ఏపీ వరద సహాయానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించిన ప్రభాస్!

గత పది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలను వరదలు ముంచెత్తాయి. అధిక వర్షాలు పడటంతో రాయలసీమలోని పలు జిల్లాలలో, నెల్లూరు జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లి పెద్ద ఎత్తున ఆస్తినష్టం, పంట నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఈ క్రమంలోనే వెంటనే ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సహాయం కోరుతూ వరద ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సహాయ చర్యలను చేపట్టింది. ఇదిలా ఉండగా ఏపీ వరద బాధితుల కోసం పలువురు సినీ ప్రముఖులు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ప్రకటించారు.

ఇప్పటికే ఎన్టీఆర్, మహేష్ బాబు, చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, గీత ఆర్ట్స్ అల్లు అర్జున్ వంటి వారు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ ఏపీ వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. త్వరలోనే కోటి రూపాయల చెక్కును సీఎం కార్యాలయానికి పంపించనునట్లు తెలుస్తోంది.

ఈ విధంగా ప్రభాస్ ఏపీ వరద సహాయ నిధికి కోటి రూపాయలు విరాళం ప్రకటించడంతో పెద్దఎత్తున ఆయన ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా కరోనా సమయంలో కూడా ప్రభాస్ 50 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్,పూజ హెగ్డే జంటగా రాధే శ్యామ్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ షూటింగ్ జరుగుతుంది. అలాగే ఆదిపురుష్ చిత్రంలో నటిస్తున్నారు.అలాగే మరికొన్ని సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.