Connect with us

Featured

బామ్మ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నిర్మలమ్మ.. అలాంటి గొప్ప నటీమణి మళ్ళీ ఇండస్ట్రీకి దొరకడం కష్టమే..

Published

on

సినిమా ఇండస్ట్రీలో కళామతల్లి ఆశీస్సులు దక్కడం అంటే ఎంతో అదృష్టం. సినిమా ఇండస్ట్రీకి రావాలని మంచి నటీ నటులుగా నిలబడాలని తాపత్రయపడేవారు ఎంతోమంది. కానీ, అందరికి ఆ అవకాశం రాదు. వచ్చినా ఇంతపెద్ద భారీ పోటీలో నిలబడి నెగ్గడం చాలా కష్ఠం. అప్పటివారు అనుకుంటారు.. ఈ తరం నటీ నటులకు చాలా సులభంగా అవకాశాలు వస్తున్నాయని. ఇప్పటివారు అనుకుంటున్నారు అప్పట్లోనే సినిమాలలో అవకాశాలు చాలా సులభంగా  దక్కించుకున్నారని. కానీ ఎప్పుడు ఉండే పోటీ..కష్ఠం అప్పుడున్నాయి.

Advertisement

బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలంలో నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు నిర్మలమ్మ. అప్పట్లో ఆమెకున్న అందానికి హీరోయిన్‌గా చేయడానికే ఎక్కువ ఆస్కారం ఉంది. కానీ, కళామతల్లి ఒక్కొక్కరిని ఒక్కోలా వరిస్తుంది. అలా నిర్మలమ్మను అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాపులర్ అయ్యేలా చేసింది. 800 వందల సినిమాలలో గొప్ప పాత్రలు చేసిన నిర్మలమ్మ సహజ నటిగా పేరు తెచ్చుకున్నారు. పాత్ర ఏదైనా తన నటనతో సహజత్వాన్ని తీసుకువచ్చిన నటి. అప్పట్లో సినిమా ఏదైనా నిర్మలమ్మకు ఓ పాత్ర ఉండాల్సిందే.

నిర్మలమ్మ అంటే అందరికీ బాగా గుర్తొచ్చే పాత్రలు బామ్మ పాత్రలే. ఎన్ని సినిమాలలో నిర్మలమ్మ బామ్మ పాత్ర చేసినా దానికి బాగా పేరొచ్చింది. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్, మాయలోడు, స్నేహం కోసం లాంటి సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి – నిర్మలమ్మ మధ్య వచ్చే సన్నివేశాలు ఏ రేంజ్‌లో ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. ఇక స్నేహం కోసం సినిమాలో చిరంజీవికి తల్లిగా, బామ్మగా అద్భుతంగా నటించారు. ఇందులో సెంటిమెంట్ పాత్రతో పాటు, మంచి కామెడీ రోల్ చేసి నవ్వించారు.. ఏడిపించారు. కొడుకు జైలు నుంచి వచ్చిన సందర్భంలో ఆమె పలికించిన హావా భావాలు అందరి మనసులో అలా నిలిచిపోయాయి.

చినరాయుడు సినిమాలో వెంకటేశ్ తల్లిగా నటించిన నిర్మలమ్మ ఎమోషనల్ సీన్స్‌లోనూ, అలాగే విజయశాంతితో కలిసి కనిపించిన కామెడీ సీన్స్‌లోనూ ఎంతగా ఆకట్టుకున్నారో తెలిసిందే. ఎగిరేపావురమా సినిమాలో జేడి చక్రవర్తి – లయ కి బామ్మగా నటించిన నిర్మలమ్మ ఇందులో చెవుడున్న పాత్రలో కనిపించి కడుపుబ్బా నవ్వించారు. ఆపద్భాంధవుడు, మాయలోడు, పండుగ, కిల్లర్, బావ బావమరిది, పేకాట పాపారావు, ఆలీబాబా అరడజను దొంగలు, శుభ సంకల్పం, మావి చిగురు, ఆహ్వానం, రాయుడు సీతారామరాజు, ప్రేమకు స్వాగతం..ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో అద్భుతమైన పాత్రల్లో కనిపించి తనదైన శైలి నటనతో ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారు.

ఇప్పుడున్న నటీమణుల్లో నిర్మలమ్మ లాంటి గొప్ప నటిమణి భూతద్దం పెట్టి వెతికినా దొరకదు అని సందేహం లేకుండా చెప్పవచ్చు. ఆవిడ పోషించనటువంటి పాత్రలు మరెవరూ చేయలేదు. అందులోనూ సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే నిర్మలమ్మ అనే నటీమణిని మరొకరు రీప్లేస్ చేయలేరని ఖచ్చితంగా చెప్పవచ్చు. నాటి నుంచి ఆమె చివరి సినిమా వరకు సెట్‌లో ఉన్న సహ నటీ నటులతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ముఖ్యంగా ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ దగ్గర్నుంచి ఈ తరం హీరోలవరకు అందరితోనూ మంచి అనుబంధం ఉంది. అందుకే ఆమెను అందరూ నిర్మలమ్మ అని ఆప్యాయంగా పిలుచుకునేవారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!