Pawan Kalyan-KTR: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా… ‘ భీమ్లా నాయక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఆశేష పవన్ అభిమానుల మధ్య ఉత్సాహంగా కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమానికి తెలంగాణ రాష్ఱ్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రావడం మరింత ప్రాధాన్యత సంచరించుకుంది. ఓ వైపు పవర్ స్టార్.. మరోవైపు పొలిటికల్ స్టార్ ఇలా ఇద్దరు స్టార్లు ఒకే వేదికపై కలవడం వారి ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
Advertisement
కేటీఆర్ మాట్లాడుతూ… రాజకీయాలు, ప్రభుత్వంతో సంబంధం లేకుండా తనను ఆహ్వానిస్తే ఓ సోదరుడిలా వచ్చానన్నారు మంత్రి కేటీఆర్. పవన్ కల్యాణ్ అందరూ సూపర్ స్టార్లు, సినిమా స్టార్లు మాదిరిగా కాకుండా ఓ విలక్షణమైన హీరో అంటూ కొనియాడారు. కేవలం తన నటనే కాదు విలక్షణమైన శైలీ కలిగిన వ్యక్తి అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఎందరో అభిమానుల్ని, క్రేజ్ని సంపాధించుకువోవడం అసాధారణమైన విజయం అన్నారు. కాలేజీ రోజుల్లో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన తొలిప్రేమ సినిమా చూస్తూ ఎంజాయ్ చేసాం అని చెప్పారు. పాతికేళ్లుగా అదే స్టార్డమ్, అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ని కాపాడుకోవడం పవన్ కల్యాణ్కే సాధ్యమైందన్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈవెంట్కి ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు కేటీఆర్కి కృతజ్ఞతలు తెలిపారు. సినిమా పరిశ్రమకు కులాలు, రాజకీయాలతో సంబంధం లేదన్నారు పవర్ స్టార్. కళాకారులకు కులం, మతం, ప్రాంతం ఉండదన్నారు. గతంలో చెన్నైలో ఉన్న చిత్రపరిశ్రమను హైదరాబాద్కి తెచ్చేందుకు చెన్నారెడ్డి లాంటి పెద్దలు ఎంతో కృషి చేస్తే..ఇప్పుడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో చిత్రపరిశ్రమ మరింత ముందుకు వెళ్తోందన్నారు పవన్ కల్యాణ్.
తనకు సినిమాలు తప్ప వేరే పని తెలియదన్నారు పవన్ కళ్యాణ్. సినిమాల ద్వారా వచ్చిన ఆదరణతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టానన్నారు. సినిమా పరిశ్రమలో నటిస్తూనే డబ్బులు సంపాధించుకుంటున్నానని చెప్పారు. దేశం, రాష్ట్రం, తెలుగు ప్రజలకు ఏమైనా చేయాలన్న ఆలోచనతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టానంటూ రాజకీయ ప్రస్తావన తెచ్చారు పవన్ కల్యాణ్. తన సినిమాని ప్రమోట్ చేసుకోవడం తనకు తెలియదన్న పవన్ కల్యాణ్..భీమ్లానాయక్ అందరికి నచ్చుతుందని చెప్పారు.
Samantha: సినీ నటి సమంత ఇటీవల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈమె తన రాజకీయాలలో భాగంగా సమంత అక్కినేని కుటుంబం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా కొండ సురేఖ వార్తలలో నిలవడమే కాకుండా నాగార్జున ఈమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.
Advertisement
ఈ విధంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సమంతతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం స్పందిస్తూ ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక అప్పట్లో సమంత ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. తాజాగా మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ.. సౌత్ సినీ ఇండస్ట్రీ అండగా నిలిచి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇండస్ట్రీ ప్రజలు చూపించిన ఈ ప్రేమే నన్ను ఈ వివాదం నుంచి బయటపడేలా చేసింది. లేకుంటే మరింత కృంగిపోయే దానిని. అందరి సపోర్ట్ వల్లే తిరిగి మీ ముందు కూర్చున్నాను అంటూ ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇండస్ట్రీ సపోర్ట్.. కొండా సురేఖ సమంత గురించి తప్పుగా మాట్లాడటమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ గురించి సంచలన ఆరోపణలు చేశారు. సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ ఈమె వారి గురించి మాట్లాడటంతో అప్పట్లో తెలంగాణ రాజకీయాలలోనూ,సినీ ఇండస్ట్రీలోనూ ఈ విషయం సంచలనంగా మారింది.
Samantha: సినీ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత తన వ్యక్తిగత కారణాలు అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లకు కమిట్ అయ్యారు.
Advertisement
ఇక సమంత వ్యక్తిగత విషయానికి వస్తే నటుడు నాగచైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం పాటు కొనసాగ లేకపోయారు. సమంత నాగచైతన్య ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను చూపించుకునేవారు. అయితే వీరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.
ఇలా విడాకులు తీసుకున్న తర్వాత సమంత నాగచైతన్యకు సంబంధించిన జ్ఞాపకాలు అన్నిటిని కూడా చెరిపివేసింది. ఇలా తాను ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని వెనక్కి పంపియడమే కాకుండా తన మెడలో తాళిని కూడా వెనక్కి తిరిగి ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలన్నింటినీ కూడా కాల్చేసిన సమంత ఒకే ఒక గిఫ్ట్ మాత్రం భద్రంగా పెట్టుకున్నారని తెలుస్తుంది. పెళ్లి ఫోటో.. మరి సమంత భద్రంగా దాచుకున్న ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే.. నాగచైతన్య సమంత పెళ్లిలో దిగిన ఫోటోని భద్రంగా దాచి ఉంచారని తెలుస్తోంది. తన పెళ్లిలో తన తల్లిదండ్రులతో పాటు నాగచైతన్య సమంత కలిసి దిగిన ఫోటో అంటే తనకు చాలా ఇష్టమని గతంలో పలు సందర్భాలలో సమంత తెలిపారు. ఆ ఫోటోని మాత్రం అలాగే భద్రంగా ఉంచుకున్నారని తెలుస్తోంది.
Bahubali 3: ప్రభాస్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ హీరోగా బాహుబలి సినిమా గుర్తింపు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు.
Advertisement
ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే త్వరలోనే బాహుబలి త్రీ కూడా రాబోతోంది అంటూ తాజాగా నిర్మాత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో బాహుబలి 3 గురించి ప్రభాస్ రాజమౌళి మాట్లాడిన ఇప్పుడే అలాంటి ఆలోచనలేమీ లేవని తెలిపారు.
ఇకపోతే తాజాగా కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల బాహుబలి నిర్మాతలతో కలిసి మాట్లాడానని అయితే వారు బాహుబలి 3 కూడా ఉండబోతోందని తెలిపారంటూ జ్ఞానవేల్ రాజా వెల్లడించారు.
బాహుబలి 3.. ఇలా బాహుబలి నిర్మాతలు పార్ట్ 3 కూడా ఉండబోతుందని చెప్పారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రభాస్ ఈ సినిమా చేసిన ఇప్పట్లో రాదని తెలుస్తుంది. ఇప్పటికే ఈయన సుమారు ఐదు పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి వరుస షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాతనే బాహుబలి త్రీ గురించి ఆలోచిస్తారని అభిమానులు చర్చలు జరుపుకుంటున్నారు.