‘రంగస్థలం’ కి సీక్వెల్ రానుందట.. ఎప్పుడో తెలుసా..??

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ గా నిలిచింది ‘రంగస్థలం’ చిత్రం..ఈ సినిమాలో చరణ్ ఉత్తమ నటనను కనబరిచాడు.. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు ఇది 2018లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి వీరిద్దరూ మరోసారి కలిసి చేయాలని అభిమానులు కోరుకున్నారు. మీడియాలో వచ్చిన తాజా సమాచారం ప్రకారం..రంగస్థలం-2 సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

రామ్ చరణ్ మరోసారి సుకుమార్‌తో కలిసి పనిచేయాలనుకున్నట్లు సమాచారం. ఇవన్నీ త్వరలో జరుగునున్నాయి.రంగస్థలంలో రామ్ చరణ్ నటనకు చాలా మంచి పేరు వచ్చింది. రంగస్థలంతో జాతీయ మీడియాలోనూ రాంచరణ్ కు గుర్తింపు దక్కింది. ఈ చిత్రం ఖచ్చితంగా నటుడు – దర్శకుడికి ఇద్దరికీ ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది.తన ప్రస్తుత చిత్రం ‘పుష్పా’ను తీసిన వెంటనే సుకుమార్ రామ్ చరణ్ తో కలిసి పని చేస్తాడని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేస్తానన్న సుకుమార్ దాన్ని పక్కనపెట్టి రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రంగస్థలం 2 తీస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.అయితే సుకుమార్- విజయ్ చిత్రం లైవ్ లోనే ఉందని.. ఈ ఊహాగానాలను చిత్ర నిర్మాతలు ఖండించారు, ఎటువంటి మార్పులు లేకుండా ఈ ప్రాజెక్ట్ కొనసాగుతోందని ధృవీకరించారు. కాబట్టి, పుష్పా తర్వాత విజయ్ దేవరకొండ చిత్రంతో సుకుమార్ ముందుకు సాగనున్నారు.

సుకుమార్ విజయ్ సినిమాను చుట్టే సమయానికి, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మరియు దర్శకుడు శంకర్ తో మరో సినిమాను కూడా పూర్తి చేస్తాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ‘రంగస్థలం2’ తీసే చాన్స్ ఉంది. ఈ రెండవ చిత్రం పూర్తికావడానికి దాదాపు రెండు సంవత్సరాలు పడుతుంది. ఇది రంగస్థలం సీక్వెల్ ఉంటుందని మాత్రం టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి…!!