Connect with us

Featured

Kalki 2: కల్కి 2 లో కృష్ణుడుగా సూపర్ స్టార్ మహేష్ బాబు… క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ నాగీ?

Published

on

Kalki 2: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర భాషలలో కూడా కల్కి సినిమా గురించే చర్చలు జరుగుతున్నాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనమైన విజయం సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

Advertisement

ఇలా ఈ సినిమా అద్భుతమైన విజయం సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా విజయం కావడంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను వెల్లడిస్తున్నారు అయితే ఈ సినిమాలో కృష్ణుడి పాత్రలో నటించిన వ్యక్తి ఎవరు ఏంటి అనే విషయాలు గురించి సరిగా క్లారిటీ లేదు ఆయన ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.

ఈ క్రమంలోనే కృష్ణుడి పాత్రలో నటించినది ఎవరు అనే విషయంపై ఎన్నో సందేహాలు వచ్చాయి. ఇక కల్కి 2 లో కూడా కృష్ణుడికి సంబంధించిన పాత్ర చాలానే ఉండబోతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే రిపోర్టర్స్ కృష్ణుడికి సంబంధించిన పాత్ర గురించి ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో మహేష్ బాబుని కృష్ణుడిగా చూపిస్తే బాగుంటుందని అంటున్నారు.

వేరే సినిమాలలో బాగుంటుంది..

Advertisement

ఈ సినిమాలో మహేష్ బాబుని కృష్ణుడిగా చూసే అవకాశాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు డైరెక్టర్ సమాధానం చెబుతూ బాగుంటుంది అయితే ఈ సినిమాలో కాకుండా ఇతర సినిమాలలో అయితే బాగా సెట్ అవుతుంది అంటూ సమాధానం చెప్పకు వచ్చారు. దీన్నిబట్టి చూస్తుంటే కల్కిలో మహేష్ బాబు ఉండరని స్పష్టంగా అర్థం అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Bigg Boss 8 Telugu: మరోసారి మణికంఠను టార్గెట్ చేసిన హౌస్ మేట్స్.. ఎందుకు ఏడుస్తున్నాడంటూ!

Published

on

Bigg Boss 8 Telugu: తెలుగులో ఇటీవలె వలే గ్రాండ్ గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు చూస్తుండగానే అప్పుడే ఐదవ వారం ఎలిమినేషన్ కు దగ్గర పడింది. నాలుగు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు ఐదవ వారం ఎలిమినేషన్ ప్రక్రియకు చేరువయ్యింది. ఇక ఇప్పటికే హౌస్ లో నుంచి నలుగురు కంటెస్టెంట్లు ఎప్పటిలాగే ఎలిమినేట్ అవ్వగా నిన్నటి రోజున అనగా శుక్రవారం రోజు మిడ్ వీక్ ఎలిమినేషన్స్ లో భాగంగా మరొక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఆ సంగతి పక్కన పెడితే నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ మరోసారి సందడి చేశారు. నిన్నటి ఎపిసోడ్ లో మణికంఠతో పులిహోర కలిపింది యష్మీ.

Advertisement

నిన్న మొన్నటి దాకా ఈ ఇద్దరి మధ్య అస్సలు పడేది కాదు. ఎలాగైనా మణికంఠను హౌస్ నుంచి బయటకు పంపాలని చూసింది యష్మీ. కానీ ఇప్పుడు ప్లేట్ తిప్పేసింది. మణికంఠకి నేనున్నా అంటూ భరోసా ఇచ్చింది యష్మీ, నీ నవ్వు చూసే నీకు పడిపోయా అంటూ మణికంఠకు డైలాగ్స్ కొట్టింది యష్మీ. నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా ఆదిత్య ఎలిమినేట్ అయిపోయిన తర్వాత విష్ణుప్రియ యష్మీ కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు.
ఆదిత్య గారు నన్ను ప్రేరణను ఎంత తిట్టుకున్నారో, మేమిద్దరమే నామినేట్ చేశాం అని చెప్పుకొచ్చింది. ఇంతలో అక్కడికి పృథ్వీ వచ్చి ఏరా డల్‌గా ఉన్నావంటూ యష్మీని అడిగితే, నేనే నామినేట్ చేశాను కదా ఆదిత్య గారిని, దాని గురించే బాధ అని చెప్పింది.

సర్లే ఫీల్ అవ్వకు అని పృథ్వీ అనగానే నువ్వు హ్యాపీయే కదా విష్ణు ఉంది అంటూ సెటైర్లు వేసింది యష్మీ. ఆ తర్వాత హౌస్ మేట్స్ అంతా కలిసి మణికంఠ మీద పడ్డారు. ఫస్ట్ విష్ణుప్రియ స్టార్ట్ చేసింది. అక్కడ మా టెన్షన్‌ లో మేముంటే అప్పుడు కూడా కెమెరాలన్నీ వీడి వైపే ఉండాలి వీడినే అందరూ ఓదార్చాలి అన్నట్లుగా ఏడు పొకటి మొదలు పెట్టాడు అని మణికంఠను ఉద్దేశించి విష్ణుప్రియ అంది. దాంతో మనోడు ఎప్పటి లానే సమాధానం చెప్పాడు. ఏమో నాకు అంతా బ్లాంక్ అయ్యింది రా అని అన్నారు మణి. సైరన్ మోగగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని నువ్వే చెప్పావంటగా ఇంకెందుకు బ్లాంక్ అయ్యావ్? అని నబీల్ అన్నాడు.

ఎందుకలా బిహేవ్ చేస్తావ్ అంటూ..

Advertisement

ఇంతలో సీత అందుకొని ఎందుకు నువ్వు మాటి మాటికి అందరూ నిన్ను ఓదార్చాలి అన్నట్లుగా బిహేవ్ చేస్తావ్? అని అడిగింది. దాంతో సైలెంట్ గా మణి పక్కకు వెళ్ళిపోయాడు. మణికంఠ వెళ్ళిపోయినా తర్వాత మనం ఇంత అర్థం చేసుకున్నా వాడెందుకు మనల్ని అర్థం చేసుకోవట్లేదు.. అందరితో గొడవ పెట్టుకొని.. తిట్టేసి, తర్వాత వాడు కెమెరా ముందుకొచ్చి ఏడుస్తాడు. దాని వల్ల మనం బ్యాడ్ అవుతాం అని సీత చెప్పుకొచ్చింది. దీంతో మొత్తంగా చూసుకుంటే నిన్నటి రోజున జరిగిన ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ అందరూ మణికంఠను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. అసలు మణికంఠ ఎందుకు ఏడుస్తున్నాడు అన్నది అర్థం కాక హౌస్ మేట్స్ అతని గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు.

Advertisement
Continue Reading

Featured

Nagarjuna: నాగార్జునపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్‌.. అసలేం జరిగిందంటే!

Published

on

Nagarjuna: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో అక్కినేని నాగార్జున పేరు కూడా ఒకటి. రెండు రోజుల క్రితం కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీ గురించి సంచలన వాఖ్యలు చేయడంతో అక్కినేని నాగార్జున ఈ విషయంపై తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పరువు నష్ట దావా కూడా వేశారు. అలాగే మొన్నటి వరకు తమ్మిడి కుంట చెరువు దగ్గర Nకన్వెన్షన్‌ కూల్చివేత విషయంలో కూడా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే నాగార్జున పై మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌ చేశారు.

Advertisement

తమ్మిడికుంట చెరువు కబ్జాచేసి Nకన్వెన్షన్‌ నిర్మించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి. నాగార్జునపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని భాస్కరరెడ్డి పోలీసులను కోరారు. దాంతో లీగల్‌ ఒపీనియన్‌ కు పంపించారు మాదాపూర్‌ పోలీసులు. నాగార్జునకు చెందిన N కన్వెన్షన్‌‌ను ఇటీవలే కూల్చివేసిన విషయం తెలిసిందే. చెరువును కబ్జా చేసి N కన్వెన్షన్‌‌ నిర్మించారని హైడ్రా దాన్ని కూల్చివేసింది. తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి N కన్వెన్షన్ కట్టారని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి.

కాగా దాని పై హైడ్రాకు మరోసారి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులు పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు ఆక్రమణకు గురైనట్టు నిర్ధారించి కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చారు. ఇక అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య జంబో జేసీబీలతో కన్వెన్షన్‌ ను గంటల వ్యవథిలోనే అధికారులు కూల్చివేశారు. ఈ మేరకు ఈ విషయంపై నాగార్జున స్పందిస్తూ.. ఆ భూమి పట్టా భూమి అని ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదనీ అన్నారు.

మరోసారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..

Advertisement

ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిదని కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేసినట్లు నాగార్జున తెలిపారు. తాజాగా ఇప్పుడు మరోసారి నాగ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కసిరెడ్డి భాస్కరరెడ్డి. మరి దీని పై నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి మరి. మరోవైపు మంత్రి కొండా సురేఖ సమంత, అక్కినేని ఫ్యామిలీ పై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దాంతో కొండా సురేఖ పై నాగ్ లీగల్ యాక్షన్ కు సిద్ధమయ్యారు.

Advertisement
Continue Reading

Featured

Rajendra Prasad: టాలీవుడ్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో మరణించిన కూతురు!

Published

on

Rajendra Prasad: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కమెడియన్, విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది. రాజేంద్ర ప్రసాద్‌ కూతురు గాయత్రి (38) తాజాగా గుండె పోటుతో మృతి చెందింది. కార్డియాక్‌ అరెస్ట్‌ కావడంతో నిన్న హైదరాబాద్‌ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తాజాగా శనివారం మరణించారు గాయత్రి.

Advertisement

రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. బిడ్డ మరణంతో రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. దీంతో విషయం తెలుసుకున్న పలువురు సెలబ్రిటీలు రాజేంద్రప్రసాద్ కు ధైర్యం చెప్పడంతో పాటు ఆమె మరణం పట్ల దిగ్భ్యాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా గాయత్రి కూతురు తేజస్విని చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. మహానటి సినిమాలో సావిత్రి చిన్నప్పటి పాత్ర వేసింది రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి కూతురే.

రాజేంద్ర ప్రసాద్ కుమార్తె మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. ఒక్కగానొక్క కూతురు ఇలా గుండెపోటుతో మరణించడంతో రాజేంద్రప్రసాద్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఇప్పటికే కొందరు సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు అక్కడికి చేరుకొని ఆయనకు ధైర్యం చెబుతున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!