ గొంతు నొప్పి తగ్గకపోతే కొబ్బరి నూనెను ఉపయోగించాలి. కొబ్బరి నూనెతో కూడా గొంతు నొప్పి సమస్య తగ్గకపోతే ఒకసారి వైద్యుని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ఎంతో ఉత్తమం.

Advertisement

Featured

Samantha: కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సమంత…అండగా నిలిచారంటూ?

Published

on

Samantha: సినీ నటి సమంత ఇటీవల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈమె తన రాజకీయాలలో భాగంగా సమంత అక్కినేని కుటుంబం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా కొండ సురేఖ వార్తలలో నిలవడమే కాకుండా నాగార్జున ఈమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ విధంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సమంతతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం స్పందిస్తూ ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక అప్పట్లో సమంత ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. తాజాగా మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ.. సౌత్ సినీ ఇండస్ట్రీ అండగా నిలిచి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇండస్ట్రీ ప్రజలు చూపించిన ఈ ప్రేమే నన్ను ఈ వివాదం నుంచి బయటపడేలా చేసింది. లేకుంటే మరింత కృంగిపోయే దానిని. అందరి సపోర్ట్ వల్లే తిరిగి మీ ముందు కూర్చున్నాను అంటూ ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇండస్ట్రీ సపోర్ట్..
కొండా సురేఖ సమంత గురించి తప్పుగా మాట్లాడటమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ గురించి సంచలన ఆరోపణలు చేశారు. సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ ఈమె వారి గురించి మాట్లాడటంతో అప్పట్లో తెలంగాణ రాజకీయాలలోనూ,సినీ ఇండస్ట్రీలోనూ ఈ విషయం సంచలనంగా మారింది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Samantha: నాగచైతన్య ప్రతి జ్ఞాపకాన్ని కాల్చేసిన సమంత.. ఆ ఒక్కటి భద్రంగా ఉంచుకుందా?

Published

on

Samantha: సినీ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత తన వ్యక్తిగత కారణాలు అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లకు కమిట్ అయ్యారు.

Advertisement

ఇక సమంత వ్యక్తిగత విషయానికి వస్తే నటుడు నాగచైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం పాటు కొనసాగ లేకపోయారు. సమంత నాగచైతన్య ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను చూపించుకునేవారు. అయితే వీరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇలా విడాకులు తీసుకున్న తర్వాత సమంత నాగచైతన్యకు సంబంధించిన జ్ఞాపకాలు అన్నిటిని కూడా చెరిపివేసింది. ఇలా తాను ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని వెనక్కి పంపియడమే కాకుండా తన మెడలో తాళిని కూడా వెనక్కి తిరిగి ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలన్నింటినీ కూడా కాల్చేసిన సమంత ఒకే ఒక గిఫ్ట్ మాత్రం భద్రంగా పెట్టుకున్నారని తెలుస్తుంది.
పెళ్లి ఫోటో..
మరి సమంత భద్రంగా దాచుకున్న ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే.. నాగచైతన్య సమంత పెళ్లిలో దిగిన ఫోటోని భద్రంగా దాచి ఉంచారని తెలుస్తోంది. తన పెళ్లిలో తన తల్లిదండ్రులతో పాటు నాగచైతన్య సమంత కలిసి దిగిన ఫోటో అంటే తనకు చాలా ఇష్టమని గతంలో పలు సందర్భాలలో సమంత తెలిపారు. ఆ ఫోటోని మాత్రం అలాగే భద్రంగా ఉంచుకున్నారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Bahubali 3: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలోనే బాహుబలి 3..హింట్ ఇచ్చిన నిర్మాత!

Published

on

Bahubali 3: ప్రభాస్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ హీరోగా బాహుబలి సినిమా గుర్తింపు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే త్వరలోనే బాహుబలి త్రీ కూడా రాబోతోంది అంటూ తాజాగా నిర్మాత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో బాహుబలి 3 గురించి ప్రభాస్ రాజమౌళి మాట్లాడిన ఇప్పుడే అలాంటి ఆలోచనలేమీ లేవని తెలిపారు.

ఇకపోతే తాజాగా కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల బాహుబలి నిర్మాతలతో కలిసి మాట్లాడానని అయితే వారు బాహుబలి 3 కూడా ఉండబోతోందని తెలిపారంటూ జ్ఞానవేల్ రాజా వెల్లడించారు.

బాహుబలి 3..
ఇలా బాహుబలి నిర్మాతలు పార్ట్ 3 కూడా ఉండబోతుందని చెప్పారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రభాస్ ఈ సినిమా చేసిన ఇప్పట్లో రాదని తెలుస్తుంది. ఇప్పటికే ఈయన సుమారు ఐదు పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి వరుస షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాతనే బాహుబలి త్రీ గురించి ఆలోచిస్తారని అభిమానులు చర్చలు జరుపుకుంటున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!