Trisha: నా వయసు దేశానికి సమస్యగా మారిపోయిందా… బుద్ధి లేదా అంటూ ఫైర్ అయిన త్రిష?

Trisha: సినీ నటి త్రిష ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె పట్ల నటుడు మన్సూర్ ఆలీ చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా ఈమె వార్తల్లో నిలిచారు. ఇదిలా ఉండగా తాజాగా మరోసారి త్రిష సోషల్ మీడియా వేదికగా కొన్ని సోషల్ మీడియా వెబ్ సైట్ లపై తీవ్ర స్థాయిలోఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమె నాలుగు పదుల వయసుకు దగ్గర పడుతున్నారు.

ఇలా 40 సంవత్సరాల వయసులో కూడా త్రిష పెద్ద ఎత్తున సినిమా అవకాశాలు అందుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఇదే విషయం గురించి కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్లో వార్తలను రాసాయి అయితే ఈ వార్తలపై త్రిష స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.గత కొంతకాలంగా నా వయసు గురించి వార్తలు రాస్తున్నా చూసి చూడనట్టు ఉన్నాను అయినా కూడా ఈ వార్తలు ఆగేలా లేవు అంటూ ఈమె స్పందించారు.

ప్రస్తుతం దేశానికి నా వయసే పెద్ద సమస్యగా మారిపోయింద. నేను నాలుగు పదుల వయసులోకి అడుగుపెట్టడంతో దేశ ఆర్థిక వ్యవస్థ డీలా పడిపోయింది. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటి గురించి కాకుండా నా వయసు గురించి ఇలాంటి పిచ్చి రాతలు పిచ్చి వీడియోలు చేయటానికి సిగ్గుగా లేదా? కొందరు బుద్ధిలేని వాళ్లు చేస్తున్న న్యూసెన్స్ ఇది అంటూ ఈమె స్పందించారు.

అవే నాకు గర్వకారణం…

నేను నాలుగు పదుల వయసులో కూడా సినిమా అవకాశాలు అందుకోవడం కొందరికి జీర్ణించుకోలేని విషయంలా ఉందనిపిస్తోంది నేను ఒక నటిని చనిపోయే వరకు సినిమాలలో నటిస్తాను. సినిమాలలో నటించే వారికి వయసుతో సంబంధం లేదని, ఈ మాత్రం కామెన్ సెన్స్ లేకపోతే ఎలా, నా అందం అభినయ సామర్థ్యాలు నాకు గర్వకారణం అంటూ ఈ సందర్భంగా త్రిష చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.