Kumari Aunty: మరో బుల్లితెర షోలో సందడి చేసిన కుమారి ఆంటీ…ఈమెను నాశనం చేసేదాకా వదిలేలా లేరే?

Kumari Aunty: నాన్న బుజ్జి కన్నా అంటూ తన ఫుడ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుపుకుంటూ ఎంతో పాపులర్ అయినటువంటి వారిలో కుమారి ఆంటీ ఒకరు. ఈమె హైదరాబాద్లో ఫుట్ పాత్ పక్కన బిజినెస్ జరుపుకుంటూ ఎంతో పాపులర్ అయ్యారు. ఈమె పాపులారిటీ ఎంత అంటే ఏకంగా టీవీ షోస్ లో వచ్చే అంత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఈమె పేరుతో డిజె సాంగ్ క్రియేట్ చేసే అంతగా పాపులర్ అయ్యారు.

ఇలా ఫుడ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుపుకుంటూ ఉన్నటువంటి ఈమెను ఏకంగా బుల్లితెర సెలబ్రిటీగా మార్చేశారు. ఇటీవల బిగ్ బాస్ ఉత్సవం కార్యక్రమంలో సందడి చేస్తున్నటువంటి కుమారి అంటే తాజాగా ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా సందడి చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ కార్యక్రమంలో 90s వెబ్ సిరీస్ టీం కూడా పాల్గొని సందడి చేశారు. ఇక కుమారి ఆంటీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎప్పటిలాగే అందరికీ నాన్న బుజ్జి అంటూ ఫుడ్ పెడుతూ సందడి చేశారు. ఇలా ఈమె ఆ నాన్న ఏం కావాలి చెప్పు అంటూ మాట్లాడటంతో హైపర్ ఆది కలుగజేసుకొని ఇదే అసలైన బిజినెస్ ట్రిక్ అంటూ ఆమెపై సెటైర్ వేశారు.

అసలైన బిజినెస్ ట్రిక్..

ఇలా కుమారి ఆంటీ తాజాగా ఈ కార్యక్రమంలో కనిపించడంతో పలువురు ఈమె పట్ల వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏమైనా బుల్లితెర కార్యక్రమాలకు తీసుకువచ్చి తన బిజినెస్ మరింత పాపులర్ చేశారని కామెంట్లు చేయగా మరికొందరు ఈమెను ఇలా తీసుకువచ్చి సెలబ్రిటీ వచ్చేసి తర్వాత తనకు తన బిజినెస్ పట్ల కూడా ఆసక్తి లేకుండా చేస్తున్నారని ఇలా ఇప్పటికే ఎంతోమంది జీవితాలతో బుల్లితెర షోస్ ఆడుకున్నాయని ఇప్పుడు ఈమెను కూడా నాశనం చేసే వరకు వదిలేలా లేరే అంటూ కామెంట్లు చేస్తున్నారు.