ఉదయం నిద్ర లేవగానే బెడ్ టీ తాగుతున్నారా.. అయితే ఈ ముప్పు తప్పదు..?

ఉదయం లేవగానే చాలామంది తమ రోజును ఒక కప్పు టీ తో మొదలు పెడుతూ ఉంటారు. నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. కొంతమందికి అయితే ఆర్ టీ తాగకపోతే ఆరోజు అంతా పిచ్చి గా ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. అంతలా టి కి ఎడిక్ట్ అయిపోయారు. వీటిని చాలా మంది పెద్ద అలవాటుగా మార్చుకుంటూ ఉంటారు.

అయితే ఇలా ఉదయాన్నే టీ తాగడం వల్ల అది మలబద్ధకానికి దారి తీయడమే కాకుండా, నిధుల పై కూడా ప్రభావం చూపిస్తుందని ఒక నివేదిక హెచ్చరిస్తున్నారు.క్రమం తప్పకుండా టీ తాగడం వల్ల ఎముకలు పెళుసుగా మారతాయి అని అంటున్నారు. ఉదయం లేవగానే బెడ్ టీ తాగడం చాలా మందికి అలవాటు. ఒక కప్పు టీ లో 20 నుంచి 60 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది.

ఈ కెఫిన్ ఆరోగ్యానికి మంచిది కాదు.ఇలా క్రమం తప్పకుండా టీ తీసుకోవడం వల్ల రక్త నాళాలు కుచించుకుపోయి,రక్త పోటు పెరుగుతుంది. అసిడోసిస్ పెరుగుతుంది. ఇక ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఎసిడిటీ వస్తుంది. ఇలాంటి క్రమంలోనే ఉదయాన్నే కాఫీ తాగే ముందు గోరువెచ్చని నీరు లేదా సాధారణ నీరు తాగండి.

ఇలా గోరువెచ్చని నీరు లేదా సాధారణ నీటిని తాగిన తర్వాత టీ తాగండి. లేదంటే అల్పాహారంగా కొన్ని పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకుని ఆ తర్వాత టీ తాగడం మంచిది. నిరంతరం టీ తాగడం వల్ల దంతాలు పసుపు రంగులో కనిపిస్తాయి. అంతేకాకుండా టి ఎక్కువగా తాగడం వల్ల ఊబకాయం కూడా పెరుగుతుందని చెబుతున్నారు.